Saturday, November 2, 2024

సాయి భక్త ప్రపంచంలో -- ధృవతార* *కాకాసాహెబ్ దీక్షిత్ - సూక్ష్మ పరిశీలన

*సాయి భక్త ప్రపంచంలో -- ధృవతార*

 *కాకాసాహెబ్ దీక్షిత్ - సూక్ష్మ పరిశీలన*




*1 నవంబర్ 1909*
*2 నవంబర్ 1909*

*1) సాయి అంకిత భక్తులు మిరికర్ తండ్రి కొడుకులు గృహంలో అహ్మద్ నగర్ లో బస.*

2) సాయి ఆహ్వానం - పటం   
       రూపంలో 

*(నానాసాహెబ్ చందోర్కర్ మేఘశ్యామాకు పూజ నిమిత్తం ఇచ్చిన శ్రీ సాయి బాబా చిత్రపటం  అద్దం పగిలి నందు వలన సరిచేయడానికి మిరీకర్ ఇంట్లో ఉండటంతో కాకాసాహెబ్ దీక్షిత్ సాయి దర్శనం చేసుకున్నాడు.)* 

*అంతేకాదు అంతర్లీనంగా ఆలోచిస్తే దీక్షిత్ ని షిరిడీకి ఆహ్వానించటానికి ఫోటో రూపంలో సాయే అక్కడ కొలువై ఉన్నారు. సాయిబాబా వారికి వారి చిత్రపటానికి ఏమాత్రం తేడా లేదని మనకు తెలుసు కదా!*

*3) శ్యామా అత్తగారికి అస్వస్థతగా ఉన్నదని టెలిగ్రామ్ రావడం, శ్యామా అహ్మద్ నగర్ బయలుదేరి వెళ్లడం, మిరికర్‌ను కలవడం అంత దీక్షితుని షిరిడికి ఆహ్వానించడానికి బాబా చేసిన ఏర్పాటు. దీక్షిత్ ను ఎవరితోపాటు శిరడి పంపాలి అని ఆలోచిస్తున్న మిరీకర్ కు శ్యామా కంటే వేరెవరూ మంచితోడు. శ్యామా సాయి ప్రతినిధి కదా!*

*4) దీక్షిత్, సాయిబాబా వారి చిత్రపటంతో, శ్యామాతో  సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణానికి సిద్ధమైనప్పటికి బాబా గార్డ్ రూపంలో వారిని ఫస్ట్ క్లాస్ లో ప్రయాణానికి ఏర్పాటు చేయటం.*


*5) రైలులో సాయి చిత్ర పటం సమక్షంలో శ్యామా  సాయి లీలలను మహత్తును చర్చించుకోవడం.*

*6) సాయిబాబా వారిని కలవాలనే కుతూహలాన్ని, లోనావాలాలో శ్రవణానంద పరిచయం దీక్షితుకు కల్పించిన నానాసాహెబ్ చందోర్కర్ కోవపర్గావ్ రైల్వే స్టేషన్లో కలవడం.*

*02-09-1909 సాయి ప్రత్యక్ష దర్శనం*

ఇంతటి భాగ్యం దీక్షితుకు ఎలా కలిగింది అనే అంశంపై ఒక పరిశీలన:

*దీక్షిత్ సాయిని పుణ్య పావన ప్రత్యక్ష దర్శనం చేసుకున్న సమయం*

 *" గురు పుష్య అమృత యోగం.*"
 
*పుష్యమి నక్షత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు బృహస్పతి (గురు) సంచారంతో సంపూర్ణమైన శుభసంయోగ వేళ*

*"గురు పుష్య అమృత యోగం అంటారు.*"

*25-07-1925 సాయిలో ఐక్యం కావడం*

రైలులో సచ్చరిత గ్రంధ రచయిత హేమాడ్ పంతు మరియు భజనమాల రచయిత రఘునాథ్,  టెండూల్కర్  తో సాయి లీలలను మహత్తును చర్చించుకుంటూ దీక్షిత్ సాయిలో ఐక్యం కావడం మరో గొప్ప విశేషం.

      *అనాయాస మరణం -* 
           *వాస్తవమే కదా!*

సాయి ఇది మాత్రమే ప్రసాదించారా?!

*"నేను నా కాకాను విమానంలో తీసుకు వెళతాను "* 

 సాయి దీక్షిత్ కు ఇచ్చిన వాగ్దానం

అధ్యాయం 12 ఓ వి 112

*కీ తే సంతాచే బోల*
*కధీంహీ జే నసణార బోల*
*అర్థభరిత సదా సఖోల*
*కరవేల మోల్ కవణతే*

సాయి మాటలు ఎప్పుడు అర్థం లేకుండా ఉండవు. అవి ఎప్పుడు అర్థం తో నిండి పూర్ణంగా ఉంటాయి.ఆ మాటలకు ఎవరు విలువ కట్టగలరు?

అధ్యాయం 13 ఓవి 1.

*ఆకారే సూత్రమయ అతి లహాన*
*అర్థగాంభీర్యే అతి గహన*
*వ్యాపకత్వే బహు విస్తీర్ణ*
*సంకీర్ణ తరీ తితుకేచ*

బాబా పలుకులు చాలా చిన్నవిగా, సూత్రాల లాగా, సంగ్రహంగా ఉంటాయి. కానీ వాటి అర్ధం చాలా లోతుగాను, గంభీరంగానూ, పూర్తిగానూ ఉంటాయి.

