*సాయిబాబా మహా సమాధి చెందక పూర్వమే సాయి అనుజ్ఞతో నిర్మించిన ప్రప్రథమ సాయి మందిరం, మహారాష్ట్రలోని పుణే - కళ్యాణ్ రైలు మార్గములో భీవపురి అనే గ్రామములో కలదు.*
*ఈ ప్రధమ సాయి మందిర నిర్మాణ కర్త శ్రీ కేశవ రామచంద్ర ప్రధాన్.*
*సాయి నాధుడే ప్రత్యక్షంగా ఈ మందిరం లో ఉన్నట్లు భక్తులకు అనేక అనుభవాలు కలిగినవి.*
*ఆ తరువాత మందిరము దర్శనం కొరకు భక్తుల ప్రవాహం అధికమైనది. వచ్చేవారికి కనీస సౌకర్యాలు కల్పించాలని రామచంద్ర ప్రధాన్ నిరంతరం ఆలోచించేవాడు.*
*1939 సం .లో ప్రధాన్ మరణించటంతో, మందిర నిర్వహణ బాధ్యత ఆయన అల్లుడు వి .వి .గుప్తే స్వీకరించాడు*
*భక్తుల సౌకర్యములు ఏర్పాటుకు తగినంత డబ్బు లేక ఇబ్బంది పడేవారు.*
*అందుకని సాయి భక్తుడైన నారాయణ పురోహిత్ అనే వ్యక్తితో "శ్రీ సాయి సచ్చరిత్ర " పారాయణం ప్రారంభించారు.* *పారాయణలో శ్రద్ధను బట్టి ఫలితం ఉంటుందని అందరికీ తెలుసు. పారాయణ ప్రారంభించిన మూడు, నాలుగు రోజులు తరువాత ఒకనాటి రాత్రి ఆ మందిర పురోహితునికీ బాబా స్వప్నంలో కనిపించి " నా ధుని ఎక్కడా ? ధుని లేనిదే షిరిడీ ఎలా కాగలదు ? "అని ప్రశ్నించారు.*
*ఇంకా అతనిపై రాళ్ళు రువ్వారు ఆ స్వప్నంలోనే. ఆ స్వప్నానికి పురోహితుడు ఆశ్చర్యపోయాడు.*
*జరిగిన సంఘటనకు కొంత ఉదాసీనంగా ఉండుట చూసి, మరునాటి రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని హెచ్చరించాడు.*
*ఆ రోజు పారాయణం అనంతరం పురోహితుడు తన స్వప్న వృత్తాతంతం గూర్చీ, అక్కడకు దూరాన గల దాదర్ పట్టణంలో నున్న గుప్తే గారికి విన్నవించాడు.*
*అది విన్న గుప్తే కొందరి సాయి భక్తుల సహకారంతో ధుని నిర్మాణం జరిగిపోయింది. విచిత్రంగా కావలిసిన ధనం సమకూరింది.*
*8 అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు తో ధుని నిర్మితమైనది.*
*1949 సం .శ్రీరామ నవమి రోజున ఆ ధునిని సాయి సచ్చరిత్ర రచించిన హేమాడ్ పంత్ మనుమడైన శ్రీ AR వాల్వాల్కర్ చేతులచే ధుని ప్రారంభించబడినది.*
*సాయినాథుని లీలలకు అంతేమున్నది.*
*సాయి సేవక్ గా పిలువబడే శ్రీ శివనేశన్ స్వామి గారు షిర్దీలో ద్వారకామాయిలో గల ధునికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు.*
*మనకు షిరిడీలో ముగ్గురు మాతలు ఉన్నారు అని అంటారాయన.*
*1 ద్వారకామాయి 2 సాయి మాత*
*3 ధుని మాత.*
*ధుని సాయి మందిరానికి కలికి తురాయి.*
*సాయి మందిరములో గల "ధుని మాతకు "ప్రణతులు అర్పిద్దాం.*
*పునీతులవుదాం.*
No comments:
Post a Comment