Thursday, May 16, 2024

సాయిబాబా అక్టోబర్ 15 - 1918 నాడు మహా సమాధి చెందారు. సాయి చిత్రపటం, సాయి సమాధి ఆరాధనీయమైనది.* *సాయి భక్తుడు శ్రీ స్వామి కేశవయ్య జీ. ఆయిన గృహమేసాయి నిలయం. అది మద్రాస్ మహానగరంలో షెనాయ్ నగర్ లో ఉన్నది.*

 *సాయిబాబా అక్టోబర్ 15 - 1918 నాడు మహా సమాధి చెందారు. సాయి చిత్రపటం, సాయి సమాధి ఆరాధనీయమైనది.*


*సాయి భక్తుడు శ్రీ స్వామి కేశవయ్య జీ. ఆయిన  గృహమేసాయి నిలయం. అది మద్రాస్ మహానగరంలో షెనాయ్ నగర్ లో ఉన్నది.*


*సాయి నిలయం నుండి గురువారం పూజలు జరుగుతూ ఉండేవి. తగినంత స్థలము లేకపోవుట వలన కొన్ని గంటలసేపు భక్తులు వీధిలోనే క్యూలోనే నిలబడేవారు.* 

*ఈ అసౌకర్యము తీర్చడానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో సాయి నిలయం ఏర్పాటు చేశారు.*

*మార్చి 14 1975 సంవత్సరంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగినది.*


*షెనాయినగర్ సాయి నిలయం ఆనాడే రెండవ శిరిడీగా పేరు గడించుకున్నది.*

*ఆనాడే మూడున్నర లక్షలు రూపాయలు  వ్యయంతో రూపుదాల్చిన ఈ మందిరము చూడ చక్కని ప్రశాంత ప్రదాయిని.*

*ఒకేసారి వెయ్యి మంది దర్శించుకో దగ్గ హాలు ఉన్నది.*

*చక్కని పాలరాళ్లతో నిర్మితమైన గర్భాలయంలో, అంతకంటే చక్కని మందహాసంతో జగదేక పూజితుడైన శ్రీ సాయిబాబా నిలువెత్తు చిత్రపటం ఉంచారు.*


*సాయి పటం ముందు షిరిడీలో వలె పాదుకలు ఉంచబడ్డాయి.*


*ఒక మాటలో చెప్పాలంటే జీవకళతో ఉట్టిపడే శ్రీ సాయిబాబా పటం భక్తుల హృదయాల్లో నిశ్చలమైన భక్తి భావము కలిగించేది.*


*ఈ మందిర నిర్మాణంలో ఉన్న రోజుల్లో, ఈ మందిరాన్ని తిలకించిన ప్రముఖ వైద్యులు శ్రీ సురేంద్ర గారు ఇలా అనుకున్నారు " స్వామి కేశవయ్య జీ అనంతరం ఈ మందిరము ఏమవుతుందో, ఏమిటో అని.*

*ఆ రాత్రి ఆయనకు కల వచ్చినది. సాయిబాబా కలలో కనిపించి ''వెర్రివా డా ! నా భక్తులను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళతాను? కంటికి రెప్పలాగా నేను వాళ్లను కాపాడుతూ ఉంటాను. నేను ఆ మందిరంలోనే ఉంటాను" అంటూ శ్రీ సాయిబాబా మందిరములోకి ప్రవేశించి ఆసీనులైనారట.*


*నేటికీ, సాయిబాబా ఆ సుందర దివ్య చిత్రపటంలోనే సాక్షాత్కరిస్తుంటారు.*


*(ఇప్పటికీ ఆ మందిరంలో విగ్రహం లేదు) ఆనాడు-ఈనాడు సాయి వెన్నెల వ్యాపిస్తూ ఉంటుంది.ఈరోజు మార్చి 14- ఆ సాయి నిలయము లో వలె సాయి మనలో ఉండు గాక!*


*జై సాయినాథ*

No comments:

Post a Comment