అధ్యాయం 13 ఓవి 2.

*ఏసే తే బాబాంచే బోల*
*అర్థే తత్వే అతి సఖోల*
*కల్పాంతీహీ నవ్హతీ ఫోల*
*సమతోల ఆణి ఆనమోల*

వారి మాటల లోని అర్థం లోతుగా, సులభంగా అర్థం కానిదిగా ఉండే సత్యత మాటలు ఎప్పుడూ అర్థం లేకుండా ఉండవు. అవి చాలా అమూల్యమైనవి గాను, సమము గాను ఉండేవి.

*సాయి సత్యవాక్య పరిపాలకుడు*
 
*ఆ గమ్యం ఏమిటి!?!*

*ఆ గమ్యం సాయి నిజసుఖ ధామం*

*సాయి సచ్చరిత్రలో సాయి స్వయంగా సుఖధామం గురించి ప్రస్తావించిన అధ్యాయం 27 ఓ వి 56*

*తేవ్హా హే గ్రంథ యేతీల కామా*
*దస్త రాంతూ న దావీల* 
*శామా*
*స్వయే ఆపణ జాఊ నిజధామా*
*గ్రంథ ప్రతిమా హోతీల*

*నేను నా నిజ నివాసానికి వెళ్ళిపోయాక* శ్యామా వీనిని తీసి వారికి చూపిస్తాడు. అప్పుడు ఈ గ్రంథాలు జ్ఞానాన్ని పంచి పెడతాయి.

శ్యామా దగ్గర సాయి గ్రంథాలు ఇచ్చి భద్రపరచు అంటారు కదా ఆ సందర్భంలో సాయి చెప్పిన మాటలు పైన ఉన్న 
ఓ వి లోనివి.

*సంత్ తుకారాంను పుష్పక విమానంలో మహావిష్ణువు తన నిజ సుఖధామం (వైకుంఠం) తీసుకుని వెళ్ళారు.*

*సాయి నిజ  నిజధామం*  
        *సిద్ధలోకం.*

*సాయి సమాధి అనంతరం సుమారు ఏడు సంవత్సరాల తరువాత దీక్షితును సప్త సముద్రాలు దాటించి సాయి తాను ఒకే ఆత్మ స్వరూపులు అనే సాక్షాత్కారము కలిగించి దీక్షితుకు, సాయి అఖండ అనంత అక్షయ సన్నిధి ప్రాప్తి తన  నిజ సుఖదామం లో కలిగించారు*

*దీక్షిత్ సత్యసంధతకు సాయి ఇచ్చిన బహుమతి, బహుమానం, పురస్కారం.*

*దీక్షిత్ యొక్క గురువు ఆజ్జా పాలన మార్గంలో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క మైలురాయి.*

*సాయి భక్తులకు దీక్షిత్ అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఆదర్శమైన వాడే.*

*ఎవ్వరు ఎన్నటికీ, ఎప్పటికీ చేరుకోలేని కలికితురాయి. (MILESTONE) అధిగమించలేని శిఖరం దీక్షిత్.*

*సాయిని మనం ప్రేమించటం ఉత్తమం.*

*సమర్థ సద్గురు పరిపూర్ణ పరబ్రహ్మచే మనం ప్రేమించబడటం సర్వోత్కృష్టమైనది.*

*ఆ సర్వోన్నత స్థాయికి,  స్థితికి గురు ఆజ్ఞా పాలన, గురు వచన దక్షత మూలంగా, క్రమంగా చేరుకున్న గుణవంతులలో అత్యుత్తమ గుణవంతుడు, ఏకైక భక్తుడు కాకా దీక్షిత్.*

*దీక్షితులా మరెవరైనా ఆచరించటం అసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో!!!!!!*

