Saturday, March 6, 2021

రుసో మమ ప్రియాంబికా ,మజ వరి పితాహి రుసో 
రుసో మమ ప్రియం గానా ,ప్రియసుతాత్మజాహీ రుసో భగిని బంధుహి .........
ఈ హరతి గీతం సాయంకాలము హరతిలో,
 భక్తులు భక్తిపూర్వకంగా పాడుకొనే గీతం .
దీనికి రచించినవారు బాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ 
విశ్వనాధ్ దేవ్ .ఈయన ప్రస్తావన సాయిసచ్చరిత్ర 
5 ,41 వ అధ్యాయములో కనిపిస్తుంది .శ్రీ బి వి.దేవ్ రచించిన ఈ హారతి గీతం బాబా మహాసమాధి చెందిన 22 సంవత్సారలకు అనగా 
1940 సం.లో షిర్డి హరతులలో చేర్చబడినది .
దీనిని శ్రీ బి.వి.దేవ్ 7 -3 -1940 గురువారము నాడు సంకలనం చేసారు .నేటికి 81 సంవత్సరాలు ముగిసాయి .శ్రీ బి.వి.దేవ్ బాబా మహాసమాది అనంతరం ,ఆయన 1946 సం.లో దేహన్ని విడిచారు .ఆయన జీవితకాలం షిర్డి సాయిసంస్థాన్ సభ్యుడిగా పనిచేసి ,సంస్థాన్ వారి 
సాయిలీలామాసిక్ పత్రిక లో " బాబాంచె బాల్ "
అను కలంపేరుతో అనేక వ్యాసాలు వ్రాశారు .సాయిసచ్చరిత్ర గ్రంథ రచయిత శ్రీ హేమాడ్ పంత్ 1929 సం .లో దేహాన్నివిడిచి సాయిలో ఐక్యమైన పిదప ,సాయిసచ్చరిత్ర 53 వ 
అధ్యాయమును సంకలనం చేసి గ్రంథం పూర్తి 
చేసారు .ఈ హరతి గీతం సాయబాబా అనుగ్రహ 
ప్రసాదయాచన జరుగుతుంది .తల్లితండ్రులు ,
తోడబుట్టినవారు  ,బంధువులు  ,సృష్టిలో గల సర్వ భూతములు మున్నగువారు  ,అలిగిన తనను విడవవద్దని ,తనపై అలుగవద్దని అతివినయంగా  
ఎంతో శరణాగతితో వ్రాసి బాబాను వేడుకున్న 
"ప్రసాద యాచనా దశకం "శ్రీ బి.వి.దేవ్ గారి అనన్యభక్తిని స్మరణచేసి ,సాయికృపకు పాత్రులగుదాం .

No comments:

Post a Comment