*సాయిబాబా షిరిడీలో ఉన్న కాలంలో, షిరిడీకి వచ్చిన భక్తులు స్వచ్ఛంధంగా అనేక రకాల సేవలు చేస్తుండేవారు.*
*బాబా భక్తుడైన జ్యోతిన్డర్ తర్ఖడ్ షిరిడీలో, ద్వారకామాయిలో పెట్రొమాక్స్ లైట్లు శుభ్రం చేయడం, సాయంకాలము వాటిని వెలిగించి ద్వారకామాయి అంతటా వాటి స్థానాలలో వేలాడదీయడం, వంటి పనులు చేసేవాడు.*
*ఒకసారి బాబాతో తాను ద్వారకామాయిలో దీపాలు వెలిగించనని, ఎందుకనగా లాంతరు వెలిగించగానే ఎన్నో పురుగులు దీపాలు చుట్టూ చేరి, కొంతసేపు తిరిగి క్రిందపడి చనిపోతున్నాయని చెప్పి, దీపాలు వెలిగించకపోతే పురుగులు చనిపోవని బాబాకు వివరించాడు.*
*అది విన్న బాబా " హే ! భావు ! నీవు లాంతరులు వెలిగించకపోవడం మాత్రాన, ఆ పురుగులన్నీ చనిపోవా ?*
*ఇక్కడ కాకపొతే అవి ఎక్కడ దీపాలు వెలుగుతున్నాయో అక్కడకి పోయి చస్తాయి.*
*ఇది అంతా భగవంతుని సృష్టి.*
*జీవి పుట్టే సమయములోనే చావును కూడా నిర్ణయిస్తాడు.*
*ఒకవేళ లాంతర్, దీపం లేకపొతే మరొక ప్రాణి వాటిని అంతం చేస్తుంది.*
*ఈ విధమైన పనుల వలన మానవులకు పాపాలు జమకావు.*
*నీ ముఖ్య ఉద్దేశం ద్వారకామాయిలో దీపాలు వెలిగించి, చీకటిని తొలగించి భక్తులు సేవలు చేసికొనుటకు.*
*నీవు ఎటువంటి పాపము చేయడం లేదు " అని బాబా చెప్పారు.*
*మనం భగవంతుని పనులలో కల్పించుకోరాదు. ఆయన ప్రాణం పొసినప్పుడే, దాని పక్కనే మరణము కూడా నిర్ణయిస్తాడు. అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా, నీవు భగవంతుని సేవ చేస్తూ ఉండు. దేవుడు నీ యడల దయగా ఉంటాడు.*
*( అల్లహ్ అచ్ఛా కరేగా ).*
No comments:
Post a Comment