*🙏🙏🙏సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పనమస్తు🙏🙏*
 


*చిల్లర కృష్ణమూర్తి*
9840184204


*1 నవంబర్ 2018*

Wednesday, October 23, 2024

విమర్శకులకు సూచన 🕉️ *శ్రీ సాయిబాబాను విమర్శించే వారికి ఈ వ్యాసము ఒకసారి పంపండి.*

🕉️విమర్శకులకు సూచన 🕉️

*శ్రీ సాయిబాబాను విమర్శించే వారికి ఈ వ్యాసము ఒకసారి పంపండి.*



ఇప్పటికన్నా ఆచార వ్యవహారములు పటిష్టంగా ఉన్న ఒక శతాబ్దం క్రితమే అనగా శ్రీసాయిబాబా
భౌతికంగాకంగా ఉన్నప్పుడు ఆయనను సేవించినవారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులే. శ్రీసాయిసచ్చరిత్ర రచించిన హేమాద్రిపంత్, సాయిచరిత్రను తన హరికథల ద్వారా గానం చేసిన దాసగణు మహారాజ్, సాయి నివాసాన్ని రాజదర్బారులా అలంకరించి, పూజలు, హారతులు ప్రారంభించిన రాధాకృష్ణమాయి బ్రాహ్మణులే.అంతేకాదు వీరందరికీ మొట్టమొదట సాయిని పరిచయం చేసిన నానాసాహెబ్ చందోర్కర్ కూడా సద్బ్రాహ్మణ వంశంలో జన్మించి, భగవద్గీతకు మూడు రకాల భాష్యాలను చదువుకున్నవాడు. అంతే కాదు ఆరోజులలోనే డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉన్నత పదవిని అలంకరించినవాడు. ఇకపోతే సాయితో అతి సన్నిహితంగా మెలిగిన శ్యామ, బొంబాయి, నాసిక్ లలో ప్రసిద్ధి చెందిన న్యాయవాదులయిన దీక్షిత్ మరియు ధూమల్, ఇంకా అనేకమంది సాయిని సేవించిన వారిలో ఎక్కువమంది బ్రాహ్మణులే ఉన్నారు. నిష్టాచార పరాయణుడు, అనేక కఠిన సాధనలు అనుష్ఠించి, చివరకు ఒక గొప్ప మహనీయుని సూచనమేరకు షిరిడీ వచ్చి సాయిని ఆశ్రయించిన ఉపాసనీ బాబా బ్రాహ్మణుడే. సాయికి పేరు పెట్టిన మహల్సాపతి విశ్వబ్రాహ్మణుడు.నిజంగా సాయి గనుక ముస్లిం ఫకీరే అయితే ఈ వ్యాస ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఇప్పటికన్నా ఆచార వ్యవహారాలు పటిష్టంగా ఉన్న ఆరోజులలోనే సనాతన హైందవ ధర్మంలో జన్మించడమే కాకుండా, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఉన్నత పదవులలో ఉన్నవారు, సాధకులైన ఎందరో సాయిని సేవించేవారా? కనుక ముస్లింల బారి నుండి హిందువులను రక్షించడం కోసమే ఆయన ఆ వేషధారణలో కనిపించారని భావించాలి. అంతేకాదు సాయి నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు చూసిన ఒక భక్తుడు ఆయన సుంతీ చేయించుకోలేదని స్వయంగా చెప్పాడు. మరొక విషయం ఏమిటంటే ఆయన చెవితమ్మెలకు రంధ్రాలు ఉండేవి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే ఆయన హిందువో ముస్లిమో తేల్చుకోవచ్చు. ఇకపోతే కొంతమంది సాయిబాబా హిందూ ఆచారాలను పాటించారా? అని అడుగుతున్నారు. ఆయన నివాసం పేరు ద్వారకామాయి.అందులో ఆయన ఈశాన్యం మూల కూర్చొని, ఆగ్నేయం మూల అగ్నిహోత్రం వెలిగించేవారు. గుమ్మానికి ఎదురుగా తులసి బృందావనం స్థాపించారు. ప్రతిరోజు సాయింత్రం దీపాలు వెలిగించేవారు. శ్రీరామ నవమి ఉత్సవం వైభవంగా జరిపేవారు.మహా సమాధికి ముందు "శ్రీరామ విజయం" అనే గ్రంథాన్ని మూడుసార్లు చదివించుకుని విన్నారు. ఇవన్నీ హిందూ సంప్రదాయం కాదంటారా? అంతేకాదు ఆయన ఎవరినీ ముస్లిములుగా మార్చలేదు. తనకు తానుగా ముస్లిం మతాన్ని స్వీకరించిన ఒకహిందూ యువకుడిని చెంపదెబ్బ కొట్టి, నీ అబ్బను మార్చు కుంటావా? అని ప్రశ్నించారు?.సాయి బాబా భౌతిక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత దక్షిణ భారతావనిలోని మద్రాస్ నుండి షిరిడి వెళ్లి శ్రీసాయి సమాధి దర్శనంతో ప్రభావితులై సాయి చరిత్రను ఆంగ్లంలో రచించి ప్రపంచానికి అందించిన బి.