Sunday, May 9, 2021

శ్రీ సాయినాథ అష్టోత్తర శత నామావళి . " ఓం సర్వ మంగళ కరాయ నమః "

శ్రీ సాయినాథ అష్టోత్తర శత నామావళి .
" ఓం సర్వ మంగళ కరాయ నమః "
మంగళం అంటే శుభం .సర్వ జనులకు శుభం 
కలిగించేవాడు లేదా సర్వ మంగళకరంగా పర్యవసింప చేసేవాడు -అని అర్థం .శ్రీసాయిబాబా 
మాకు తల్లీ ,తండ్రి ,గురువు ,దైవం .అందుచేత 
ఆయన మనలను తల్లిగా ప్రేమించి ,తండ్రిలాగా 
దండించి ,గురువులాగా హితోపదేశం చేసి ,
దైవంలాగా ఆదుకొంటాడు .ఒకొక్కసారి ఆయన చేసింది కొంచం బాధాకరంగా కనిపించవచ్చు కానీ 
అది శుభప్రదము అయి తీరుతుంది .ఏది జరిగినా 
అది మన మంచికే భావించడం శ్రేయస్కరం .ఒక 
క్షణంలో చెడుగా కనిపించిన సంఘటన మరొక 
క్షణంలో మరొక క్షణంలో మహోపకారముగా 
పరిగణించటం మన నిత్య జీవితములో చూస్తుంటాము .పూర్వము ఒక రాజుగారి చేతి 
వేలు తెగి ఊడిపోయింది .మంత్రిగారు ఓర్పుగా 
" చింతించకండి మహా ప్రభో ! ఆంతా మన మంచికే " అని అన్నాడు .రాజు గారికి వళ్ళు మండి ,మంత్రి గారి ని జైలులో వేయించి ,ఆంతా 
నీ మంచికే " అనేసి వెళ్లిపోయాడు .రెండు రోజుల 
తరువాత రాజు గారు అడవికి వేటకు వెళ్లి కోయవాళ్ళ చేతిలో చిక్కాడు .వాళ్ళు ఒక అందమైన మనిషిని ,వాళ్ళ కొండ దేవతకు బలి 
ఇవ్వటానికి వెతుకుతున్నారు .మరి రాజుగారి చేతివేలు తెగిపొయి ఉండటం చూసి బలికి 
పనికిరాడని వదలివేశారు .రాజు గారు తిన్నగా 
జైలు దగ్గరకి వచ్చి " మంత్రీ ! నీవు చెప్పినట్లే 
జరిగింది .నా వేలు లెకపోవడమే నన్ను రక్షించింది 
అని అన్నాడు .మంత్రి చిరునవ్వుతో " మహరాజా ! అంతా మన 
మంచికే .ఈ జైలు శిక్ష నాకు పడకపోతే ,నేను 
మీతో నేను కూడా వచ్చేవాడిని .ఆ ఆటవికులు 
అన్నీ అంగాలు సరిగాఉన్న నన్ను బలి చేసేవాళ్ళు .చూశారా ! ఈ జైలు శిక్ష కూడా నా మంచికే వచ్చింది ." అని అన్నాడు .హేమాడ్ పంత్ 
రచించిన సాయిసచ్చరిత్రలోని దాము అన్నా తలపెట్టిన వ్యాపారాలు మాన్పించి ,నష్టాల నుండి 
కాపాడుట ,నాందేడు షాపుర్జీ వాడియాకు 12 మంది సంతానాన్ని ప్రసాదించి ,చివరకు నలుగురిని మిగిల్చి వైరాగ్యాన్ని పెంచడం -
ఇలాంటివే ఆ స్వామి చేసేది ఆంతా మంగళమే .
అది మనము చూడగలగాలి అంతే ! అట్టి మంగళ 
ప్రదునికి ఇవే నా ప్రణామములు .

