Thursday, August 22, 2024

పరమహంస పరివ్రాజక, అపర దత్తస్వరూపులైన శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి ( టెంబె ) స్వామి వారి 170 వ జన్మదినం *

*పరమహంస పరివ్రాజక, అపర దత్తస్వరూపులైన శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి ( టెంబె ) స్వామి వారి 170 వ జన్మదినం *
*( 13 -8 -1854 )*


*సాయిసచ్చరిత్ర చివరి అధ్యాయములలో టెంబె స్వామి ప్రస్తావన కనిపిస్తుంది.*
*వాసుదేవానంద సరస్వతి స్వామివారు సాయిబాబాకి సమకాలికుడు.*
*స్వామివారు తమ 18 వ చతుర్మాస దీక్షలో భాగముగా రాజమహేంద్రవర పట్టణాన్ని 1909 సం. ఫిబ్రవరి నెలలో దర్శించడం జరిగింది.*
*అక్కడే పుండలీకరావు గా పేర్కొనబడిన దాసగణు మహరాజ్ స్వామివారిని కలవడం జరిగింది.* 

*పరమనిష్టాగరిష్ఠుడైన స్వాములవారు తమ ఆచారాన్ని ఉల్లఘించి సాయిబాబాకు పాదాభివందనం చేసి ఒక నారికేళమును బాబాకు సమర్పించమని దాసగణు మహరాజ్ కు అదేశించారు.*

*అయన రాజమండ్రి నుండి కొబ్బరి కాయని పంపడమే మహాకార్యం కాదు, అదే సంవత్సరములో పిఠాపురం దర్శించి, అక్కడ ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుఁడు తెలుగువారని, ఆయన జన్మస్ధలం పిఠాపురమని తెలిపి అక్కడ దత్త పాదుకలు ప్రతిష్టించారు.*

*వాసుదేవానంద సరస్వతీ స్వాములవారు తెలుగునాట దత్త సంప్రదాయాన్ని పునరుద్ధించారు* *"వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వము" అని అంటారు.* *దత్తాత్రేయులవారి సాహిత్యం వాసుదేవానందులవారి ఉచ్ఛిష్ఠం అన్నా తప్పు కాదనీ అనిపిస్తుంది.* 
*కొంకణ్ ప్రాంతములో గల సావంతవాడి సమీపములో మాన్గావ్ గ్రామములో 13 ఆగష్టు 1854 న వాసుదేవానందులు జన్మించారు.*

*దత్తాత్రేయ స్వామి అయనకు స్వప్నములో మంత్రోపదేశం ఇచ్చారు.*
*ఆయన తన వద్దగల దత్త విగ్రహం ( అది సాక్షాత్తూ దత్తాత్రేయ ప్రభువే ) ఆయనతో స్వయంగా, సన్నిహితంగా సంభాషించేవారు.*

*స్వాములవారు ఆ దత్తస్వామిని పూజించేవారు. ఈవిధమైన సన్నిహిత సంబంధం అపూర్వమైన విషయము.*

*సన్యాసులు ఇతరులకు నమస్కరించడం గానీ, విగ్రహాలను పూజించడం కానీ చేయరు.*
*దత్త మూర్తిని ఆరాధించడంలోను, సాయిబాబాకు నమస్కరించడంలోనూ తన అచారాన్ని పాటించలేదు.*

*దత్తుని అరాధనను విశేషంగా మహరాష్ట్రలో తిరిగి ప్రవేశపెట్టారు. ఆయన శ్రీగురుచరిత్రను, గురుసంహిత అనే గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. ఇంకా దత్తపరమైన స్తోత్రాలు, గ్రంథాలు అనేకమైనవి సంస్కృతంలో రచించారు.*

*స్వాములవారు శృంగేరిని దర్శించినప్పుడు అలనాటి శృంగేరి శంకర పీఠం అధిపతి అయిన శ్రీ సచ్చిదానంద శివాభి నవ నృశింహ భారతీ స్వాములవారిచే (1879 -1912 ) "అయంహీ భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతిః " ( ఈ యతి సాక్షాత్తూ దత్తాత్రేయుడే ) అని కీర్తించబడిన వాసుదేవానంద సరస్వతి స్వాముల స్మరణ చేసి  దత్తాత్రేయుని అనుగ్రహ ఆశీస్సులు పొందుదాం.*

*పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, తిథి ప్రకారం శ్రావణ బహుళ పంచమినాడు అనఁగా ఆంగ్ల కాలమానం ప్రకారం 13 -8 -1854 తేదీ నాడు జన్మించారు.*

*నేడు అనగా 23- 08 -2023 శుక్రవారం, శ్రావణ బహుళ పంచమి, వాసుదేవానంద సరస్వతి స్వామి వారి 170 వ జయంతి.*

*దిగంబరా ! దిగంబరా ! శ్రీపాద వల్లభ దిగంబరా !*

*దిగంబరా ! దిగంబరా !*
*దత్తాత్రేయ దిగంబరా*
*దిగంబరా ! దిగంబరా !*
*అవధూత చింతన దిగంబరా!*

Wednesday, August 21, 2024

కామాక్షి అమ్మవారి ఆలయంలో కామాక్షి అమ్మవారు 5 రూపాలలో ఉంటారు..

కామాక్షి అమ్మవారి ఆలయంలో కామాక్షి అమ్మవారు 5 రూపాలలో ఉంటారు..


1. మూల విరాట్టు అయిన కామాక్షి 
2. ⁠అటు పక్కనే ఉన్న తపో కామాక్షి
3. ⁠ప్రధానాలయం వెనక వైపున ఉన్న విమాన కామాక్షి
4. ⁠లక్ష్మి దేవి, సరస్వతి దేవీలను కుడి వైపు, ఎడమ వైపు పెట్టుకొని మధ్యలో ఉంటారు ఉత్సవ కామాక్షి..
5. ⁠స్వర్ణ కామాక్షి..

ప్రస్తుతం ఈ స్వర్ణ కామాక్షి తంజావూరు లో ఉన్నారు... ఎందుకు అక్కడికి వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాము....

ఒకప్పుడు ముస్లింల దండయాత్ర భారీ నుండి కాపాడడానికి... ఈ ఆలయంలో ఉన్న అర్చకులు ఆ స్వర్ణ మయంతో చేసిన కామాక్షి విగ్రహాన్ని కాంచీపురం నుండి తంజావూరు తీసుకెళ్లి దాచారు... కొంత కాలం తర్వాత అమ్మవారు అక్కడే ఉండడానికి కొన్ని సంకేతాలు ఇచ్చారు.. అలా స్వర్ణ కామాక్షి తంజావూరులో కొలువయ్యారు..

అయితే కాంచీపురంలో స్వర్ణ కామాక్షి ఉన్న స్థలం ఖాళీగా ఉంచకూడదు అన్న భావన చేసి.. అక్కడ అమ్మవారీ యొక్క స్వర్ణ పాదుకలు పెట్టారు... 

మనం కేవలం తంజావూరులో మాత్రం స్వర్ణ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము...

తంజావూరులో కొలువైన బృహదీశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాక.. ఈ స్వర్ణ కామాక్షి ఆలయానికి వెళ్తారు...

సాధారణంగా కామాక్షి అమ్మవారు కూర్చున్న భంగిమలో ఉంటారు.. ఇక్కడ తంజావూరులో నిల్చొని ఉన్న భంగిమలో దర్శనం ఇస్తారు స్వర్ణ కామాక్షి అమ్మవారు...
అరుణాచలశివ 🌹

Monday, August 19, 2024

*షిరిడీలో పాదుకా ప్రతిష్టాపన*

*షిరిడీలో పాదుకా ప్రతిష్టాపన*  


*నేడు మనము షిర్డీ దర్శించునప్పుడు సమాధి మందిరం, ద్వారకా మాయి, గురుస్థాన్ మున్నగు ప్రదేశాలు దర్శించునప్పుడు* *ఆయా ప్రదేశాలలో బాబా వారి పాదుకలు దర్శించుకోవచ్చు.* 

*మొదటిసారిగా 1912 సం. శ్రావణ పూర్ణిమ నాడు అత్యంత భక్తి శ్రద్దలతో, వైభవపేతంగా, షిరిడీలో బాబా అశీసులతో, ఖండోబా మందిరం నందున్న ఉపాసనీ మహరాజ్ ఆదేశాలతో, సూచనలతో గురుస్థాన్ నందు గల వేపచెట్టు క్రింద పాలరాతి పాదుకలు పాదుకలు ప్రతిష్టించబడినవి.* 

