Saturday, November 2, 2024

సాయి భక్త ప్రపంచంలో -- ధృవతార* *కాకాసాహెబ్ దీక్షిత్ - సూక్ష్మ పరిశీలన

*సాయి భక్త ప్రపంచంలో -- ధృవతార*

 *కాకాసాహెబ్ దీక్షిత్ - సూక్ష్మ పరిశీలన*




*1 నవంబర్ 1909*
*2 నవంబర్ 1909*

*1) సాయి అంకిత భక్తులు మిరికర్ తండ్రి కొడుకులు గృహంలో అహ్మద్ నగర్ లో బస.*

2) సాయి ఆహ్వానం - పటం   
       రూపంలో 

*(నానాసాహెబ్ చందోర్కర్ మేఘశ్యామాకు పూజ నిమిత్తం ఇచ్చిన శ్రీ సాయి బాబా చిత్రపటం  అద్దం పగిలి నందు వలన సరిచేయడానికి మిరీకర్ ఇంట్లో ఉండటంతో కాకాసాహెబ్ దీక్షిత్ సాయి దర్శనం చేసుకున్నాడు.)* 

*అంతేకాదు అంతర్లీనంగా ఆలోచిస్తే దీక్షిత్ ని షిరిడీకి ఆహ్వానించటానికి ఫోటో రూపంలో సాయే అక్కడ కొలువై ఉన్నారు. సాయిబాబా వారికి వారి చిత్రపటానికి ఏమాత్రం తేడా లేదని మనకు తెలుసు కదా!*

*3) శ్యామా అత్తగారికి అస్వస్థతగా ఉన్నదని టెలిగ్రామ్ రావడం, శ్యామా అహ్మద్ నగర్ బయలుదేరి వెళ్లడం, మిరికర్‌ను కలవడం అంత దీక్షితుని షిరిడికి ఆహ్వానించడానికి బాబా చేసిన ఏర్పాటు. దీక్షిత్ ను ఎవరితోపాటు శిరడి పంపాలి అని ఆలోచిస్తున్న మిరీకర్ కు శ్యామా కంటే వేరెవరూ మంచితోడు. శ్యామా సాయి ప్రతినిధి కదా!*

*4) దీక్షిత్, సాయిబాబా వారి చిత్రపటంతో, శ్యామాతో  సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణానికి సిద్ధమైనప్పటికి బాబా గార్డ్ రూపంలో వారిని ఫస్ట్ క్లాస్ లో ప్రయాణానికి ఏర్పాటు చేయటం.*


*5) రైలులో సాయి చిత్ర పటం సమక్షంలో శ్యామా  సాయి లీలలను మహత్తును చర్చించుకోవడం.*

*6) సాయిబాబా వారిని కలవాలనే కుతూహలాన్ని, లోనావాలాలో శ్రవణానంద పరిచయం దీక్షితుకు కల్పించిన నానాసాహెబ్ చందోర్కర్ కోవపర్గావ్ రైల్వే స్టేషన్లో కలవడం.*

*02-09-1909 సాయి ప్రత్యక్ష దర్శనం*

ఇంతటి భాగ్యం దీక్షితుకు ఎలా కలిగింది అనే అంశంపై ఒక పరిశీలన:

*దీక్షిత్ సాయిని పుణ్య పావన ప్రత్యక్ష దర్శనం చేసుకున్న సమయం*

 *" గురు పుష్య అమృత యోగం.*"
 
*పుష్యమి నక్షత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు బృహస్పతి (గురు) సంచారంతో సంపూర్ణమైన శుభసంయోగ వేళ*

*"గురు పుష్య అమృత యోగం అంటారు.*"

*25-07-1925 సాయిలో ఐక్యం కావడం*

రైలులో సచ్చరిత గ్రంధ రచయిత హేమాడ్ పంతు మరియు భజనమాల రచయిత రఘునాథ్,  టెండూల్కర్  తో సాయి లీలలను మహత్తును చర్చించుకుంటూ దీక్షిత్ సాయిలో ఐక్యం కావడం మరో గొప్ప విశేషం.

      *అనాయాస మరణం -* 
           *వాస్తవమే కదా!*

సాయి ఇది మాత్రమే ప్రసాదించారా?!

*"నేను నా కాకాను విమానంలో తీసుకు వెళతాను "* 

 సాయి దీక్షిత్ కు ఇచ్చిన వాగ్దానం

అధ్యాయం 12 ఓ వి 112

*కీ తే సంతాచే బోల*
*కధీంహీ జే నసణార బోల*
*అర్థభరిత సదా సఖోల*
*కరవేల మోల్ కవణతే*

సాయి మాటలు ఎప్పుడు అర్థం లేకుండా ఉండవు. అవి ఎప్పుడు అర్థం తో నిండి పూర్ణంగా ఉంటాయి.ఆ మాటలకు ఎవరు విలువ కట్టగలరు?

