*వేదాలకు మూలమైన ప్రణవ స్వరూపంగా దివ్య దర్శనం ఇస్తున్న అపురూప సాయి తైలవర్ణ చిత్ర పటం.*
*పూర్వం ఈ తైలవర్ణ చిత్ర పటం చావడిలో స్త్రీలు ప్రవేశించే ఉత్తర గోడనానుకొని, ద్వారం ముందు భాగంలో వుండేది.*
*మన సాయి చావడిలో నిద్రించే రోజున శేజ్ ఆరతి, మరురోజు కాకడ ఆరతి ఈ పటం వున్న స్థానంలో కూర్చునేవారు.*
*ఈ ప్రణవ సాయి చిత్రాన్ని నౌసారి ( నవసరి ) గ్రామానికి చెందిన అంబారామ్ లాల్ భాయ్ కహర్ అనే 18 సంవత్సరాల యువకుడు 1953 చిత్రించాడు.*
*సాయి ప్రసాదించిన అద్భుతమైన స్వప్న సాక్షాత్కార ఫలితంగా అతడు అంత చక్కటి పటం చిత్రీకరణ చేయగలిగాడు.*
*అంబారామ్ ఈ చిత్రపటాన్ని నౌసారిలో వున్న అవతార్ మెహర్ బాబా కేంద్రం కు ఇచ్చారు.*
*ఈ అత్యద్భుతమైన పటాన్ని చూసి, బాబా లీలకు ముగ్ధులైన నౌసారి గ్రామస్తులు, చెందారు వసూలు చేసి, 6 అడుగుల 4 అంగుళాల పటానికి అందమైన ఫ్రేము కట్టించి, శిరిడిలో వుంటే బాగుంటుంది అని రెండు రోజులు అఖండ సాయి నామ జపం, పూజలు నిర్వహించి, పెద్ద ఉత్సవంగా షిరిడీకి ఫిబ్రవరి 1953లో తీసుకుని వచ్చి సాయి సంస్థానానికి సమర్పించారు.*
*సంస్థానం వారు ఈ అరుదైన చిత్రపటాన్ని సమాధిపై, సమాధి మందిరంలో వుంచాలి అని అనుకున్నారు.*
*అప్పటికే సాయి మూర్తి ( విగ్రహం ) చెక్కించే పనులు చురుకుగా సాగుతున్న కారణంగా, చిత్రపటాన్ని చావడిలో ఉంచారు.*
*ఈ చిత్రంలో కుడివైపు ఆంగ్లంలో చిత్రకారుడు అంబారామ్ పేరు వుంటుంది.*
*ప్రస్తుతం ఈ చిత్ర పటం సాయి పారాయణ హాలులో వుంది*