*ఆ పాదుకలు వృత్తాంతం - బాంబాయి నగరము నందున్న రామారావు కొఠారీ అను డాక్టరు గారి వద్ద పనిచేసే అయన కాంపౌండర్, అతని స్నేహితుడైన భాయి కృష్ణాజీ అలీబాగ్ కర్ చేసిన ప్రయత్నముతో ఈ పాదుకలు గురుస్థాన్ నందు‌ ప్రతిష్టింపబడినవి.* 
*భాయి కృష్ణాజి అలీబాగ్ కర్ మొదట అక్కల్కోట మహరాజ్ భక్తుడు.*
 *అతను అక్కల్కోట వెళ్ళి అక్కల్కోట మహరాజు పాదుకలు, చిత్రపటమును పూజించవలెనని సంకల్పించెను.* 
*అతను బయలుదేరుటకు మునుపే అక్కల్కోట మహరాజ్ స్వప్న దర్శనమిచ్చి, షిర్డి గ్రామము తన నివాసమని, అక్కడ ఉన్న సాయి మహరాజ్ తాను వేరు కాదనీ, అక్కడకి పోయి పూజ చేసుకోమని ఆదేశించగా, అలీబాగ్ కర్, అతని మిత్రుడైన  డాక్టర్ కొఠారి  కాంపౌండర్ ఇద్దరు కలసి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు.*

*వారు షిరిడీలో నున్నపుడు అక్కడగల బాబా భక్తులయిన సగుణ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ అను వారి పరిచయము చేసుకుని బాబా షిరిడీలో వేపచెట్టు క్రింద తపస్సు చేసినందుకు గురుతుగా బాబా పాదుకలు ప్రతిష్టాపన చేయవలెనని నిశ్చయించుకొనిరి.*

*మొదట వారు రాతితో చేసిన పాదుకలు ప్రతిష్టించవలెనని అనుకొనిరి.* 
*కానీ ఈ విషయము డాక్టరు రామారావు కొఠారి కు తెలుపగా, ఆయన* 
*సంతోషముగా షిరిడీకి వచ్చి నమూనా పాదుకలు* *చిత్రమును ఖండోబా మందిరం నందున్న ఉపాసనీ మహరాజ్ గారికి చూపగా, ఉపాసని మహరాజ్* *పాదుకల యందు పద్మము, శంఖము, చక్రము మున్నగున్నవి చేర్చి, బాబా యోగ శక్తి  మరియు వేపచెట్టు గొప్పదనాన్ని తెలిపే తాను రచించిన " సాయినాథ మహిమా స్తోత్రము " లోని నాలుగు అయిదు శ్లోకాలను పాదుకలు ప్రతిష్ట చేసే పీఠము నందు చెక్కించమని సలహా ఇవ్వగా, ఉపాసనీ బాబా సూచించిన విధంగా డాక్టరు రామరావు కొఠారి కృషితో  బాబా వారి పాలరాతి పాదుకలు తయారు చేయబడి బొంబాయి నుండి షిరిడీకి రాగనే బాబా వాటిని సృజించి " అవి భగవంతుని పాదుకలు." అని సూచించారు. గురుస్థాన్ నందు ప్రతిష్టించవలెనని ఆదేశించగా, పాదుకలను దాదాకేల్కరు,  ఉపాసనీ* *మహరాజ్ మున్నగు భక్తులు వెంటరాగా గోవింద కమలాకర దీక్షిత్ అను భక్తుడు ఆ పాదుకలు శిరస్సున పెట్టుకుని ఖండోబా మందిరం నుండి* *గురుస్థానము వచ్చి ఆ వేపచెట్టు మూలమున పాదుకలు శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం 11 గంటలకు ప్రతిష్టంపబడినవి.( 27 -8 -1912 శ్రావణపౌర్ణమి)*

 *" సదా నింబవృక్షస్య ములాధివాసత్ ....*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథం.*

*నేడు అనగా 19 -8 -2024 సోమవారం శ్రావణపౌర్ణమి.* 

*నేటికి షిరిడీలో, గురుస్థానం లో పాదుకా ప్రతిష్ట జరిగి 112 ఏళ్లు సమాప్తి అగును.* 

*సాయి సచ్చరిత్ర (ప్రత్తి నారాయణరావు గారి గ్రంథములో అయిదవ అధ్యాయములో ఈ విషయము ప్రస్తావించబడినది.*

👣👣👣👣👣👣👣👣👣👣

Friday, August 9, 2024

జ్యోతిష్కుడు శ్రీ సాయిబాబా (సాయి బాబా చేత పవిత్రం చేయబడినది.) నుండి వచ్చిన అటువంటి ప్రసాదం అతన్ని చాలా నైపుణ్యం కలిగిన జ్యోతిష్కుడిగా మారుస్తుందని, అందువలన అతనికి అదృష్టం చేకూరుతుందని హృదయపూర్వకంగా నమ్మాడు.


