*అది 1914 సం. ఏప్రియల్ నెల. శిరిడీ గ్రామమంతా శ్రీరామ నవమి ఉత్సవాల సంబరాలతో భక్తులతో కిటకిటలాడుతోంది.*
*ద్వారకామాయిలో సాయినాథుని చుట్టును వందలాది భక్తులు మూఁగి ఉన్నారు.*
*ఎక్కడ నుంచో ఒక వృద్ద మహిళ సాయి దర్శనానికి షిరిడీ ద్వారకామాయికి వచ్చింది.*
*ఆ వృద్ద మహిళ జనమును త్రోసుకు పోలేక ద్వారకామాయి బయట బిగ్గరగా అరుస్తుంది.*
*ఆ ఆక్రందనలు బాబా చెవికి సోకకుండా ఎలాగుంటుంది ?సాయిబాబా సమకాలికుడు నాగపూరు నందు ఉండే తాజుద్దిన్ బాబా.*
*ఆయన అక్కడ రాజసౌధంలో ఉండగా తార అనే భక్తురాలు తాజుద్దిన్ బాబాకు భోజనం సమర్పించాలని భోజనం సిద్ధం చేసింది.*
*ఇక ఆయన గూర్చి విచారిస్తే బాబా రాజసౌధంలో ఉన్నాడని అక్కడవారు చెప్పారు.*
*ఆ పేదరాలు రాజసౌధంలో ప్రవేశించటం ఎలా సాధ్యం ?అని సందేహించింది. కానీ లోపల పోవటానికి ప్రయత్నం చేయలేదు.*
*ఆ రాజసౌధం ముఖ ద్వారం దగ్గర ఉన్న నేరేడు చెట్టుకు తాను తయారుచేసిన ఆహారాన్ని తుండుగుడ్డలో కట్టి వ్రేలాడదీసింది.*
*ఇక తాజుద్దీన్ బాబాకు మనసులోనే నమస్కరించి ఇంటి ముఖం పట్టింది*
*అక్కడ రాజసౌధంలో తాజుద్దిన్ బాబాకు షడ్రసోపితమైన భోజనం సిధ్ధంగా ఉంది.*
*కానీ ఆయన రాజసౌథం నుండి బయటకి వచ్చి, నెరేడు కొమ్మకు కట్టిఉన్న ఆహారాన్ని తీసుకుని తృప్తిగా భుజించారు.*
*ఆవిధంగా ఆ పేదరాలు సమర్పించిన నివేదన, బాబా స్వీకరించి ఆమెను అనుగ్రహించారు.*
*ఇక శిరిడీలో బాబా భక్తుడైన శ్యామాను పిలచి, ద్వారకామాయి బయట తన దర్శనం కొరకు విలపిస్తున్న ఆ వృద్ధురాలిని తన దగ్గరకి పిలిపించుకున్నారు.*
*ఆమె సంతోషానికి అవధులు లేవు.*
*తన రెండు చేతులతో సాయిబాబా నడుమును చుట్టివేసింది*
*బాబా ఆమె ప్రేమకు ముగ్దుడై ఆమెతో " అమ్మా !నీ కొరకు ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్నాను.*
*నాకొరకు తినడానికి ఏమి తెచ్చావు ?" అని అడిగారు.*
*వెంటనే ఆ ముదుసలి బాబాతో " ఇదిగో బాబా ! నీ కొరకు చల్ది రొట్టె ముక్క.*
*దానితోపాటు ఈ ఉల్లిగడ్డ. నేనొక రొట్టె, రెండు ఉల్లిగడ్డలు తీసుకుని నీ దర్శనము కొరకు బయలుదేరాను. దారిలో ఆకలివేసి సగము రొట్టెను, ఉల్లిపాయను తిన్నాను. మిగిలినవి ఇవిగో " అని సాయిబాబాకు ఇచ్చింది.*
*బాబా తృప్తిగా వాటిని తిని " అమ్మా ! నీవు తెచ్చిన రొట్టె ఎంత మధురముగా వుందో తెలుసా ? " అని బాబా చెప్పగా ఆ తల్లి*
*ఆనందమునకు హద్డులేదు.*
*ఇక మనము బాబాకు, సమర్పించే మధుర నైవేద్యమునకు సంతసించునుగాక.*
*ఒక సేకరణ*
No comments:
Post a Comment