*సాయివ్యాసుడుగా బిరుదు పొందిన శ్రీ బాపట్ల హనుమంతరావుగారు బాబాకు అంకిత భక్తుడు.*
*ఆయన తరచూ ఆర్ధికంగా ఇబ్బందులు పడేవాడు ఒకరోజు హనుమంతరావు గారి ఇంటికి బంధువులు వచ్చారు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ( లేని పరిస్థితి ).*
*అయనకు నిత్యమూ అరువు యిచ్చే బియ్యపు వ్యాపారి వద్దకు వెళ్లి, బియ్యము అరువు ఇమ్మని అడుగగా, ఆ వ్యాపారి గతంలో తీసుకున్న బియ్యానికి డబ్బు చెల్లించనందున, మరొకసారి అరువుకు బియ్యం ఇవ్వలేదు.*
*కనీసము బియ్యం కొందామని పదిరూపాయలు అప్పుకొరకు ప్రయత్నించగా, అప్పు దొరకలేదు.*
*తన దురదృష్టానికి చింతిస్తూ, చేసేదీ ఏమీలేక తన ఇంటికి వచ్చి, తన దైవమైన సాయిబాబాకి తన కష్టాన్ని విన్నవించుకున్నాడు.*
*కొంతసేపటికి ఆ రోజు మొదట హనుమంతరావుగారికి బియ్యం అరువుగా ఇవ్వడానికి తిరస్కరించిన బియ్యం వ్యాపారి హఠాత్తుగా హనుమంతరావుగారి ఇంటికి వచ్చి " పంతులుగారూ ! మీరు బియ్యం ఆడిగినప్పుడు ఇవ్వలేకపోయాను. ఎందుకో మరల మీకు బియ్యం ఇవ్వాలని అనిపించింది. మీరు బియ్యం అరువు అడిగి వెళ్లిపోయిన తరువాత ఇవ్వలేనందుకు బాధపడ్డాను.*
*మీరు వెళ్ళగానే మంచిరకం బియ్యం షాపులోకి వచ్చాయి. అవే బియ్యం ఒక బస్తా పట్టుకు వచ్చాను. ఇంద. తీసుకోండి ! డబ్బులు తీరికగా ఇవ్వండి " అని చెప్పి, ఒక బియ్యం బస్తా వారింటిలో పెట్టి వెళ్లిపోయాడు.*
*బాబా తన ఎడల చూపిన అపార కరుణకు ఎంతో అనందించాడు.*
*బాబా అభయప్రదానం " నా భక్తుల ఇంట అన్నవస్త్రములకు లోటు లేదు " అన్న అభయ సందేశం భక్తులపాలిట వరం కదా !*
No comments:
Post a Comment