*సాయిబాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్ దేవ్ కు జ్ఞానేశ్వర మహరాజ్ రచించిన " జ్ఞానేశ్వరి " గ్రంథాన్ని పారాయణం చేయాలనీ కోరిక ఉండేది.*
*సాయిబాబా ఆయన కోరిక మన్నించారు.*
*దేవ్ జ్ఞానేశ్వరి పారాయణ ప్రారంభించాడు.*
*బాబా అయనకు స్వప్నములో కనిపించి " గ్రంథం పారాయణ చేస్తున్నావు కదా, గ్రంథం అర్ధమవుతుందా ? " అని ప్రశ్నించాడు.*
*"లేదు " అని దేవ్ అని జవాబిచ్చాడు."*
*గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుచున్నావు ఏదీ, నా దగ్గర కూర్చోని చదువు " అని బాబా చెప్పారు.*
*దేవ్ పారాయణలో తాను చేసే పొరపాటును గుర్తించాడు.*
*బాబా సూచనను గ్రహించి, బాబా సలహాను పాటించాడు.*
*అధ్యాత్మిక మార్గములో పయనించే ప్రతీ ఒక్కరికీ బాబా మాటలు వర్తిస్తాయి.*
*ఉదాహరణకి : పారాయణం చేయడం ఒక కార్యక్రమముగా పెట్టుకున్నప్పుడు, ఆ రోజు చేయవలిసినా నిత్య పారాయణం తొందరగా పూర్తిచేయడానికి ప్రయత్నించరాదు.*
*చదివే ప్రతీ పంక్తిని అర్థం చేసుకుని ముందుకి సాగాలి.*
*తొందరగా పారాయణం ముగుంచుకుని, వేరే పనికి ఉపక్రమించుదామని ఆలోచన మనసులోకి రాకూడదు.*
*పారాయణ సమయములో మనసునిండా సాయినాధుడే కొలువుండాలి.*
*అది సాయిబాబా దేవ్ కు చెప్పిన పలుకులలో అర్థం.*
No comments:
Post a Comment