Thursday, May 16, 2024

సాయి సచ్ఛరిత్రలో 17 వ అధ్యాయములో బ్రహ్మ జ్ఞాన వివరణ కనిపిస్తుంది.* *బ్రహ్మజ్ఞానమనగా ఈ సకల సృష్టి దేనియందు పుట్టి, పెరిగి, లయమవుతుందో ఆ సద్వస్తువే " బ్రహ్మము ".*

 *సాయి సచ్ఛరిత్రలో 17 వ అధ్యాయములో బ్రహ్మ జ్ఞాన వివరణ కనిపిస్తుంది.*


*బ్రహ్మజ్ఞానమనగా ఈ సకల సృష్టి దేనియందు పుట్టి, పెరిగి, లయమవుతుందో ఆ సద్వస్తువే " బ్రహ్మము ".*


*ఇది నిత్యసత్యమైనది.*

*స్వయం ప్రకాశమైనది.*

*ఆ సద్వస్తువే అనగా భగవంతుడు లేదా బ్రహ్మము మానవ దేహంలో "ఆత్మ స్వరూపంగా " ప్రతిష్ఠితమై ఉన్నాడు.*


*ఆ పరబ్రహ్మమూ, మానవదేహములోని ఆత్మా ఒకటే అని వేరుకాదనే అను ప్రత్యక్ష అనుభవము కలగడమే "బ్రహ్మ జ్ఞానమంటారు ".*


*బ్రహ్మ జ్ఞానం కలిగిన మానవులకు ఈ జగత్తులోని సమస్తమూ తమవే అవుతాయి. తాను తప్ప ఈ జగత్తులో రెండో వస్తువు లేదన్న భావన కలుగుతుంది.*


*అందువలన ఎటువంటి భీతి వుండదు. సర్వమును అరచేతిలోని ఉసిరికాయ వలె అవగతమవుతుంది.*

 *సమస్త దుఃఖాల నుండి చింతల నుండి నివృత్తి కలుగుతుంది.*

*పరమానంద స్ధితి లభ్యమవుతుంది.* *పునర్జన్మ వుండదు.* 


*అందుకే బ్రహ్మజ్ఞానం పొందటం అవసరం.*

*ఈ అధ్యాయములోనే మనసును ఎలా స్వాధీన పరుచుకోవచ్చును ? అన్న విషయము ప్రస్తావించబడినది.*


*మనసు నిరంతరమూ బహిర్ముఖమై, దృశ్య విషయాలతో మమేకమై, బంధంగా పరిణమిస్తుంది.*

*ఏఏ సంకల్పముల వలన, మనసు బహిర్ముఖమై, దృశ్య విషయాలపై పోవుచున్నదో గమనించి, ఆ సంకల్పముల నుండి మనసును మరల్చి అంతర్ముఖం చేయుట ద్వారా మనసును స్వాధీన పరచుకోవచ్చును.*

No comments:

Post a Comment