Saturday, April 17, 2021

శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం - శ్రీ ఉపాసనీ మహరాజ్ .
శ్రీసాయినాధమహిమ స్తోత్రం షిర్డీసాయి కిచ్చే మధ్యాహాన ,సాయంకాల హరతులలో పాడుకొంటాము .దీనిని రచించింది సాయిభక్త 
శ్రీ ఉపాసనీ మహరాజ్ .శ్రీ ఉపాసనీ షిరిడీలో సాయి సన్నిధిలో అధ్యాత్మిక శిక్షణలో ఉన్నప్పుడు 
1911 సం .లో రచన చేసాడు .1912 సం.లో 
శ్రావణ పౌర్ణమినాడు షిరిడీలో గురుస్థాన్ లో 
బాబా వేపచెట్టు క్రింద తపసు చేసిన గుర్తుగా 
పాలరాయి పాదుకలు ప్రతిష్టించబడినవి .ఆ సందర్భములో పాలరాతి పాదుకలు ప్రతిష్టించిన 
చిన్న ఎత్తు స్తంభముపై ఈ మహిమస్తోత్రము లోని 
నాలుగు ,అయిదు శ్లోకాలు చెక్కబడినవి .ఈ మహిమా స్తోత్రం నిత్య పారాయణ ఎంతో శుభకరం .ఈ శ్లోకాలన్నిటిలోనూ చివరగా "నమామీశ్వరం సద్గురు సాయినాథం " అను శ్లోకం 
ఒక మకుటం .ఇందులో శ్రీ సాయిబాబావారి ఈశ్వరతత్వం ,గురుతత్వం ప్రస్ఫుటముగా కనిపిస్తుంది .ఈశ్వర తత్వం అనగా సర్వ శక్తిమత్వం ,సర్వవ్యాపక తత్వం ,సర్వఙ్ఞత ,ఈ సృష్టియందు తనకు గల సర్వభౌమత్వం విశదమవుతుంది .నిరంతరం ఆత్మధ్యాన స్ధితి ,
తన ను, సమర్ధసద్గురువుగా ఆశ్రయించినవారికి 
గురుతత్వం బోధించి తనంతవారిగా చేయుటయే 
గురువుగా తన ఆశయం  .బాబా పరబ్రహ్మ స్థితిగా 
ఒక గురుస్వరూపంగా ,ఈ రెండు తత్వాలూ ,ఈ 
మహిమా స్తోత్రంలో కనిపిస్తాయి  .
నమామీశ్వరం సద్గురు సాయినాధము .

Wednesday, March 31, 2021

సాయినాథుని దినచర్య

ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

 సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

 హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.

నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు..!: సాయిబాబా...!

Saturday, March 13, 2021

*శ్రీ శిరిడీ సాయిబాబా వారు స్వయంగా మరాఠీ లో చెప్పిన ఏకాదశ సూత్రాలు......* శ్రీ సాయినాధ్ మహరాజ్ వారి ఏకాదశ సూత్రాలు సాయి ఆరతులలో ’అనంతా తులాతే కసేరే స్తవావే’ అన్ననమస్కారాష్టకాన్ని వ్రాసిన *శ్రీ మోహినీ రాజ్ పండిట్* అభంగ రూపంలో వ్రాసారు. ఆరతి తర్వాత షిరిడీ సంస్థానంలో ఆ అభంగాన్ని వినిపిస్తూంటువుంటారు. అయితే సాయి ఏకాదశ సూత్రాల పేరిట ప్రాచుర్యంలో వున్న సూత్రాలకివి భిన్నంగా వుంటాయి. సాయి భక్తుల సౌకర్యార్దం శ్రీ మోహినీ రాజ్ పండిత్ వ్రాసిన మరాఠీ అభంగాన్ని దానికి శ్రీ స్వామి అచలానంద సరస్వతి చేసిన తెలుగు అనువాదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను,

*సాయి ఏకాదశ సూత్రాలు మరాఠీ మూలం: శ్రీ మోహినీ రాజ్ పండిత్* 
తెలుగు సేత: *స్వామి అచలానంద సరస్వతి* 

*శిరిడీస్ జ్యాచే లాగతీళ్ పాయ్!* *టకతీ అపాయ్ సర్వ త్యాంచే!! 1* 

1.శిరిడీలో అడుగు పెట్టిన తక్షణమే! తొలగిపోవును భక్తుల సర్వ అపాయాలు!! 

