Sunday, June 7, 2020

దత్త పంచకం

శ్రీహరి ఆరవ అవతారమే దత్తత్రేయులువారని 
భాగవతము చెప్పుచున్నది .అంతేగాక దేవీ భాగవతము ,మార్కండేయ పురాణము దత్తాత్రేయులు గూర్చి వివరిస్తుంది .

దత్తాత్రేయులవారు ప్రధానముగా గురుదేవులై 
జీవులకు జ్ఞానదానం చేసి ముక్తులుగా చేయుటకు 
అవతరించారని చెబుతారు .దత్త పంచకం లో కనబడే కొన్ని పోలికలు  ,శ్రీపాద శ్రీవల్లభ ,శ్రీ నరసింహాసరస్వతి స్వామి వారు ,మాణిక్య ప్రభువులు ,అక్కల్కోట మహరాజ్ ,శ్రీ షిర్డీ సాయిబాబా ,ఈ దత్త పంచకం లో కనబడే కొన్ని 
పోలికలు .
1  తాము అవతార పురుషులమని ,దత్తావతారు 
లమని ప్రకటించుకోలేదు .
2 ఎటువంటి సంస్థలు గానీ ,నిర్వహణ ట్రస్ట్ లు 
గానీ స్థాపించలేదు .
3 సర్వసంగ పరిత్యాగులు .
4  పంచభక్ష్య పరమానములు ఆందుబాటులో 
ఉన్నా ,భిక్షాటనమే వృత్తి .
5 మధ్యవర్తులు లేరు .
6 వారసులు లేరు .
7 వారి చరిత్రలలో కనబడే దివ్యలీలలు భక్తులను 
అనుగ్రహించుటకొరకే .
8 ఎటువంటి చిల్లర మహిమలు చెయ్యలేదు .

No comments:

Post a Comment