*నామ స్మరణ.*
*" మహాదేవుడైన శంకరుడు హాలాహలము తాగి వ్యాకులైనప్పుడు రామ నామమును స్మరించుటచేతనే ఆ కష్టము తొలగెను " అని ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు తన " దాస బోధ " గ్రంథంలో వివరించారు.*
*ఇంకా " పరమాత్ముడగు హరి నామము జపించి ప్రహ్లాదుడు తండ్రి బెట్టు పలు కడగండ్లనుండి బ్రతికెను " అని నామ ప్రాశస్త్యాన్ని అనేక ఉదారణలతో తెలిపారు.*
*ఇక సాయిబాబా సాహిత్యములో నవవిధ భక్తిమార్గాలు అశ్రయించి కృతకృత్యులైన వారెందరో ...అందులో ఒక సంఘటన.*
*అది మార్చి నెల 31 వ తేదీ 1915 సం.*
*ఆనాడు సాయిభక్తుడైన బల్వంత్ నాచ్నే , అతని మిత్రుడైన మోరేశ్వర ఫన్శే ఇంకా మరికొందరితో దట్టమైన అడవిగుండా ఎడ్లబళ్లపై ప్రయాణం చేస్తున్నారు.*
*రహదారి ఎత్తుపల్లాలతో ఉండి, వారు పాంషెట్ కనుమ వద్దకు వచ్చారు.*
*ఆ ప్రదేశం పెద్దపులులు తిరిగే ప్రదేశం.*
*ఎద్దుల బండి ఒక చోట చేరగానే అకస్మాత్తుగా బండి ఎద్దులు వెనకకు నడవసాగాయి.*
*ఆ ప్రదేశం ఇరుకు దారి.*
*బండి ఏమాత్రం ప్రక్కకు కాస్త వొరిగినా బండిలో ఉన్నవారందరూ సమీపానగల లోయలో పడతారు.*
*ఎద్దులు ఎందుకు వెనుకకి పోతున్నాయో శాంతారాం చూశాడు.*
*ఎదురుగా దారిలో భయంకరముగా ఒక పెద్దపులి పడుకొని బండి వైపు చూస్తుంది.*
*పైగా దాని కనులు చీకటిలో మెరగసాగాయి.*
*ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుంది వారి పరిస్థితి.*
*బండి వెనుకకు పోకుండా పెద్ద రాయిని పెట్టేందుకు దిగుదామని శాంతారాం అనుకున్నాడు.*
*వెంటనే సాయిభక్తుడైన నాచ్నే "జై సాయిబాబా ! పరుగున వచ్చి ఈ ఆపదనుండి కాపాడు !"అని పెద్దగా అరిచాడు.*
*ఎక్కడో షిరిడీలో నున్న సాయిబాబాకు సాయి నామం వినబడింది.*
*ఇంతలో హట్టాతుగా ఆ పులి కి భయం వేసి బండి పక్కనుండే పరుగున పారిపోయింది.*
*వారు సాయినామ స్మరణ చేసి ఆ గండం నుండి బయటపడ్డారు.*
*నాచ్నే మరియు మిగతావారికి అడవిలో అర్ధరాత్రి పులివలన ప్రాణహాని కలుగలేదు.*
*అదే సాయినామ మహిమ.*
*ఏ కాలమందైనా, ఎక్కడైనా నిరంతరం సాయిని స్మరించెదము గాక !*
No comments:
Post a Comment