అధ్యాయం 13 ఓవి 1.

*ఆకారే సూత్రమయ అతి లహాన*
*అర్థగాంభీర్యే అతి గహన*
*వ్యాపకత్వే బహు విస్తీర్ణ*
*సంకీర్ణ తరీ తితుకేచ*

బాబా పలుకులు చాలా చిన్నవిగా, సూత్రాల లాగా, సంగ్రహంగా ఉంటాయి. కానీ వాటి అర్ధం చాలా లోతుగాను, గంభీరంగానూ, పూర్తిగానూ ఉంటాయి.

అధ్యాయం 13 ఓవి 2.

*ఏసే తే బాబాంచే బోల*
*అర్థే తత్వే అతి సఖోల*
*కల్పాంతీహీ నవ్హతీ ఫోల*
*సమతోల ఆణి ఆనమోల*

వారి మాటల లోని అర్థం లోతుగా, సులభంగా అర్థం కానిదిగా ఉండే సత్యత మాటలు ఎప్పుడూ అర్థం లేకుండా ఉండవు. అవి చాలా అమూల్యమైనవి గాను, సమము గాను ఉండేవి.

*సాయి సత్యవాక్య పరిపాలకుడు*
 
*ఆ గమ్యం ఏమిటి!?!*

*ఆ గమ్యం సాయి నిజసుఖ ధామం*

*సాయి సచ్చరిత్రలో సాయి స్వయంగా సుఖధామం గురించి ప్రస్తావించిన అధ్యాయం 27 ఓ వి 56*

*తేవ్హా హే గ్రంథ యేతీల కామా*
*దస్త రాంతూ న దావీల* 
*శామా*
*స్వయే ఆపణ జాఊ నిజధామా*
*గ్రంథ ప్రతిమా హోతీల*

*నేను నా నిజ నివాసానికి వెళ్ళిపోయాక* శ్యామా వీనిని తీసి వారికి చూపిస్తాడు. అప్పుడు ఈ గ్రంథాలు జ్ఞానాన్ని పంచి పెడతాయి.

శ్యామా దగ్గర సాయి గ్రంథాలు ఇచ్చి భద్రపరచు అంటారు కదా ఆ సందర్భంలో సాయి చెప్పిన మాటలు పైన ఉన్న 
ఓ వి లోనివి.

*సంత్ తుకారాంను పుష్పక విమానంలో మహావిష్ణువు తన నిజ సుఖధామం (వైకుంఠం) తీసుకుని వెళ్ళారు.*

*సాయి నిజ  నిజధామం*  
        *సిద్ధలోకం.*

*సాయి సమాధి అనంతరం సుమారు ఏడు సంవత్సరాల తరువాత దీక్షితును సప్త సముద్రాలు దాటించి సాయి తాను ఒకే ఆత్మ స్వరూపులు అనే సాక్షాత్కారము కలిగించి దీక్షితుకు, సాయి అఖండ అనంత అక్షయ సన్నిధి ప్రాప్తి తన  నిజ సుఖదామం లో కలిగించారు*

*దీక్షిత్ సత్యసంధతకు సాయి ఇచ్చిన బహుమతి, బహుమానం, పురస్కారం.*

*దీక్షిత్ యొక్క గురువు ఆజ్జా పాలన మార్గంలో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క మైలురాయి.*

*సాయి భక్తులకు దీక్షిత్ అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఆదర్శమైన వాడే.*

*ఎవ్వరు ఎన్నటికీ, ఎప్పటికీ చేరుకోలేని కలికితురాయి. (MILESTONE) అధిగమించలేని శిఖరం దీక్షిత్.*

*సాయిని మనం ప్రేమించటం ఉత్తమం.*

*సమర్థ సద్గురు పరిపూర్ణ పరబ్రహ్మచే మనం ప్రేమించబడటం సర్వోత్కృష్టమైనది.*

*ఆ సర్వోన్నత స్థాయికి,  స్థితికి గురు ఆజ్ఞా పాలన, గురు వచన దక్షత మూలంగా, క్రమంగా చేరుకున్న గుణవంతులలో అత్యుత్తమ గుణవంతుడు, ఏకైక భక్తుడు కాకా దీక్షిత్.*

*దీక్షితులా మరెవరైనా ఆచరించటం అసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో!!!!!!*

*🙏🙏🙏సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పనమస్తు🙏🙏*
 


*చిల్లర కృష్ణమూర్తి*
9840184204


*1 నవంబర్ 2018*

No comments:

Post a Comment