*మాఝ్యా సమాధీచీ పాయరీ చఢేల్!* *దుఃఖ్ హేఁ – హఠేల్ నర్వ త్యాంచే 2* 

2.నా సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే! హరియించును భక్తుల సర్వ దుఖాలు!! 

*జరీ హేఁ శరీర్ గేలోఁ మీ టాకూన్!* *తరీ మీ దాఁవేన్ భక్తాం సాఠీం!! 3* 

3.ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళిపోయినా! వస్తాను పరుగు పరుగున భక్తుల హితం కోసం!! 

*నవసాన్ మాఝీ పావేల్ సమాధీ!* *ధరా ధృఢ్ బుద్ధీ మాఝ్యాఠాయాం!! 4* 

4.ప్రాప్తిస్తాయి నా సమాధిలో మీ కోరికలన్నీ కూడా! ఉంచండి నా యందు మీ ధృఢ విశ్వాసం!! 

*నిత్య మీ జీవంత, జాణా హేఁచి సత్య!* *నిత్య గ్యా ప్రచీత అనుభవే!! 5* 

5.నిత్యం జీవించే వుంటాను నేను ఇది పరమ సత్యం! స్వానుభవంతో తెలుసుకోండి ఇదే సత్యమని నిత్యం!! 

*శరణ్ మజ్ ఆలా, ఆణి వాయాం గేలా!* *దాఖ్ వా దాఖ్ వా ఐసా కోణీ!! 6* 

6.నన్ను శరణ కోరి నిరాశులై మరలిన వారిని! ఒక్కరిని ఒక్కరినైనా ఎవరైనా నాకు చూపండి!! 

*జోజో, మజ్ భజే, జైశా జైశా భావేఁ!* *తైసా తైసా పావేఁ, మీహీ త్యాసీ!! 7* 

7.ఎవరెవరు నన్ను ఏలా ఏలా భావించి భజిస్తారో! వారి వారికి నేను అలా అలానే ప్రాప్తిస్తాను!! 

*తుమ్ చా మీ భార్ వాహీన్ సర్వధా!* *నన్హే హేఁ అన్యధా వచన్ మాఝే!! 8* 

8.మీ భారాన్ని నేను వహిస్తాను సర్వధా! ఈ నామాట కానే కాదు ఎప్పుడూ అన్యధా!! 

*జాణా ఏథేఁ ఆగ్/ఎ సాహాయ్య సర్వాంస!* *మాగే జేజే త్యాస తేఁ తేఁ లాభే!! 9* 

9.అందరికీ లభిస్తుంది ఇక్కడ నా సహాయం! ఎవరెవరికి ఏమేమి కావాలోఅవన్నీ దొరుకుతాయి!! 

*మాఝా జో జాహ్ లా కాయావాచామనీఁ!* *తయాచా మీ ఋణీ సర్వకాళ్!! 10* 

10.కాయా వాచా మనసుతో నాకంకితమైన వారికి! ఎల్లప్పటికీనేను ఋణపడి వుంటాను!! 