*ఒకసారి, జ్యోతిషశాస్త్రానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని సాయిబాబా చేతిలో పెట్టి మళ్ళీ బాబా వారి దగ్గర  నుండి ప్రసాదం మాదిరిగా స్వీకరించాలి అనే ఉద్దేశ్యంతో శ్రీ సాయి బాబా వారి గురించి చాలా ఉన్నత మైన గొప్ప సాధువుగా విన్న జ్యోతిష్కుడు ఒకరు షిర్డీకి వచ్చారు.  జ్యోతిష్కుడు శ్రీ సాయిబాబా (సాయి బాబా చేత పవిత్రం చేయబడినది.) నుండి వచ్చిన అటువంటి ప్రసాదం అతన్ని చాలా నైపుణ్యం కలిగిన జ్యోతిష్కుడిగా మారుస్తుందని, అందువలన అతనికి అదృష్టం చేకూరుతుందని హృదయపూర్వకంగా నమ్మాడు.  కానీ సాయి బాబా, ఈ పుస్తకాన్ని జ్యోతిష్కుడికి ఇవ్వమని కోరినప్పుడు, దానికి దగ్గరగా కూర్చున్న బాపుసాహెబ్ బుట్టి (షిర్డీలో బుట్టి వాడా నిర్మించిన ఘనత పొందిన ప్రసిద్ధ గొప్ప దనవంతుడు) కు ఇచ్చారు.  ధనవంతుడు ఇంకా ప్రాపంచిక కోరిక లేనటువంటి బాపుసాహెబ్ బుట్టి సాయి బాబా ఇచ్చిన పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.  జ్యోతిష్కుడు నిరాశ చెందారు.  ఏదైనా చదవడానికి ఎప్పుడూ పట్టించుకోని బాపుసాహెబ్, సాయి బాబా ఈ పుస్తకాన్ని తనకు ఇచ్చినందున, ఆ తరువాత కొద్దిసేపు పుస్తకాన్ని అలా పేజీలు తిప్పుతూ దాటవేసారు.  క్రమంగా అతను పుస్తకం చదవడం ద్వారా జ్యోతిషశాస్త్రం పట్ల ఆసక్తి చూపడం ప్రారంభించారు.  కొన్ని సంవత్సరాల తరువాత, బాపుసాహెబ్ బుట్టి జ్యోతిషశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. అతను సాయి భక్తులకు వారి అవసరాలకు సహాయం చేయడం ప్రారంభించారు. కొన్ని విషయాలను ఖచ్చితత్వంతో ఊహించగలిగాడు!  అతను ఎటువంటి వేతనం ఆశించకుండా ఇవన్నీ చేశారు!*

 *పైన తెలుసుకున్న సంఘటన ద్వారా శ్రీసాయి బాబా దానిని చూపించాలనుకున్నారు. జ్యోతిష్కుడు తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా జ్యోతిషశాస్త్రంలో ప్రావీణ్యం పొందడం విధి కాదని అతనికి తెలుసు;  అటువంటి ప్రసాద గ్రహీత అయిన వ్యక్తి ఏ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడో చూపించాలనుకున్నారు. (ఈ సందర్భంలో శ్రీ బాపుసాహెబ్ బుట్టి)కి మరియు సాయి బాబా తన భక్తులకు బోధించాలనుకున్నారూ, ఏదైనా కళ లేదా విజ్ఞాన శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క ప్రావీణ్యం మానవత్వానికి ఉచితమైన ప్రేమ కంటే ఉత్తమంగా ఉపయోగించినప్పుడు ఉత్తమంగా ఉపయోగించబడుతుంది.*

 *M.W.  ప్రధాన్ తన రచనలో “శ్రీ సాయి బాబా ఆఫ్ షిర్డీ: ఎ గ్లింప్స్ ఆఫ్ ఇండియన్ స్పిరిచ్యువాలిటీ*

Sunday, August 4, 2024

*షిరిడీలో సాయిబాబా సంస్థాన్ వారు, ఈ శ్రావణ మాసములోనే విశేష సంఖ్యలో భక్తులచే సామూహిక శ్రీ సాయిసచ్చరిత్ర సప్తాహ పారాయణము నిర్వహించడం జరుగుతుంది.*


*మహరాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రదేశాలలో ప్రతీ సంవత్సరం శ్రావణమాసములో దైవ సన్నిధానములలో విశేషపూజలు, ప్రత్యేక సామూహిక అధ్యాత్మిక గ్రంథ పారాయణాలు మరియు వివిధ అధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం మనము చూడవచ్చు.* *షిరిడీలో సాయిబాబా సంస్థాన్ వారు, ఈ శ్రావణ మాసములోనే విశేష సంఖ్యలో భక్తులచే సామూహిక శ్రీ సాయిసచ్చరిత్ర సప్తాహ పారాయణము నిర్వహించడం జరుగుతుంది.*
*అంతేగాక ఈ శ్రావణమాసములో ప్రతీ* *సోమవారం సాయిబాబాకు ఇచ్చే ధూప్ ఆరతిలో, మొదటి హారతి పాట అయిన " ఆరతి* *సాయిబాబా, సౌఖ్య దాత రా జీవా '' అన్న గీతం తరువాత,*
*" షిర్డీ మాఝే పండరీపుర,"* *పాటకు ముందు శివ భగవానుని ఆరతి గీతం ఆలపిస్తారు.* 
*ఆ రోజు ఇచ్చే ధూప్ ఆరతికి ఒక ప్రత్యేకత ఉన్నది.*
*బాబా వారికి ఒక వత్తుతో హారతి ఇవ్వకుండా అయిదు వత్తులతో పంచ ఆరతి ఇస్తారు.*
*బాబావారి సమాధి ముందు శివుని ఫొటొ పెట్టి, బాబా వారి విగ్రహానికి, సమాధిపై మారేడు దళముల మాలలు వేస్తారు.* .
*(పూలమాలతోపాటు).*
*శ్రావణ మాసం, ప్రతి సోమవారం అన్ని ఆరతులకు సాయినాథుని వారిని శ్వేత  వస్త్రాలతో ( తెల్లని ) అలంకరిస్తారు.*

*శ్రావణమాసంలో* *సోమవారము ధూప్ ఆరతిలో ఆలపించే శివ భగవానుని ఆరతి గీతం క్రింద ఇవ్వబడినది.*


*మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా ధూప్ ఆరతిలో శివుని ఆరతి పాట పాడుతారు.*

*ఇది హారతి సాయిబాబా లో  "ఇచ్ఛిత దీనచాతక " తరువాత " శిరిడి మాఝే పండరీపుర " ముందర పాడుతారు.*


లవధవతీ విక్రాళా బ్రహ్మండీ మాళా ; విషే కంఠ కాళా త్రినేత్రి జ్వాళా 
లావణ్య సుందర మస్తకీ భాళా 
                                     తేధునియా జళ నిర్మళ వాహే ఝళ ఝాళా 
జయదేవ జయదేవ జయ శివశంకరా ,
                             స్వామిశంకరా   ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ  కర్పూరగౌరా
కర్పూరగౌరా భోళా నయనీ విశాళా, అర్దాంగీ పార్వతీ సుమనాంఛ్హా మాళా 
విభూతీచే ఉధళణ శివకంఠ నీళా ఐసా శంకర శోబే ఉమా వేల్హళా 
 జయదేవ జయదేవ జయ శివశంకరా,  
                            స్వామిశంకరా  ఆరతీ  ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా 
దేవీ ధైత్యీ సాగరమంధన పైం కేరే, త్యమాజీ అవచిత్ హోళా హళ ఉఠీలే 
తే త్యా అసురఫణే ప్రాశన్ కేలే నీలకంఠ నామ ప్రసిద్ధ  ఝాలే 
  జయదేవ జయదేవ జయశివశంకరా,
                           స్వామిశంకరా  ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా  
వ్యాఘ్రబర ఫణివరధర సుందర మదనారీ 
                పంచానన మనమోహన మునిజన సుఖకారీ 
శతకోటిచే బీజ వాచే ఉచ్హారీ, రఘుకులతిలక రామదాసి అంతరీ 
జయదేవ జయదేవ జయశివశంకర,
                       స్వామిశంకర ఆరతీ ఓవాళు భవతీ ఓవాళూ తుజ కర్పూరగౌరా 
                              
జయదేవ జయదేవ 
 
*మరాఠి భాషలో శివుని కిచ్చే హరతికి తెలుగులో అర్ధాన్ని, భావాన్ని సాయి* *గురుబంధువులందరికీ* 
*అందచేసే కొంత ప్రయత్నమే ఇది* 
*ఇందులో దోషాలు కనిపిస్తే మన్నించండి.*

