"ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో
సాయబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు
అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ
సమర్థ .తన దేహము చాలించిన తరువాత తన
భక్తులు ,ఆశ్రీతులు అయిన కొందరిని షిర్డీ సాయబాబా వద్దకు వెళ్లమని సలహ యిచ్చారు .
షెగాం మహారాజుగా ప్రసిద్దులైన గజానన మహరాజ్ ,గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే కుటుంబాన్ని ,
సాయిబాబాను ఆశ్రయించమని అదేశించారు .
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ,రాజాధిరాజా ,
యోగిరాజా ,పరబ్రహ్మ ,సమర్థ సచ్చిదానంద సద్గురువుగా ,సాయిబాబాను కీర్తించటం మామూలు అయినది భక్తులకు .అందరికీ సాయినాధునిలో సుగుణాలు ఆకట్టుకొన్నాయి .
ఆలా ఆకట్టుకోవడం ఎప్పటినుండో జరిగేదీ .
ఒకసారి సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాన్
సంభవించింది .గాలి ఎక్కువ అవుతున్నది .నేల
అంతా నీటిమయమవుతుంది .షిర్డి గ్రామ వాసులు అందరూ ద్వారకామాయికి వచ్చారు .
వారు విపత్తును తొలగించమని బాబాను ప్రార్ధించారు .బాబా గొప్ప ధ్వనితో మశీదు అంచున నిలబడి " ఆగు ! ఆగు ! నీ కోపమును
తగ్గించుము .నెమ్మదించుము ! " అని తుఫాన్ ని
గద్దించారు .కొన్ని నిముషాలలో తుఫాను ఉధృతి
తగ్గింది .చంద్రుడు కనిపించాడు .ఎవరి ఇళ్లకు
వారు వెళ్ళిపోయారు .అలాంటి దైవిక శక్తులతో
No comments:
Post a Comment