*షిరిడీలో సాయినాథుని పాలరాయి విగ్రహం కాదని, సజీవ మూర్తి అని, ఉదయము బాబాకు మంగళ స్నానం చేసిన, మందిర పూజారికి కలిగిన అనుభవాన్ని తెలుసుకొందాము.*
*ప్రతిదినమూ సమాధి మందిర పూజారులు సాయినాథుని విగ్రహానికి ఉదయము మంగళస్నానం చేయిస్తుంటారు.*
*ఒక రోజు అలా బాబాకు స్నానం చేయిస్తూఉండగా, ఒక పూజారి చేతి లోంచి నీళ్లతో ఉన్న చెంబు జారి పోయి సాయిబాబా విగ్రహం మోకాలిపై పడింది.*
*ఆ ఘటనను అతడు మర్చిపోయాడు.*
*కొన్నాళ్లకు ఆ పూజారి కి మోకాళ్ళ నొప్పి మొదలైంది. మందులు, ఇంజెక్షన్లు, మాత్రలు అన్నీ వాడినా ప్రయోజనము కనిపించలేదు.*
*ఒక రాత్రీ " బాబా ! నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ? నేను చేసే సేవలో ఏమైనా పొరపాటు జరిగిందా ?" అని సాయిబాబా ను ప్రార్దించాడు.*
*"ఓయీ ! నీవు నీ మోకాలి నొప్పి గురించి ఆలోచిస్తున్నావు. కానీ నీవు నా విగ్రహానికి ఒక రోజు చేసిన మంగళ స్నానంలో నీ చేతిలోంచి నీళ్లతో నిండిన చెంబు జారిపడి నా మోకాళ్లపై పడింది. అందువల్ల నా మోకాలికి నొప్పి కలిగింది, నీ అజాగ్రత్తవల్ల నాకు కలిగి న నొప్పి గూర్చి ఆలోచించావా ?" అని బాబా పలికారు.*
*అప్పుడు పూజారికి తాను స్నానం చేయించింది పాలరాయి విగ్రహనికి కాదు, సజీవంగా ఉన్న సాయినాథునికే అని అనుభవమైనది.*
*అందుకే సాయినాధునికి - సాయిబాబా విగ్రహానికి గానీ ఫొటోకు గానీ తేడాలేదని ఎన్నొ అనుభవాలను భక్తులకు ప్రసాదించారు.*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథం*

No comments:
Post a Comment