Tuesday, June 16, 2020

రఖుమా బాయి ఈమె హేమద్‌పాంత్ గారి భార్యా....., సాంప్రదాయ బ్రాహ్మణ మహిళ

*హేమాడ్ పంత్ గారు మన అందరికి తెలుసు వారి భార్యా  అయిన శ్రీమతి రఖుమా బాయి గారిని కూడా ఒక్క సారి చూడండి*,

 రఖుమా బాయి ఈమె హేమద్‌పాంత్ గారి భార్యా....., సాంప్రదాయ బ్రాహ్మణ మహిళ, శ్రీ సాయి సచ్చారితలో 40వ అధ్యాయంలో ఈమె హేమద్‌పాంత్ గారిచే ప్రస్తావించబడింది.  పరిచయ భాగంలో కూడా ఆమె గురించి క్లుప్తంగా ప్రస్తావన ఉంటుంది.
 ఈమెకు 5 కుమార్తెలు, ఒక కుమారుడు డాక్టర్ గజనన్ ను పిల్లలను ఈవిడి చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమతో చూసుకునేవారు.ఆమె మహారాష్ట్ర నుండి గుజరాత్ వరకు హేమద్ పంత్ తో కలిసి ప్రయాణించారు.ప్రతి సాయి భక్తుడు హేమద్‌పంత్ ఇంటిని సందర్శించమని ఒక్కసారి అయిన సందర్శించాలని భక్తలను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. నిజానికి అది ఇల్లు కాదు, ప్రతి సాయి భక్తకు ఒక గొప్ప మ్యూజియం.  హేమద్‌పంత్ యొక్క ప్రస్తుత వారసులు సందర్శకులను దయతో ఆహ్వానిస్తున్నారు. హేమద్‌పాంత్ గారికి సంబంధించిన వారు వాడినా కొన్ని వస్తువులు కళ్ళజోళ్ళు, తలపాగా (టోపీ),  శ్రీ సాయి సత్చరిత్ర  40 & 41వ అధ్యయలలో చదువుకున్న మెట్ల, శ్రీ సాయిబాబా వారి నిజమైన  అసలు ఫోటోలు మరియు, హేమాడ్ పంత్ గారు  స్వయంగా వ్రాసిన శ్రీ సాయి సత్చరిత్ర పోతి (పుస్తకం లేదా పవిత్ర గ్రంథం), అష్టవినాయకుల ఫోటోను అక్కడ మనం దర్శించ వచ్చు.

No comments:

Post a Comment