*సాయీఁ మ్హణే తోచి తోచి ఝాలా ధన్య్!* *ఝాలా జో అనన్య మాఝ్యా పాయీఁ!! 11* 

11.నా చరణాల్లో అనన్య భక్తితో అంకితమైన వారు! వారే సుమా ధన్యులు ఇదే నా వచనం!! షిరిడీ సాయిబాబా़्

Sunday, March 7, 2021

"ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో 
సాయబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు 
అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ 
సమర్థ .తన దేహము చాలించిన తరువాత తన 
భక్తులు ,ఆశ్రీతులు అయిన కొందరిని షిర్డీ సాయబాబా వద్దకు వెళ్లమని సలహ యిచ్చారు .
షెగాం మహారాజుగా ప్రసిద్దులైన గజానన మహరాజ్ ,గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే కుటుంబాన్ని ,
సాయిబాబాను ఆశ్రయించమని అదేశించారు .
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ,రాజాధిరాజా ,
యోగిరాజా ,పరబ్రహ్మ ,సమర్థ సచ్చిదానంద సద్గురువుగా ,సాయిబాబాను కీర్తించటం మామూలు అయినది భక్తులకు .అందరికీ సాయినాధునిలో సుగుణాలు ఆకట్టుకొన్నాయి .
ఆలా ఆకట్టుకోవడం ఎప్పటినుండో జరిగేదీ .
ఒకసారి సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాన్ 
సంభవించింది .గాలి ఎక్కువ అవుతున్నది .నేల 
అంతా నీటిమయమవుతుంది .షిర్డి గ్రామ వాసులు అందరూ ద్వారకామాయికి వచ్చారు .
వారు విపత్తును తొలగించమని బాబాను ప్రార్ధించారు .బాబా గొప్ప ధ్వనితో మశీదు అంచున నిలబడి " ఆగు ! ఆగు ! నీ కోపమును 
తగ్గించుము .నెమ్మదించుము ! " అని తుఫాన్ ని 
గద్దించారు .కొన్ని నిముషాలలో తుఫాను ఉధృతి 
తగ్గింది .చంద్రుడు కనిపించాడు .ఎవరి ఇళ్లకు 
వారు వెళ్ళిపోయారు .అలాంటి దైవిక శక్తులతో 
ప్రజలను కాపాడతారు మహనీయులు .

Saturday, March 6, 2021

రుసో మమ ప్రియాంబికా ,మజ వరి పితాహి రుసో 
రుసో మమ ప్రియం గానా ,ప్రియసుతాత్మజాహీ రుసో భగిని బంధుహి .........
ఈ హరతి గీతం సాయంకాలము హరతిలో,
 భక్తులు భక్తిపూర్వకంగా పాడుకొనే గీతం .
దీనికి రచించినవారు బాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ 
విశ్వనాధ్ దేవ్ .ఈయన ప్రస్తావన సాయిసచ్చరిత్ర 
5 ,41 వ అధ్యాయములో కనిపిస్తుంది .శ్రీ బి వి.దేవ్ రచించిన ఈ హారతి గీతం బాబా మహాసమాధి చెందిన 22 సంవత్సారలకు అనగా 
1940 సం.లో షిర్డి హరతులలో చేర్చబడినది .
దీనిని శ్రీ బి.వి.దేవ్ 7 -3 -1940 గురువారము నాడు సంకలనం చేసారు .నేటికి 81 సంవత్సరాలు ముగిసాయి .శ్రీ బి.వి.దేవ్ బాబా మహాసమాది అనంతరం ,ఆయన 1946 సం.లో దేహన్ని విడిచారు .ఆయన జీవితకాలం షిర్డి సాయిసంస్థాన్ సభ్యుడిగా పనిచేసి ,సంస్థాన్ వారి 
సాయిలీలామాసిక్ పత్రిక లో " బాబాంచె బాల్ "
అను కలంపేరుతో అనేక వ్యాసాలు వ్రాశారు .సాయిసచ్చరిత్ర గ్రంథ రచయిత శ్రీ హేమాడ్ పంత్ 1929 సం .లో దేహాన్నివిడిచి సాయిలో ఐక్యమైన పిదప ,సాయిసచ్చరిత్ర 53 వ 
అధ్యాయమును సంకలనం చేసి గ్రంథం పూర్తి 
చేసారు .ఈ హరతి గీతం సాయబాబా అనుగ్రహ 
ప్రసాదయాచన జరుగుతుంది .తల్లితండ్రులు ,
తోడబుట్టినవారు  ,బంధువులు  ,సృష్టిలో గల సర్వ భూతములు మున్నగువారు  ,అలిగిన తనను విడవవద్దని ,తనపై అలుగవద్దని అతివినయంగా  
ఎంతో శరణాగతితో వ్రాసి బాబాను వేడుకున్న 
"ప్రసాద యాచనా దశకం "శ్రీ బి.వి.దేవ్ గారి అనన్యభక్తిని స్మరణచేసి ,సాయికృపకు పాత్రులగుదాం .