మొదటి చరణం -లవదవతి విక్రాల ...
భావం .
*రుద్రరూపము కలిగి, తాండవ నృత్యముచేయుచు అతి భయంకర స్వరూపముతో భక్తులకు దర్శనమిచ్చుచున్నాడు.*
*హాలాహలమనే భయంకర విషాన్ని మింగుటచే*
*నీలిరంగు కంఠం కలిగినవాడైనాడు.* 
*శిరస్సు ఫాలభాగమున* *మూడవ నేత్రము కలగుటచే త్రినేత్రుడైనాడు.*  *శిరస్సున జటాజూటములచే, పావన గంగను ఆ జడలనందు కలవాడు.*
*అతి సుందరవదనము కలవాడు ఆ శివుఁడు ఆ పరమాత్మ ఉగ్రరూపము ధరించిననూ లోక కళ్యాణం కొరకు భూమండలం నాశనం కాలేదు.*
*జయము జయము శ్రీ శంకరా! కర్పూర గౌరా !*
*(కర్పూరమువలె తెల్లని ముఖచాయ కలవాఁడు )*
*నీకు హారతి సమర్పిస్తున్నాము.*

*కర్పూర గౌరా భోళా నయన విశాలా ...భావం.*

లవదవతి విక్రాల ...శివహారతి. రెండవ చరణం 
భావము.

*ధవళ వర్ణము కలిగి, మవిశాలనేత్రాలు కలిగిన* *సుందరరూపుడు, పార్వతిమాతకు తన శరీరములో అర్ధభాగమిచ్చి* *అర్ధనారీశ్వరుడైనాడు* 
*భక్తులచే సుగంధ పరిమళ* *పుష్పహారములచే ఆరాధింపబడు చున్నవాడైనడు.*  *శరీరమంతా పవిత్ర విభూతి ధారణ చేయువాడు. లీలా విలాస స్వరూపుఁడు.* *నీలి రంగు కంఠము కలిగినవాడు* 
*ఉమాదేవికి ప్రియసఖుడు* *అయిన శంకరునికి* 
*జయదేవ జయదేవ* *జయశ్రీశంకరా !* 
*ఓ కర్పూరగౌరా ! ఇవే మీకు మా హారతులు.*

మూడవ చరణం ...

*దేవతలు రాక్షసులు సాగర మధనం గావించు* *సమయమున, ఈ సృష్టి యావత్తు నాశనం చేయగల భయంకర విషపూరితమైన హాలాహలం సృష్టిలోగల సకల ప్రాణులయందు కల ప్రేమతో, సంతోషముతో తాను స్వీకరించి కాపాడెను.*
*వేరెవరూ  నీలి వర్ణం గల  ఆ హాలాహలమును మింగుటకు సాధ్యం కాలేదు. ఆ విధముగా శంకరుడు నీలికంఠుడైనాడు.*
*జయదేవ జయదేవ* 
*జయ శ్రీశంకరా ! ఓ* *కర్పూరగౌరా ! ఇవే నీకు* 
*మా హారతులు.*


నాల్గవ చరణం ...భావం.

*పులి చర్మమును ధరించినవాడు. అనేక విశేషములు కలిగిన, వాసుకి అనే సర్పమును తన* *కంఠమున  ధరించినవాడు, మన్మధ సంహారం* 
*గావించినవాడు, అయిదు* *ముఖములు కలిగి సుందరరూపముతో తనను ధ్యానించే, ముని జనులకు* *శాంతి ప్రసాదించువాడు,* *అసంఖ్యాక* 
*బీజాక్షరములతో నిండిన,* *రఘువంశంలో జన్మించిన రామా -రామదాసా అను నామమును స్మరించువాడైన శంకరుణ్ణి ఇంతకన్నా ఎంతని, ఏమని, వర్ణించగలను, ఎంతని స్తోత్రం చేయగలను ?* 
*జయదేవ జయదేవ* 
*జయ శ్రీశంకరా ! ఓ కర్పూర గౌరా ! నీకు ఇవే మా హారతులు.*

*శ్రీ సాయి సంపూర్ణ హారతుల గ్రంథం నుండి*

*చిల్లర కృష్ణమూర్తి*
*పెండ్యాల శ్రీనివాస్*
*పాశిల అప్పారావు*