*ఆయన కరుణా ప్రసరణకు పగలూ రేయీ అని వైవిధ్యమే లేదు.*
*అంటే భక్తుల జాగ్రదావస్థ (మెలకువ ) ను ఎంత* *విసృతంగా బాబా వినియోగించుకొన్నాడో, అంతే విసృతంగా భక్తుల* *స్వప్నావస్థను కూడా వినియోగించుకున్నాడు.*
*కొన్నికొన్ని సంఘటనలలో పోలికలు కనిపిస్తాయి.*
*ఉదాహరణకు - బయ్యాజీ అప్పాకోతే పాటిలుకు తాను భీముడంటి బలవంతుడనని గర్వము.*
*అతడు అప్పుడప్పుడు సాయిబాబా కాళ్ళు మర్దన చేసి, ఎత్తుకుని ధునివద్ద కూర్చోబెట్టేవాడు. ఒక రోజు బయ్యాజీ సాయిని ఎత్తలేకపోయాడు. బాబా అతనిని చూస్తూ నావ్వాడు.*
*ఆ విధముగా సాయి అతని గర్వాన్ని అణచి వేశాడు.*
*అటువంటిదే మరొకటి. కానీ ఫలితం వేరు.*
*1917 సం. లో ఫిరోజ్ షా అను వ్యక్తి తల్లి తండ్రులు షిర్దీయాత్ర చేసి, బాబా దర్శనం చేసుకుని, బాబా ఫోటో ఒకటి కొని తెచ్చుకొన్నారు.*
*వారు తమ షిర్దీయాత్ర గురించి బాబా మహిమ శక్తుల గూర్చి, దివ్యత్వాన్ని గూర్చి తమ కుమారునికి తెలియపరిచారు.*
*అది విన్న ఫిరోజ్ షా తన తల్లితండ్రులు బాబాల వెంట తిరిగి సమయాన్ని, ధనాన్ని వృధాచేస్తున్నారని బాధపడ్డాడు.*
*అతనికి సాయిబాబా అంటే మనసులో దురభిప్రాయము ఉండేది.*
*ఒక రాత్రి ఫిరోజ్ షాకు నిద్రలో బాబా స్వప్నములో కనపడి " నా దైవ శక్తి మీద నీకు నమ్మకం కలగలా ?*
*సరే ! నీ తల్లితండ్రులు షిరిడీ నుండి తెచ్చుకొన్న ఆ ఫొటొ గదిలో బల్ల మీద పెట్టారుకదా ! ఆ బల్లమీద గల ఫొటోను ఎత్తు. ఎత్తలేకపోతేనే నన్ను నమ్ము. ఎత్త కలిగితే నీకు నాయందుగల అభిప్రాయాన్ని మార్చుకోవద్దు.*
*నేను కపటి ని అనుకో " అని బాబా పలికారు.*
*అతడు నిద్రలేవగానే బాబా ఫోటో పెట్టిన బల్లవద్దకు వెళ్ళి, బాబా ఫొటోను ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఫోటో లేవలేదు.* *ఎత్తాడు ప్రయత్నించేకొలదీ ఫోటో బరువు పెరగసాగింది.*
*ఫిరోజ్ కు బాబా యందు నమ్మకం కుదిరింది.*
*ఫిరోజ్ షా తన తప్పును తెలుసుకొని తనను క్షమించమని బాబా ఫొటొ ముందు నిలబడి ప్రార్దించాడు. తరువాత ఆయన బాబా భక్తుడిగా మారాడు.*
*ఇలా బాబా భక్తుల స్వప్నాలలో కనబడి భక్తుల సంకుచిత భావాలను, దుర్గుణాలను, వ్యాధులను తొలగించేవారు.*
*అందుకే భక్తులు "సాయీ ! ఒకసారి నా కలలోకి రావయ్యా !"అని ప్రార్ధిస్తారు.*
*జై సాయినాథ*
.jpg)
No comments:
Post a Comment