Thursday, March 4, 2021

🌹ఓం శ్రీ సాయిరాం... శుభోదయం 🌹బాబాకు మనం రోజు పూజ చేసుకుంటాము. ఆయన భక్తిలో చాలామంది పరవశం పొందుతారు. అలాంటి పరవశమే ఇప్పుడు మన అందరమూ పొంద ప్రయత్నిద్దాము.

బాబా ఆరతి అయిన తరువాత ద్వారకామాయి అరుగు మీద కూర్చొని ఒక్కొక్కరికి నుదిటిన ఊది పెట్టి ఆశీర్వదించి పంపుతారు. ఒక్కసారి మనం కూడా ఆ అనుభూతిని పొందుదాము. 

ఇప్పుడే ఆరతి అయిపొయింది. మనమందరము ఒక వరుసలో బాబా ఆశీర్వదంకోసం తపిస్తూ ముందుకు నడుస్తున్నాము. బాబా దివ్యమంగళ రూపం మనకు కనిపిస్తుంది.

 ఆయన పొడవాటి తెల్లని కఫ్ని  ధరించి ఉన్నారు. తలపై ఒక తెల్లటి గుడ్డను చుట్టి దాని అంచులు జడవలె మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవుమీదగా వెనుకకు వేలాడుతూ ఉంది. బాబా వెనక ద్వారకామాయిలో ఉన్న ధుని మంట కనపడుతుంది.

ఆ ధుని వెలుతురు బాబా తల వెనక ఒక కాంతిపుంజంలాగా కనపడుతూ ఉంది. వెనుక గోడ దగ్గర ఉన్న గూడు, పూల మాలలతో ఉన్న నింబారు బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని గుర్తుచేస్తుంది. 

ఇంతలోనే బాబా ఎదురుగా చేరుకున్నాము. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఎదో తెలియని అనుభూతి. అలానే మనసులో నా తండ్రిని చూస్తున్నాను,

ఆయన ఆశీర్వాదాన్ని పొందబోతున్నాను అనే ఉత్కంఠ. అంతలో బాబా కుడిచెయ్యి పైకి లేచింది. నా కళ్ళు మూతలు పడ్డాయి.

ఊది నుదిటిపై పెట్టి బాబా తన చేతిని నా తలపై ఉంచారు. నా మనస్సు సంతోషంతో నిండిపోయి, కండ్లనిండా ప్రేమ పొంగిపోయింది. ఈ ఆనందానికి అవధులు లేవు. నా గురువు నా హృదయంలోనే ఉన్నారు అన్న భావన అధికం అయింది. 

నేను, నీవు అన్న భావన ఈ స్పర్శతో నశించింది. సాయియే సర్వం అనిపించింది. అంతా సాయి మయం, ఎప్పుడు లేని అనుభూతి. సాయే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమ శివుడు. సాయే సర్వదేవతా స్వరూపము. సాయే నిర్గుణము. ఈ అనుభూతి ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అని మనసులో ఆరాటం. 

హేమద్పంత్ గారు గురు కర స్పర్శ  ప్రభావం గురించి మనకు కళ్ళకు కట్టినట్లు చూపించి అందులో ఉన్న పరమార్ధాన్ని తెలిపారు. ఈ అనుభవం బ్రహ్మైక్య భావనతో సమానమైనదిగా చెప్పారు. 

