Sunday, March 7, 2021

"ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో 
సాయబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు 
అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ 
సమర్థ .తన దేహము చాలించిన తరువాత తన 
భక్తులు ,ఆశ్రీతులు అయిన కొందరిని షిర్డీ సాయబాబా వద్దకు వెళ్లమని సలహ యిచ్చారు .
షెగాం మహారాజుగా ప్రసిద్దులైన గజానన మహరాజ్ ,గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే కుటుంబాన్ని ,
సాయిబాబాను ఆశ్రయించమని అదేశించారు .
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ,రాజాధిరాజా ,
యోగిరాజా ,పరబ్రహ్మ ,సమర్థ సచ్చిదానంద సద్గురువుగా ,సాయిబాబాను కీర్తించటం మామూలు అయినది భక్తులకు .అందరికీ సాయినాధునిలో సుగుణాలు ఆకట్టుకొన్నాయి .
ఆలా ఆకట్టుకోవడం ఎప్పటినుండో జరిగేదీ .
ఒకసారి సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాన్ 
సంభవించింది .గాలి ఎక్కువ అవుతున్నది .నేల 
అంతా నీటిమయమవుతుంది .షిర్డి గ్రామ వాసులు అందరూ ద్వారకామాయికి వచ్చారు .
వారు విపత్తును తొలగించమని బాబాను ప్రార్ధించారు .బాబా గొప్ప ధ్వనితో మశీదు అంచున నిలబడి " ఆగు ! ఆగు ! నీ కోపమును 
తగ్గించుము .నెమ్మదించుము ! " అని తుఫాన్ ని 
గద్దించారు .కొన్ని నిముషాలలో తుఫాను ఉధృతి 
తగ్గింది .చంద్రుడు కనిపించాడు .ఎవరి ఇళ్లకు 
వారు వెళ్ళిపోయారు .అలాంటి దైవిక శక్తులతో 
ప్రజలను కాపాడతారు మహనీయులు .

No comments:

Post a Comment