*సాయిబాబా పేరు ప్రఖ్యాతులు మహరాష్ట్ర రాష్ట్రంలో అంతగా తెలియక ముందే బొంబాయి నగరంలో శివారు ప్రాంతంలో నివశించే శ్రీమతి చంద్రాబాయి బోల్కర్ సాయి భక్తురాలైంది. ఆమె ఏడాదిలో ఆరు నెలలు షిర్డీలోనే నివసించి బాబాను సేవించేది.*
*సాయిబాబా నీటితో దీపాలు వెలిగించడం చూసిన ఈ భక్తురాలు ధన్యజీవి.*
*సాయిబాబాయే స్వయంగా చంద్రాబాయి గూర్చి చెపుతూ "ఈమె నాకు ఏడు జన్మలనుండి నాకు సోదరి " అని మట్లాడేవారు.*
*అందరికి అన్ని వరాలిచ్చే, కామధేనువు, కల్పవృక్షం మించిన శ్రీ సాయినాధుని సన్నిధిలో ఉన్నా ఆమెకు సంతానం కలగలేదు.*
*సాయిబాబా వరప్రసాది అని, తనకు సంతానం ప్రసాదించగలిగే మహితాత్ముడని అమెకు తెలుసు.*
*కానీ నిరంతరం సాయి దర్శన, సేవ భాగ్యము, తన అదృష్టంగా భావించే, చంద్రాబాయి, బాబాను తనకు సంతానం ప్రసాదించమని కోరలేదు.*
*అంతే కాదు బాబాను మనసావాచా అంకితభావంతో సేవిస్తున్న తాత్యాకోతే పాటిల్ కు కూడా సంతానము లేదు.*
*చంద్రాబాయి బాబాతో, తాత్యాకు సంతానము ప్రసాదించమని కోరేది.*
*బాబా సమాధి చెందక పూర్వము చివర రోజులలో, బాబా చంద్రాబాయిని ఇలా అడిగారు " అమ్మా ! నీ కోరిక ఏమిటి ? అని అడగగా అందుకు ఆమె "బాబా ! నీవు సర్వజ్ఞుడవు, ఎవరికి ఏది అవసరమో, ఎవరి మనసులో ఏమి కోరుతున్నారో నీకు తెలియనిది ఏమీ లేదు " అని జవాబిచ్చినది.*
*ఆమె బాబా దేహం విడిచే అవసాన సమయాన సాయినాధుని నోట్లో నీరు పోసి, పాదాలు కడిగిన భాగ్యశాలి.*
*ఆమె వయసు ఏభయి దాటిపోయి, అమెకు సంతానం కలిగే అవకాశమే లేదన్న సమయములో బాబా అనుగ్రహముచే సంతానము కలిగింది.*
*కొన్నాళ్లకు ఆమె గృహమే సాయి మందిరమైంది.*
No comments:
Post a Comment