🌹ఓం శ్రీ సాయి రామ్🌹

Tuesday, January 19, 2021

కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ చరిత్ర / స్థలపురాణం
 
సాయి నిజ పాదుకల చరిత్ర:
షిర్డీ సాయిబాబా ప్రతీరోజూ 5 ఇళ్ళలో బిక్ష చేసేవారు. అలా బిక్ష చేసే ఇళ్ళలో శ్రీ వామన్    గొం డ్కర్ ఇల్లు కుడా ఒకటి. అలా బిక్ష రూపంలో తీసుకుని   వచ్చిన పదార్ధాలలో కొంత ద్వారకామా7యి ద గ్గర ఉండే కుక్కలకూ, పక్షులకూ, పిల్లులకూ రోజూ ఒకే ప్రదేశంలో ఒక బండ మీద నిలబడి జల్లేవారు. తదుపరి జంతువులు స్వేచ్చగా వచ్చి 5. అలా అనేక సంవత్సరాలు అదే బండపై నిలబడి ఆహారం వేదజల్లడం వల్ల శ్రీ సాయిబాబా వారి పాద ముద్రలు వాటి మీద శాశ్వతంగా పడ్డాయి. ఇది వింతల్లో కెల్లా 54444వింత. శ్రీ సాయిబాబా నిజ పాద ముద్రలు పడిన ఏకైన బండ అది. అయితే శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ప్రతి రోజూ బిక్షలో ఏదో ఒక ద్రవ పదార్ధాన్ని,te(పులుసు,పాయసం,చారు లాంటివి) ఇచ్చేవారు. అది గమనించిన సాయి బండ మీద శాశ్వతంగా పడిన పాద ముద్రల  There is no proper  signal in this area meeting continue gaa ravadam leduu తన చూపుడు వ్రేలితో గుండ్రంగా బండ మీద తిప్పి అప్పటికప్పుడు ఒక గుంతను,te (Pit Hole) చేసారు. శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ఇచ్చే ద్రవ పదార్ధాలను ఆ గుంతలో పోసేవారు,te. ఒక్కోసారి పక్షుల దాహం తీర్చడం కోసం ఆ గుంతలో మంచినీళ్ళు కుడా పోసేవారు .

