*శ్రీసాయినాధ అష్టోత్తర శతనామావళి.*
*" ఓం భక్త పరాధీనయ నమః ."*
*పరమాత్ముఁడు భక్త పరాధీనుడు.*
*భక్తుడు శ్రద్దా విశ్వసాలతో "స్వామీ " అని పిలిస్తే, ఆయన " ఎమీ అని రాకతప్పదు.*
*అల వైకుంఠ పురములో ఉన్న గజాననుడు మనసారా శివుని కొలిచాడు. వరం కోరుకోమన్న శివుని తన గుండెలలో ఉండి పోమన్నాడు.*
*అంతే ! శివుడు అతని గుండెలో ఉండిపోయాడు.*
*పాండురంగడు పుండరీకుని భక్తి శ్రద్ధలకు మెచ్చి ప్రత్యక్షమయ్యడు*
*పుండరీకుడు తన తల్లితండ్రుల సేవ పూర్తి అయ్యేవరకు, స్వామిని నిలిచి ఉండమని ఒక ఇటుక రాయి చూపించాడు.*
*ఇక పాండురంగనికి పుండరీకుని అభ్యర్ధన మన్నించక తప్పలేదు.*
*ఆ ఇటుకరాయి మీదే కటి హస్తుడై ఆలాగే నిలిచిపొయాడు.*
*నాటికీ నేటికీ.*
*మరి సాయిబాబా సంగతి కూడా అంతే ! భక్తితో, ప్రేమతో తాత్యాకోతే పాటిల్ ఆయన చేత సాధికారికంగా కఫనీలను మార్పించేవాడు. జలతారు సెల్లాలు కప్పేవాడు.*
*బాబా అతని ప్రేమకు లొంగి ఊరుకొనేవాడు.*
*అభిషేకాలూ వగైరా ఉపచారాలు బాబాకు నచ్చేవి కావు.*
*అయినాసరే మేఘశ్యాముని భక్తీ కి లొంగిపోయి గోదావరి నీటితో, అభిషేకము చేస్తుంటే కూర్చోని నీళ్లన్నీ పోయించుకొన్నాడు.*
*అలాంటి భక్త పరాధీనునికి ఇవే భక్తి పూర్వక ప్రణామములు.*
No comments:
Post a Comment