Tuesday, June 16, 2020

బాబా వాక్కూ భగవంతుని వాక్కే.

ఇమాంభాయి చోటేఖాస్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేష్షా అను ఫకీరును ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి, ఆయన గొప్ప 'ఔలియా' (సిదుడు) అని తెల్పే మార్గం చెప్పాడు.


చాటుగా బాబా వెనుకకు జరిగి, మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దనీ చెప్పాడు. ఇమాంభాయి శిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిలోని ఒక భక్తురాలి మొర వింటున్నారు. అతడు దర్వేష్షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, "ఎవరు నీవు? నా తండ్రివైనటు ఏదో అడగడానికి వచ్చావే" అని అరచి, అతనిని తిడుతూనే మసీదు చేరారు. రెండు రోజులవరకు అతనిని మసీదులోనికి రానీయలేదు. ‘బాబా, అతడూ మీ బిడ్డడే కదా కోపమెందుకు?' అన్నాడు కాకాసాహెబ్ "వాడు నా బిడ్డంటావా? వాడు ఒక టీచరును కొట్టాడు!" అన్నారు బాబా, నిజమే! అతడు పోలీసు, ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్ళంతా రక్తంకారి, స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాంభాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదలి పారిపోవాలని సాటివారు చెబితే, అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, "భయపడకు, భగవంతుడే యజమాని!" అని ఆశీర్వదించారు అతడికెట్టి శిక్షా పడలేదు.

తర్వాత ఒకసారి అతడు యింటికి వెళ్ళడానికి సాయి సెలవు యివ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన, "వెళ్ళవద్దు. వెళితే గాలివాన, పిడుగులు, నిప్పుకణాలు ఎదురవుతాయి" అన్నారు. అయినా అతడు బయల్దేరి సాయంత్రానికి సురళానది ఒడ్డుకు చేర్రి, కొద్దిదూరం వెళ్ళేసరికి బాగా మబ్బుపట్టి, గాలివాన ప్రారంభమైంది.

దారిలో ఒకచోట మట్టిచెట్టుమీద పిడుగు పడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపునుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు ఆ దైర్యం తో అతడు నది దాటాడు ఆవతలి వడ్డు చేరే దాకా నీళ్ళు మోకళ్ళ లోతు ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా గట్లనిండుగా ప్రవహిస్తున్నది బాబా వాక్కూ భగవంతుని వాక్కే.

No comments:

Post a Comment