KRL-37E

సాయి నిజ పాదుకలు Korhale గ్రామానికి ఎలా తీసుకుని రాబడ్డాయి?
శ్రీ సాయి బాబా మహా సమాధి అనంతరం నిజ పాదుకా ముద్రలు కలిగిన ఆ బండ శ్రీ వామన్ రావ్ గొండ్కర్ గారు భద్రపరిచారు. తదుపరి శ్రీ వామన్ రావ్ గొండ్కర్ మనవడైన అమృత రావ్ గొండ్కర్ వద్దకు ఆ నిజ పాదముద్రల బండ చేరింది. వారు ఆ నిజ పాదముద్రల బండను కలిగిన భూమిని నిజ పాద ముద్రలు పడిన బండతో సహా గుజరాతీ వారైన “భికాజీ – షకారాంషెల్కే” కుటుంబానికి అమ్మారు. భికాజీ వారు Shirdi లో “Nrusimha Guest House” (Nrusimha Lodge) అనే పేరుతో ఒక Lodge ను కట్టారు. అలా కడుతున్నప్పుడు ఈ నిజ పాదముద్రలు పడిన బండను ఒక గోడలో పెట్టి సిమెంటు చేసి స్థిరంగా ఏర్పాటుచేసారు. తదుపరి 2004 లో Shirdi బాగా ఆధునీకరింపబడినది. ఆధునీకరణలో భాగంగా Nrusimha Guest House ఉన్న రోడ్డును (Pallaki Road) వెడల్పు చేయసంకల్పించారు. అందులో భాగంగా శ్రీ సాయి బాబా నిజ పాదుకా ముద్రలు ఉన్న ఆ బండను స్థాపించిన గోడను (Nrusimha Guest House ముందు భాగాన్ని) 06/May/2004 రోజున పడగొట్టాలని నిర్ణయించారు. అక్కడి స్థానికులు ఎంత చెప్పినా అధికారులు వినలేదు. Bulldozer లతో ఆ గోడను కుల్చేసారు. వందల కొద్దీ పగిలిన ఇటుక రాళ్ళు ఆ నిజ పాద ముద్రలపై పడ్డాయి. జరిగేదంతా అక్కడే నిలబడి చూస్తున్నాడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు). తదుపరి Shakaaram Shelke వంశస్తులైన వారు అక్కడ నిలబడ్డ ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ను చూసి “ఈ బండను మీరు తీసుకెళ్ళండి” అని వారి చేతిలో పెట్టారు. ఇది వింతలో కెల్లా వింత.. అసలుసిసలైన వింత. ఎక్కడి అబ్దుల్ జాన్ పఠాన్ కాలం(1918) ఎక్కడి 2004వ సంవత్సరం!… బాబా అన్న మాట నిలబెట్టుకున్నారు. బాబా వారి పాదాలను అబ్దుల్ జాన్ పఠాన్ వద్దకు చేర్చారు. ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ద్వారా శ్రీ సాయి నిజ పాదుకా ముద్రలు కలిగిన బండ రాయి Korhale గ్రామం చేరింది. తదుపరి అక్కడి వారు ఎవరిని అధిక మొత్తంలో విరాళాలను అడగకుండానే సాయిబాబానే మందిరం కట్టడానికి కావాల్సిన డబ్బును కుడా సమకూర్చడం వల్ల ఇప్పుడు అక్కడ (Korhale లో) ఒక అందమైన సాయి బాబా మందిరం కట్టబడినది. ఎంతటి ఆశ్చర్యము.. బాబా లీలలు అంతే ఉంటాయి. శ్రీ బాబా శ్రీ బాబానే! వారికి వారే సాటి. బాబా వస్తువులు ఎన్నో..ఎన్నెన్నో Sansthan వారి Museum లో చేరాయి, భద్రపరచబడ్డాయి.ఈ ఒక్క నిజ పాదుకా ముద్రలుపడిన బండ తప్ప. అది ఎప్పటికీ అబ్దుల్ జాన్ పఠాన్ వారిదే!

మా మిత్రులు కీర్తి వల్లభ గారి సేకరణ. 

అల్లు జయశ్రీ

Friday, January 1, 2021

*ఓంశ్రీ సాయిరాం*

నేడు షిరిడీలో ద్వారకామాయిలో ధుని ఎదురుగా 
దర్శనమిస్తున్న బాబా ఆసీనుడైయున్న చిత్రపటం 
ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది .

ప్రతీ సాయిభక్తుల గృహాలలోను ,కొన్ని సాయిమందిరాలలోను ఈ చిత్రపటం దర్శనమిస్తుంది .ఈ పటానికి రూపుదిద్దినవాడు 
ఆ రోజులలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు 
అయిన శ్యామరావు జయకర్ .

సుమారు 1916 
సం .ప్రాంతంలో జయకర్ తన భార్యా ,పిల్లతో 
సహ సాయి దర్శనానికి షిర్డీ వచ్చాడు .జయకర్ 
బాబా చిత్రాన్ని గీయటానికి అనుమతించమని 
బాబాను ప్రార్దించాడు .అది విన్న బాబా " అరే ! 
పిచ్చి బిచ్చగాడిని .నా చిత్రం గీసుకొని ఏమి చేసుకొంటావు ? " అన్నారు .చివరికి బాబా తన 
చిత్రపటం గీయడానికి ఒప్పుకొన్నారు .

సాయి 
ప్రేరణతో జయకర్ గీసిన చిత్రం ,ద్వారకమాయిలో 
ఇప్పటికీ షిరిడీలో కొలువై ఉంది .జయకర్ గీసిన చిత్రం ,సాయిసచ్చరిత్ర తోనూ ,బాలాజీ వసంత్ 
తాలిమ్ మలచిన సమాధిమందిరం లో ఉన్న సాయిబాబా విగ్రహమూర్తితో పోల్చవచ్చును .