వి నరసింహ స్వామిఎవరో చూడండి, ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించి,ఐఏఎస్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించారు, అలానే వారి అన్నగారైన కులపతి మాస్టర్ Ekగారు, ఎక్కిరాల వేదవ్యాస్ గారిలాంటి గొప్పవారు సాయిని మహనీయుడుగా ఎందుకు కీర్తించారు ? అంతదాకా ఎందుకు కాకినాడ శ్రీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామివారు, ప్రసిద్ధి చెందిన ప్రవచనకర్తలైన చాగంటివారు, గరికిపాటివారు సాయిబాబాను ఎప్పుడైనా వ్యతిరేకించడం,విమర్శించడం జరిగిందా?సాయిబాబాను గురించి పురాణాలలో లేకపోవచ్చు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నిజమైన జ్ఞానికి-నాకు భేదంలేదని చెప్పాడు కదా? అయినా పురాణాలలోలేని ఎందరో దేవీ దేవతలను మనమిప్పుడు పూజించడం లేదంటారా? సమ్మక్క-సారక్క గురించి ఏ పురాణంలో ఉంది? గుబ్బల మంగమ్మ పుంతలో ముసలమ్మల గురించి ఏ పురాణాలు వర్ణించాయి? పోనీ భగవాన్ రమణులు, శ్రీరామకృష్ణులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి గురించయినా మన పురాణాలలో ఉన్నాయా? కాకపోతే వారంతా హిందూ రూపంలో ఉండడం వలన అభ్యంతరం లేదు.. అంతే కదా? రూపమే అభ్యంతరమైతే మత్స్య, కూర్మ ,వరాహాది రూపాలలో కూడా భగవంతుడు ఎందుకు వచ్చాడు?ఒకవేళ సాయి భక్తులలో ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకోమని చెప్పడంలో ఎంతమాత్రం తప్పులేదు. అంతేకానీ సాయినే విమర్శించడం సరికాదు. ఒకవేళ అలా విమర్శించే వారిలో ఎవరైనా పై వ్యాసంలో పేర్కొన్న వాళ్ళందరి కన్నా గొప్పవాళ్ళా?పోనీ సాయి భక్తులంతా ముస్లిం మతం స్వీకరించి హైందవేతర కార్యక్రమాలు చేస్తుంటే బాధపడాలిగానీ వాళ్లంతా శుభ్రంగా హైందవ ఆచారాలే పాటిస్తుంటే ఇక బాధ పడడం దేనికి? అయితే సాయి పాదాల దగ్గర ఇతర దేవతామూర్తులను, యంత్రాలను, శివలింగాలను పెట్టడం మాత్రం చాలాచాలా తప్పు. ఇలాంటి లోపాలను మాత్రం సాయి భక్తులు వెంటనే సరి చేసుకోవాలి. విద్యా,వైద్య, ఆర్థిక, రాజకీయ  రంగాలలో లోపాలు ఉన్నాయని ఆ రంగాలే లేకుండా చేయాలంటే కుదరదు కదా? వాటిలోని లోపాలను మాత్రం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే సాయి భక్తులు ఏవైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దుకోమని చెప్పాలికానీ సాయినే విమర్శించకూడదు. భారతదేశమంతటా కాలినడకతో సంచరించి 24 చాతుర్మాస్య వ్రతాలు అనుష్టించి,అలనాటి శృంగేరి జగద్గురువుల చేత "అయం హి  సాక్షాత్ భగవాన్ దత్తాత్రేయః స్వయం యతిః" అని కీర్తింపబడిన పరమహంస పరివ్రాజకాచార్యులు, అతి నిష్ఠా గరిష్టులు అయిన శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా సాయిబాబాను కీర్తించి, బాబాకు నమస్కారములు మరియు నారికేళము పంపించారు. నేడు సాయిని ద్వేషించే వారంతా ఈ విషయాలను ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది. సాయి మీద చేసే తిరుగుబాటేదో మత మార్పిడులకు పాల్పడుతున్న అన్యమతస్తుల పైన చేస్తే బాగుంటుంది.. సాయి భక్తుల చేత విష్ణుసహస్రనామము, భావార్ధ రామాయణము,ఏకనాథ భాగవతము,దాసబోధలు  చదివించారుగాని ఖురాన్ చదివించలేదు కదా? ముస్లిం పకీర్ లా కనిపించి, అల్లా మాలిక్ అనడం ద్వారా హిందువులను బాధించే అనేకమంది ముస్లింలు వెనకంజ వేశారు.. అయినా అల్లాహ్ అన్నప్పుడల్లా భగవంతుడు అనే అర్థమే తప్ప ముస్లింల దేవుడు అని మాత్రంకాదు!! అనేక వేల మంది చేత  కీర్తింపబడిన అవతార్ మెహర్ బాబా కూడా శ్రీసాయి బాబాను వజ్రాలలో కెల్లా గొప్ప వజ్రం కోహినూరు వజ్రం లాగా సాయిబాబా మహనీయులలో కోహినూరు వజ్రం లాంటి వారు అని కీర్తించారు కదా? ఇలాంటి విషయాలన్నీ ఒకసారి తెలుసుకోండి. ప్రసిద్ధి చెందిన పురాణ పండితులు వయోవృద్ధులు అయిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కూడా వారి ప్రవచనాలలో సాయిబాబాను దత్తావతారంగా కీర్తించారు. సాయిని విమర్శించే కుహనా మేధావులంతా వీరిలో ఎవరికన్నా గొప్పవాళ్ళు?

