Monday, September 9, 2024

*ఓంకార రూప సాయి* *వేదాలకు మూలమైన ప్రణవ స్వరూపంగా దివ్య దర్శనం ఇస్తున్న అపురూప సాయి తైలవర్ణ చిత్ర పటం.*

*ఓంకార రూప సాయి*


*వేదాలకు మూలమైన ప్రణవ స్వరూపంగా దివ్య దర్శనం ఇస్తున్న అపురూప సాయి తైలవర్ణ చిత్ర పటం.*

*పూర్వం ఈ తైలవర్ణ చిత్ర పటం చావడిలో స్త్రీలు ప్రవేశించే ఉత్తర గోడనానుకొని, ద్వారం ముందు భాగంలో వుండేది.*

*మన సాయి చావడిలో నిద్రించే రోజున శేజ్ ఆరతి, మరురోజు కాకడ ఆరతి ఈ పటం వున్న స్థానంలో కూర్చునేవారు.*

*ఈ ప్రణవ సాయి చిత్రాన్ని  నౌసారి ( నవసరి ) గ్రామానికి చెందిన అంబారామ్ లాల్ భాయ్ కహర్ అనే 18 సంవత్సరాల యువకుడు 1953 చిత్రించాడు.*

*సాయి ప్రసాదించిన అద్భుతమైన స్వప్న సాక్షాత్కార ఫలితంగా అతడు అంత చక్కటి పటం చిత్రీకరణ చేయగలిగాడు.*

*అంబారామ్ ఈ చిత్రపటాన్ని నౌసారిలో వున్న అవతార్ మెహర్ బాబా కేంద్రం కు ఇచ్చారు.*

*ఈ అత్యద్భుతమైన పటాన్ని చూసి, బాబా లీలకు ముగ్ధులైన నౌసారి గ్రామస్తులు,  చెందారు వసూలు చేసి,  6 అడుగుల 4 అంగుళాల పటానికి అందమైన ఫ్రేము కట్టించి, శిరిడిలో వుంటే బాగుంటుంది అని రెండు రోజులు అఖండ సాయి నామ జపం, పూజలు నిర్వహించి, పెద్ద ఉత్సవంగా షిరిడీకి ఫిబ్రవరి 1953లో  తీసుకుని వచ్చి సాయి సంస్థానానికి సమర్పించారు.*

*సంస్థానం వారు ఈ అరుదైన చిత్రపటాన్ని సమాధిపై, సమాధి మందిరంలో వుంచాలి అని అనుకున్నారు.*
*అప్పటికే సాయి మూర్తి ( విగ్రహం ) చెక్కించే పనులు చురుకుగా సాగుతున్న కారణంగా, చిత్రపటాన్ని చావడిలో ఉంచారు.*

*ఈ చిత్రంలో కుడివైపు ఆంగ్లంలో చిత్రకారుడు అంబారామ్ పేరు వుంటుంది.*

*ప్రస్తుతం ఈ చిత్ర పటం సాయి పారాయణ హాలులో వుంది*

Sunday, September 1, 2024

శ్రావణ కృష్ణ అమావాస్య* *మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

 శ్రావణ కృష్ణ అమావాస్య*

*మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

*ఉత్తర భారతదేశంలో* 
*" హరియాలి అమావాస్య " అంటారు*

*కొద్ది రాష్ట్రలలో వారి సాంస్కృతిక, సాంప్రదాయం ప్రకారం ఈ రోజు పండుగగా జరుపుకుంటారు.*

*శిరిడీలో, మహారాష్ట్రలో* 

*" పోలాల అమావాస్య "ఎంతో వైభవంగా జరుపుకునే విషయం మనకు తెలిసిందే.*

*మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం*

*మహారాష్ట్రీయులు ఈ రోజు తమ  పాడి పంటలు వృద్ధి కోసం శ్రమ పడిన పశు సంపదకు కృతజ్ఞతగా పూర్వకంగా పూజలు నిర్వహిస్తారు.*
*వాటికి అభ్యంగనస్నానం, వివిధ రకాల అలంకరణలు చేసి, పూజలు చేస్తారు.* 

*పిండి వంటలతో షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగింపు చేయిస్తారు*  

*సమాధి మందిరంలో, మధ్యాహ్న ఆరతికి ముందు సాయి మూర్తికి ( విగ్రహానికి ) ఇరువైపులా మట్టితో చేసిన రంగు రంగుల 5 ఎద్దులు, 1 ఆవు, దూడల ప్రతిమలను ఉంచుతారు.*
*వాటికి  గంధం, పుష్పాలతో పూజ చేసి నైవేద్యంగా వరి అన్నం, పూర్ణ పోళీలు సమర్పిస్తారు.*

*శిరిడిలో సాయంత్రం అలంకరించిన తమ పశు సంపదను గేట్ నెంబర్ 4 ద్వారా తీసుకుని వచ్చి సమాధి మందిరం కిటికీ దగ్గర నిలబెట్టి సర్వజీవ కారుణ్యమూర్తి సాయిని దర్శింప చేస్తారు.*

*( ప్రస్తుత కారణాల వలన ఈ రోజు పశు సంపదకు దర్శన ఏర్పాటు గురించి సమాచారం లేదు )*

*నిమ్నోకర్ భార్య, బేలాపూర్ ప్రయాణం కథ మనం సాయి సచ్చరిత్రలో పారాయణ చేసినదే.*

*నిమ్నోంకర్ ఆమెను రెండవ రోజే తిరిగి రావాలని ఆదేశించారు. ఆ రోజు అమావాస్య, అమావాస్య ప్రయాణానికి శుభసూచకం కాదని ఆమె సంశయిస్తుంది.*
*అది కాకుండా తన పిల్లలు, బంధువులతో " పోలాల అమావాస్య " రోజు గడపాలి అని మనసులోనే కోరుకుంటుంది.*

*సర్వాంతర్యామి సాయి ఆమె మనస్సు లోని కోరికకు అనుగుణంగా, బేలాపూర్ వెళ్లి నాలుగు రోజుల తరువాత తిరిగి షిర్డి రమ్మంటారు.*

సేకరణ, సమర్పణ

*చిల్లర కృష్ణమూర్తి*
06-09-2021