సాయిసన్నిధిలో ఉండే భక్తులకు కూడా, కష్టాలు 
తప్పవు .జయకర్ షిరిడీలో ,సాయిసన్నిధిలో ఉండే సమయములో ,మసూచి వ్యాధితో జయకర్ పెద్ద కుమారుడైన రఘునందన్ మరణించాడు .శ్యామరావు జయకర్ భార్యా ఎంతో దుఃఖంతో  ,బాబా ముందు తన బాధను 
వినిపించింది .బాబా ఆమెను ఓదారుస్తూ ,విధి బలీయమని చెప్పగానే ఆమె కొంత శాంతించింది .
కానీ బాబా భక్తుల దుఃఖాన్ని చూస్తూ ఉరుకోలేడు 
గదా ! 

ఆమె దుఃఖం బాబాను చలింపచేసింది .
బాబా జయకర్ భార్యతో " దిగులు చెందకు !
నీ చనిపోయిన బిడ్డ మరల నీ కడుపున పుడతాడు .

బాబా వాక్కు బ్రహ్మ వాక్కు .అది 
కేవలం ఊరడింపు మాట కాదు .అది సత్యమే అయి తీరుతుంది .విధిని కూడా ఎదిరించగల శక్తి 
బాబాకు వుంది .బాబా అన్నట్లుగానే జయకర్ దంపతులకు ,బాబా మహా సమాధి అనంతరం 
1920 సం .లో ఒక బిడ్డ జన్మించాడు .ఆ బిడ్డకు 
ఆ దంపతులు " రామ్ " అని పేరు పెట్టారు .
సాయబాబా ఒక చేతితో  మన కర్మానుసారం తీసివేసినా ,
మరొక చేతితో ఇవ్వగల సమర్థ సద్గురువు .

*దానికి ఆయనయందు అచంచల విశ్వాసం,ఓర్పు ఎంతో అవసరం* .

🌹 *"నేనే దైవాన్ని", " నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు!", నీవు చూచేదంతా కలిపితే నేను!", - "ఎవరైతే ఈ మూడున్నర మూరల దేహాన్నే 'సాయి ' అని అనుకోంటారో వారసలు 'సాయి'ని చూడనట్లే!", "నా మట్టి మాట్లాడుతుంది;

 నా సమాధి సమాధానమిస్తుంది!", "నా భక్తులు కోరినవన్నీ యిస్తాను; నేనివ్వదలిచింది వారడిగేంతవరకు!"* --- అన్న శ్రీసాయి యొక్క అసలు తత్త్వమేమిటి? శ్రీసాయి యొక్క భక్తరక్షణపరతంత్రతకు, భక్తపరాయణత్వానికి మూలమైన ఆయన అవ్యాజప్రేమతత్త్వానికి  పునాదులేమిటి? శ్రీసాయి తమ మాట ద్వారా, చేత ద్వారా మానవాళికందించిన మహిత ప్రబోధమేమిటి? *"

మా సంప్రదాయమే వేరు!"* అన్న శ్రీసాయి యొక్క అసలైన సంప్రదాయమేమిటి? శ్రీసాయి ఆవిష్కరించిన ఆ విశిష్ట సంప్రదాయానికి నిజమైన వారసులమై, శ్రీసాయి ప్రేమను, రక్షణను ఇంకా ఇంకా అపారంగా పొందేందుకు మనమేం చేయాలి? -

- మొ||న ప్రశ్నలను జిజ్ఞాసతో మనకు మనం వేసుకొని, వాటికి సమాధానాలను శ్రీసాయిచరిత్రలో శ్రద్ధగా అన్వేషించి అవగాహన చేసుకోవడమే --- *నిజమైన శ్రీసాయిచరిత్ర పారాయణ! "*

- *శ్రీబాబూజీ* (ప్రార్థనాపథం)