Tuesday, October 15, 2024

షిరిడీలో సాయినాథుని పాలరాయి విగ్రహం కాదని, సజీవ మూర్తి అని, ఉదయము బాబాకు మంగళ స్నానం చేసిన, మందిర పూజారికి కలిగిన అనుభవాన్ని తెలుసుకొందాము

*షిరిడీలో సాయినాథుని పాలరాయి విగ్రహం కాదని, సజీవ మూర్తి అని, ఉదయము బాబాకు మంగళ స్నానం చేసిన, మందిర పూజారికి కలిగిన అనుభవాన్ని తెలుసుకొందాము.*


*ప్రతిదినమూ సమాధి మందిర పూజారులు సాయినాథుని విగ్రహానికి ఉదయము మంగళస్నానం చేయిస్తుంటారు.*
*ఒక రోజు అలా బాబాకు స్నానం చేయిస్తూఉండగా, ఒక పూజారి చేతి లోంచి నీళ్లతో ఉన్న చెంబు జారి పోయి సాయిబాబా విగ్రహం మోకాలిపై పడింది.*
*ఆ ఘటనను అతడు మర్చిపోయాడు.*
*కొన్నాళ్లకు ఆ పూజారి కి మోకాళ్ళ నొప్పి మొదలైంది. మందులు, ఇంజెక్షన్లు, మాత్రలు అన్నీ వాడినా ప్రయోజనము కనిపించలేదు.*
*ఒక రాత్రీ " బాబా ! నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ? నేను చేసే సేవలో ఏమైనా పొరపాటు జరిగిందా ?" అని సాయిబాబా ను ప్రార్దించాడు.*
*"ఓయీ ! నీవు నీ మోకాలి నొప్పి గురించి ఆలోచిస్తున్నావు. కానీ నీవు నా విగ్రహానికి ఒక రోజు చేసిన మంగళ స్నానంలో నీ చేతిలోంచి నీళ్లతో నిండిన చెంబు జారిపడి నా మోకాళ్లపై పడింది. అందువల్ల నా మోకాలికి నొప్పి కలిగింది, నీ అజాగ్రత్తవల్ల నాకు కలిగి న నొప్పి గూర్చి ఆలోచించావా ?" అని బాబా పలికారు.*
*అప్పుడు పూజారికి తాను స్నానం చేయించింది పాలరాయి విగ్రహనికి కాదు, సజీవంగా ఉన్న సాయినాథునికే అని అనుభవమైనది.*
*అందుకే  సాయినాధునికి - సాయిబాబా విగ్రహానికి గానీ ఫొటోకు గానీ తేడాలేదని ఎన్నొ అనుభవాలను భక్తులకు ప్రసాదించారు.*

*నమామీశ్వరం సద్గురుం సాయినాథం*

Sunday, October 13, 2024

షిరిడీసాయిబాబా అత్యథిక ఆరాధనా వ్యవస్థ కలిగిన మహా మహిమాన్వితుడుగా కీర్తించబడ్డాడు

*షిరిడీసాయిబాబా అత్యథిక ఆరాధనా వ్యవస్థ కలిగిన మహా మహిమాన్వితుడుగా కీర్తించబడ్డాడు.*


*ఆయన కరుణా ప్రసరణకు పగలూ రేయీ అని వైవిధ్యమే లేదు.* 

*అంటే భక్తుల జాగ్రదావస్థ (మెలకువ ) ను ఎంత* *విసృతంగా బాబా వినియోగించుకొన్నాడో, అంతే విసృతంగా భక్తుల* *స్వప్నావస్థను కూడా వినియోగించుకున్నాడు.* 

*కొన్నికొన్ని సంఘటనలలో పోలికలు కనిపిస్తాయి.*

*ఉదాహరణకు - బయ్యాజీ అప్పాకోతే పాటిలుకు తాను భీముడంటి బలవంతుడనని గర్వము.*
*అతడు అప్పుడప్పుడు సాయిబాబా కాళ్ళు మర్దన చేసి, ఎత్తుకుని ధునివద్ద కూర్చోబెట్టేవాడు. ఒక రోజు బయ్యాజీ సాయిని ఎత్తలేకపోయాడు. బాబా అతనిని చూస్తూ నావ్వాడు.*
*ఆ విధముగా సాయి అతని గర్వాన్ని అణచి వేశాడు.* 

*అటువంటిదే మరొకటి. కానీ ఫలితం వేరు.*

*1917 సం. లో ఫిరోజ్ షా అను వ్యక్తి తల్లి తండ్రులు షిర్దీయాత్ర చేసి, బాబా దర్శనం చేసుకుని, బాబా ఫోటో ఒకటి కొని తెచ్చుకొన్నారు.* 

*వారు తమ షిర్దీయాత్ర గురించి బాబా మహిమ శక్తుల గూర్చి, దివ్యత్వాన్ని గూర్చి తమ కుమారునికి తెలియపరిచారు.*

*అది విన్న ఫిరోజ్ షా తన తల్లితండ్రులు బాబాల వెంట తిరిగి సమయాన్ని, ధనాన్ని వృధాచేస్తున్నారని బాధపడ్డాడు.*
 *అతనికి సాయిబాబా అంటే మనసులో దురభిప్రాయము ఉండేది.* 

*ఒక రాత్రి ఫిరోజ్ షాకు నిద్రలో బాబా స్వప్నములో కనపడి " నా దైవ శక్తి మీద నీకు నమ్మకం కలగలా ?* 
*సరే ! నీ తల్లితండ్రులు షిరిడీ నుండి తెచ్చుకొన్న ఆ ఫొటొ గదిలో బల్ల మీద పెట్టారుకదా ! ఆ బల్లమీద గల ఫొటోను ఎత్తు. ఎత్తలేకపోతేనే నన్ను నమ్ము. ఎత్త కలిగితే నీకు నాయందుగల అభిప్రాయాన్ని మార్చుకోవద్దు.* 
*నేను కపటి ని అనుకో " అని బాబా పలికారు.* 

*అతడు నిద్రలేవగానే బాబా ఫోటో పెట్టిన బల్లవద్దకు వెళ్ళి, బాబా ఫొటోను ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఫోటో లేవలేదు.* *ఎత్తాడు ప్రయత్నించేకొలదీ ఫోటో బరువు పెరగసాగింది.* 
*ఫిరోజ్ కు బాబా యందు నమ్మకం కుదిరింది.*

*ఫిరోజ్ షా తన తప్పును తెలుసుకొని తనను క్షమించమని బాబా ఫొటొ ముందు నిలబడి ప్రార్దించాడు. తరువాత ఆయన బాబా భక్తుడిగా మారాడు.* 

*ఇలా బాబా భక్తుల స్వప్నాలలో కనబడి భక్తుల సంకుచిత భావాలను, దుర్గుణాలను, వ్యాధులను తొలగించేవారు.*

*అందుకే భక్తులు "సాయీ ! ఒకసారి నా కలలోకి రావయ్యా !"అని ప్రార్ధిస్తారు.*

*జై సాయినాథ*

Saturday, October 5, 2024

శ్రీ సాయిరాం త్రయస్త్రింశత్ గురు నామములు

1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.

