*యజ్ఞ యాగాదులు చేయలేనివారు కేవలం భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు.*
*ఏ నామాన్ని స్మరించాలి ?*
*ఈశ్వరుని నామాలు అనంతాలు. ఆయన అనంతుడు. "సహస్రనామాలు "అంటాము మన సౌలభ్యం కోసం. దైవగుణాలు వర్ణించేవి ఆ నామాలు. స్వామి లీలలు తెలియచేసే అర్ధాలు గల పదాలు అవన్నీ.*
*సకల లోకాలలో వసిస్తాడు కాబట్టి "వాసుదేవుడు ".* *విశ్వమంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి*
*"విష్ణువు ".*
*వామన అవతారంలో ముజ్జగాలు ఆక్రమించాడు కాబట్టి "త్రివిక్రముడు ".* *"నరసింహుడు "అనగానే ప్రహ్లాదుని భక్తి తత్పరత గుర్తుకువస్తుంది.*
*ఒకొక్క నామంతో అనేక పురాణ పవిత్ర గాథలు ముడిపడి వున్నాయి.*
*వాటిని తలచుకోగానే భక్తీ ప్రపూర్ణము అవుతుంది.*
*మన విశ్వాసాలను అనుసరించి, ఇష్టమయిన ఏ భగవానామన్నైనా జపించవచ్చు.*
*అకాశం నుంచి భుమిపై పడే నీరు వివిధ నామాలు గల నదీ నదాల ద్వారా సముద్రాన్ని చేరుతుంది.*
*భక్తితో ఏ నామాన్ని స్మరించినా అది కేశవుడికే చెందుతుంది.*
*వివిధ నామాలతో తనను పిలుస్తున్న అందరినీ స్వామి సమరస దృష్టితోనే చూస్తాడు.*
*ఆయన కరుణా స్వభావం తండ్రి వంటిది. తండ్రి తన బిడ్డలను సమముగా భావిస్తాడు. ఒక్క పిలుపుతో పలికే స్వామి పదే పదే తన నామస్మరణ గావించేవారిని ఉపేక్షిస్తాడా ?*
*ఆవులించినా, తుమ్మినా, దైవ నామ స్మరణం చేయడం ఒక సాంప్రదాయం. భోజనానికీ ముందూ వెనుకా గోవింద నామ స్మరణ చేస్తుంటారు.*
*తమ సంతానానికి దైవ నామాలు పెట్టడము ఒక ప్రాచీన ఆచారం.*
*దైవనామాలే పవిత్ర మంత్రాలు.*
*నారదుడు ధ్రువుడుకి "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రం ఉపదేశించాడు.*
*మహార్షులు వాల్మీకి కి "రామ " అనే తారక మంత్రాన్ని ఉపదేశించారు.*
*"నమఃశివాయ" పంచాక్షరీ తారకనామాన్ని జపిస్తూ పోతన, రామదాసు, త్యాగయ్య లాంటి ముక్తిని పొందారు.*
*"హేరామ్ " అంటూ మహాత్ముడు ఇహలోకం విడిచాడు.*
*సహస్రాధిక నామాలు గల ఈశ్వరుడి పేర్లలో ఏది శ్రేష్టం ?"*
*ఓం "అనే ప్రణవం శ్రేష్టం అని వేదం తెలిపింది.*
*కాబట్టే ఏ నామానికి అయినా ముందు "ఓం " చేర్చి స్మరించడం భక్తికీ ముక్తికీ సులభసాధనమైన నామస్మరణం కలియుగంలో సర్వసమాదరణీయం.*
No comments:
Post a Comment