2. ఆర్తులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
3. భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
4. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.
5.నా సమాధినుండియే నా మానుష శరీరము మాటలాడును.
6.నా సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును
7.నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
8.నాయందెవరికి దృష్టియో వారి యందు నా కటాక్షము కలదు.
9.మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.
10.నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
11. నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.

ఇతి శ్రీ సాయి ఏకాదశ సూత్రములు ||
ప్రతిరోజు పారాయణం చేస్తే మంచిది
ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః
ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః 🙏🏻🙏🏻

శ్రీ సాయిరాం త్రయస్త్రింశత్ గురు నామములు 

1 ఓం శ్రీ సాయిరాం గురవే నమ:
అడగకనే అవసరం తీర్చు గురువు శ్రీ సాయిరాం కు నమస్కరిస్తున్నాను
2  ఓం శ్రీ సాయిరాం అఖండాయ నమ:
సంపూర్ణుడు, అనితర సాధ్యుడు గురువు శ్రీ సాయిరాం కు నమస్కరిస్తున్నాను
3  ఓం శ్రీ సాయిరాం ఇష్ట దైవాయ నమ:
ఇష్టమైన దేవుడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
4  ఓం శ్రీ సాయిరాం ఉదారాయ నమ:
గొప్పవాడు,మనోజ్ఞుడు గురువు శ్తీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
5 ఓం శ్రీ సాయిరాం బుుషీశ్వరాయ  నమ:
సర్వం తెలిసినవాడు. దుష్టశక్తులు దూరం చేసి జ్ఞానం ప్రసాదించు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
6 ఓం శ్రీ సాయిరాం ఎలయునే నమ:
సర్వం హ్యపించి తన చెంతకు చేరు వారిని కాపాడు గురువు శ్రీ సాయి రాంకు నమస్కరిస్తున్నాను 
7  ఓం శ్రీ సాయిరాం ఒజ్జనే నమ:
తల్లిదండ్రుల తర్వాతి స్థానము పొందిన గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
8 ఓం శ్రీ సాయిరాం ఖట్వాంగధరాయ నమ:
విశ్వంలోని ప్రజలందరి చర్యకు సాక్షులుగా ఉండే సర్వోన్నత సర్వజ్ఞుడు సూర్య దేవుడు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
9 ఓం శ్రీ సాయిరాం కర్మసాక్షినే నమ:
భౌతిక మరణ భయాన్నితొలగించేందుకు సహాయపడువాడు. శక్తి , వివేకం, సామర్థ్యం, మనసున నియంత్రించి సరైన దిశలో నడిపించి వాడు గురువు
శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను.
10 ఓం శ్రీ సాయిరాం గణక కర్మయోగినే నమ:
కర్మలను గణించి చెడు కర్మలకు పరిష్కారము తెలుపు యోగి గురువు
శ్రీ సాయిరాంకు నమష్కరిస్తున్నాను
11 ఓం శ్రీ సాయిరాం చరాచరమునే నమ:
సకల చరాచర సృష్టికీ కారణం సత్యరూపుడైన బ్రహ్మ . ఆ సృష్టి పరబ్రహ్మ కంటే వేరని అనడం అజ్ఞానం.  ప్రపంచమే పరబ్రహ్మం కాజాలదు. దీని వెనక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయుడు, శాశ్వతుడు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
12 ఓం శ్రీ సాయిరాం జగచ్చక్షువునే నమ:
జగతిని వీక్షించువాడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు గురువు
శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
13 ఓం శ్రీ సాయిరాం జ్ఞానసాగరాయ నమ:
అనేక జన్మల అదృష్టాన్ని ఎలా సంపాదించుకోవచ్చో మరియు సృష్టి చక్రం అంతా సంతోషంగా ఎలా ఉండవచ్చో నేర్పు సముద్రమంత జ్ఞాని గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
14 ఓం శ్రీ సాయిరాం తత్త్వజ్ఞానాయ నమ:
ఆత్మనియంత్రణ  మరియు ఆత్మ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి శాంతిమార్గం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రేరేపించు తత్త్వ జ్ఞాని గురువు శ్రీ సాయిరాంకు నమస్మరిస్తున్నాను
15 ఓం శ్రీ సాయిరాం ధర్మరక్షకాయ నమ:
అడ్డంకులను తొలగించి భక్తుల ఆధ్యాత్మిక కోరికలను నెరవేర్చు ధర్మరక్షకుడు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
16 ఓం శ్రీ సాయిరాం నరదేవాయ నమ:
భక్తులనుద్ధరించను భగవంతుడే మానవరూపంలో వచ్చిన గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
17 ఓం శ్రీసాయిరాం పరహితార్థ వ్యాపృతాయ నమ:
స్వలాభము విడిచి ఎల్లపుడు యితరుల మేలు తలుచు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
18 ఓం శ్రీసాయిరాం ఫణితినే నమ:
భక్తులందరి వాక్కు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
19 ఓం శ్రీసాయిరాం బృహతాయ నమ:
పూర్తి విశ్వాసంతో తమ వ్యవహారములో నిజాయితిగా మరియు న్యాయంగా ఉంటూ యితరలకు సహాపడుతూ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొను గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
20 ఓం శ్రీసాయిరాం బ్రహ్మచారినే నమ:
ఒక గురువు నుండి నేర్చుకునే ప్రయోజనాల కోసం, ఆధ్యాత్మిక విముక్తి సాధించే ప్రయోజనాల కోసం జీవిత తరువాతి దశలలో పవిత్రతను సూచిస్తు బ్రహ్మమును ఆచరించువాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
21 ఓం శ్రీసాయిరాం భసితాయ నమ:
ఈ విభూతి నా గురువని నా సమస్త భారములు వహించమని వేడుతూ నమస్కరిస్తున్నాను.
22 ఓం శ్రీ సాయిరాం ఆరోగ్య ప్రధాతనే నమ: 
ప్రార్థించిన వెంటనే ఆరోగ్యము ప్రసాదించు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
23 ఓం శ్రీసాయిరాం మహాశయాయ నమ:
యోగులలో విలక్షణమైన విశాల మనస్తత్వం,గొప్ప అభిప్రాయం కలిగి ఆశ్రమ జీవితం గడుపు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
24 ఓం శ్రీసాయిరాం ముక్తిచతుష్టయాయ నమ:
సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య ముక్తులను తాదాత్మ్య ఉపాసన, అభిన్న భావన వలన పొందిన గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
25 ఓం శ్రీ సాయిరాం సర్వగ్రహవినాశినే నమ:
సర్వ గ్రహాల నుంచి జరుగు కీడును నివారించు గురువు శ్రీ సాయి రాంకు నమస్కరిస్తున్నాను
26  ఓం శ్రీసాయిరాం యోగ బ్రహ్మనే నమ:
యోగసాధనతో తప్పు చేస్తున్న మానవాళిని సహ-భావన, భగవంతుని-సాక్షాత్కారం వైపు నడిపించి దాని యొక్క ఆనందాన్ని యిచ్చు బ్రహ్మ గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
27 ఓం శ్రీసాయిరాం యతీంద్రాయ నమ:
సర్వసంగ పరిత్యాగి,ఇంద్రియాలను జయించినవాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
28 ఓం శ్రీసాయిరాం యోగాయ నమ:
మానావమాన,శీతోష్ణ,సుఖదుఃఖములందు సమానముగా ఉంటూ, మట్టీని,రాతిని,బంగారాన్ని ఒకేలా చూస్తూ శత్రువులయందు, మిత్రులయందు, బంధువులు, సాధువులు, దుర్మార్గుల యందు సమబుద్ధికలిగి కర్మఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయు నిజమైన సన్యాసి యోగి శ్రేష్ఠుడు గురువు శ్రీసాయిరాం గురువును నమస్కరిస్తున్నాను.
29 ఓం శ్రీ సాయిరాం ధన్వంతరాయ నమ:
మనస్సు, శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించు వైద్యుడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
30 ఓం శ్రీసాయిరాం వ్యోమకేశవా నమ:
అంతరిక్షాన్ని కేశాలుగా కలిగిన వాడు.అంతం లేనిది అనంతం. ఆద్యంతాలు లేనివాడు పరమాత్మ ఒక్కడే. సృష్టి, స్థితి, లయములను శాసించే పరమశివుడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
31 ఓం శ్రీసాయిరాం నిష్కళంకాయ నమ:
నిరహంకారి,ఎటువంటి దోషము లేదా పాపము లేని వాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
32 ఓం శ్రీసాయిరాం విశ్వరూపాయ నమ:
భగవంతుని రూపమే విశ్వము. ఆయన లేనిదే ఈ విశ్వమే లేదు. కనిపిస్తున్న చరాచర విశ్వమంతా తన రూపంగా కలవాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
33 ఓం శ్రీసాయిరాం హృద్యాయ నమ:
ఓం శ్రీసాయిరాం హృద్యాయ నమ: హృదయమునకు ఆనందము కలిగించు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను

ఓం శాంతి: శాంతి: శాంతి:

Monday, September 9, 2024

*ఓంకార రూప సాయి* *వేదాలకు మూలమైన ప్రణవ స్వరూపంగా దివ్య దర్శనం ఇస్తున్న అపురూప సాయి తైలవర్ణ చిత్ర పటం.*

*ఓంకార రూప సాయి*


*వేదాలకు మూలమైన ప్రణవ స్వరూపంగా దివ్య దర్శనం ఇస్తున్న అపురూప సాయి తైలవర్ణ చిత్ర పటం.*

*పూర్వం ఈ తైలవర్ణ చిత్ర పటం చావడిలో స్త్రీలు ప్రవేశించే ఉత్తర గోడనానుకొని, ద్వారం ముందు భాగంలో వుండేది.*

*మన సాయి చావడిలో నిద్రించే రోజున శేజ్ ఆరతి, మరురోజు కాకడ ఆరతి ఈ పటం వున్న స్థానంలో కూర్చునేవారు.*

*ఈ ప్రణవ సాయి చిత్రాన్ని  నౌసారి ( నవసరి ) గ్రామానికి చెందిన అంబారామ్ లాల్ భాయ్ కహర్ అనే 18 సంవత్సరాల యువకుడు 1953 చిత్రించాడు.*

*సాయి ప్రసాదించిన అద్భుతమైన స్వప్న సాక్షాత్కార ఫలితంగా అతడు అంత చక్కటి పటం చిత్రీకరణ చేయగలిగాడు.*

*అంబారామ్ ఈ చిత్రపటాన్ని నౌసారిలో వున్న అవతార్ మెహర్ బాబా కేంద్రం కు ఇచ్చారు.*

*ఈ అత్యద్భుతమైన పటాన్ని చూసి, బాబా లీలకు ముగ్ధులైన నౌసారి గ్రామస్తులు,  చెందారు వసూలు చేసి,  6 అడుగుల 4 అంగుళాల పటానికి అందమైన ఫ్రేము కట్టించి, శిరిడిలో వుంటే బాగుంటుంది అని రెండు రోజులు అఖండ సాయి నామ జపం, పూజలు నిర్వహించి, పెద్ద ఉత్సవంగా షిరిడీకి ఫిబ్రవరి 1953లో  తీసుకుని వచ్చి సాయి సంస్థానానికి సమర్పించారు.*

*సంస్థానం వారు ఈ అరుదైన చిత్రపటాన్ని సమాధిపై, సమాధి మందిరంలో వుంచాలి అని అనుకున్నారు.*
*అప్పటికే సాయి మూర్తి ( విగ్రహం ) చెక్కించే పనులు చురుకుగా సాగుతున్న కారణంగా, చిత్రపటాన్ని చావడిలో ఉంచారు.*

*ఈ చిత్రంలో కుడివైపు ఆంగ్లంలో చిత్రకారుడు అంబారామ్ పేరు వుంటుంది.*

*ప్రస్తుతం ఈ చిత్ర పటం సాయి పారాయణ హాలులో వుంది*

Sunday, September 1, 2024

శ్రావణ కృష్ణ అమావాస్య* *మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

 శ్రావణ కృష్ణ అమావాస్య*

*మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

*ఉత్తర భారతదేశంలో* 
*" హరియాలి అమావాస్య " అంటారు*

*కొద్ది రాష్ట్రలలో వారి సాంస్కృతిక, సాంప్రదాయం ప్రకారం ఈ రోజు పండుగగా జరుపుకుంటారు.*

*శిరిడీలో, మహారాష్ట్రలో* 

*" పోలాల అమావాస్య "ఎంతో వైభవంగా జరుపుకునే విషయం మనకు తెలిసిందే.*

*మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం*

*మహారాష్ట్రీయులు ఈ రోజు తమ  పాడి పంటలు వృద్ధి కోసం శ్రమ పడిన పశు సంపదకు కృతజ్ఞతగా పూర్వకంగా పూజలు నిర్వహిస్తారు.*
*వాటికి అభ్యంగనస్నానం, వివిధ రకాల అలంకరణలు చేసి, పూజలు చేస్తారు.* 

*పిండి వంటలతో షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగింపు చేయిస్తారు*  

*సమాధి మందిరంలో, మధ్యాహ్న ఆరతికి ముందు సాయి మూర్తికి ( విగ్రహానికి ) ఇరువైపులా మట్టితో చేసిన రంగు రంగుల 5 ఎద్దులు, 1 ఆవు, దూడల ప్రతిమలను ఉంచుతారు.*
*వాటికి  గంధం, పుష్పాలతో పూజ చేసి నైవేద్యంగా వరి అన్నం, పూర్ణ పోళీలు సమర్పిస్తారు.*

*శిరిడిలో సాయంత్రం అలంకరించిన తమ పశు సంపదను గేట్ నెంబర్ 4 ద్వారా తీసుకుని వచ్చి సమాధి మందిరం కిటికీ దగ్గర నిలబెట్టి సర్వజీవ కారుణ్యమూర్తి సాయిని దర్శింప చేస్తారు.*

*( ప్రస్తుత కారణాల వలన ఈ రోజు పశు సంపదకు దర్శన ఏర్పాటు గురించి సమాచారం లేదు )*

*నిమ్నోకర్ భార్య, బేలాపూర్ ప్రయాణం కథ మనం సాయి సచ్చరిత్రలో పారాయణ చేసినదే.*

*నిమ్నోంకర్ ఆమెను రెండవ రోజే తిరిగి రావాలని ఆదేశించారు. ఆ రోజు అమావాస్య, అమావాస్య ప్రయాణానికి శుభసూచకం కాదని ఆమె సంశయిస్తుంది.*
*అది కాకుండా తన పిల్లలు, బంధువులతో " పోలాల అమావాస్య " రోజు గడపాలి అని మనసులోనే కోరుకుంటుంది.*

*సర్వాంతర్యామి సాయి ఆమె మనస్సు లోని కోరికకు అనుగుణంగా, బేలాపూర్ వెళ్లి నాలుగు రోజుల తరువాత తిరిగి షిర్డి రమ్మంటారు.*

సేకరణ, సమర్పణ

*చిల్లర కృష్ణమూర్తి*
06-09-2021