శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి
10, 11, 12 అధ్యాయమలు
ఓంశ్రీసాయిరాం
10 వ అద్యాయము :-
1. బాబా మొదట్లో షిర్డీ వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?
జవాబు) మూడు సంవత్సరాలు.
2. మసీదు గోడ నానుకొని భక్తులకు బాబా ఏమి పంచి పెట్టేవారు?
జవాబు) ఊదీని.
3. బాబా గారు ఏ సంవత్సరం నందు జన్మించారు?
జవాబు) 1838.
4.ఇతర సాధనముల కంటే కష్టతరమైనది కాదు ఏది?
జవాబు) మహత్ముల కధలు వినుట.
5. 13 వ రోజు శ్రీ సాయి సాన్నిధ్యము చెందినది ఎవరు?
జవాబు) నానావళి.
6. బాబా కు దేని యందు అభిరుచి యుండెడిది కాదు?
జవాబు) ఇంద్రియ అనుభూతులతో.
11వ అద్యాయము :-
7 . బాబా ఏమి కొని హాజీ కి పంపెను? ఎంత సొమ్ము ఇచ్చారు?
జవాబు) కొన్ని గంపల మామిడి పండ్లు, 55 రూపాయలు.
8. డాక్టర్ పండితులు ఎవరి స్నేహితులు?
జవాబు) తాత్య సాహెబ్ నూల్కార్.
9. బాబా కు మహల్సాపతి ఒక్కసేవ మాత్రమే చేసేవారు అది ఏమిటి?
జవాబు) బాబా కంఠమునకు చందనము పూసేవారు.
10. కళ్యాణిలో నివశించే వారు ,బాబాకు ఎంత దక్షిణ యివ్వటానికి సిద్దపడెను?
జవాబు) 4లక్షలు.
11. బాబా ఒకొక్క సారి ఏ అవతారము దాల్చేవారు?
జవాబు) ఉగ్రవతారము.
12వ అద్యాయము :-
12 . మూలి శాస్త్రి ఎక్కడ నుండి ఎవరి ని కలుసు కొనుట కు షిర్డీ వచ్చెను?
జవాబు) నాసిక్ నివాసి, బూటీ ని.
13 . నిమొను గ్రామ పఠానుదారు, మేజిస్ట్రేట్ ఎవరు?
జవాబు) నానా సాహెబ్ నిమొనుకర్.
14. బావూ షిరిడీలో ఎన్ని రోజులు ఉండేవారు?
జవాబు) వారం రోజులు.
15. నిమోనుకర్ భార్యకు బాబా ఎచ్చట దర్శనము ఎవరితో కల్పించెను?
జవాబు) సాఠేవాడా ముందర నానా సాహేబ్.
16. 12వ అధ్యాయములో ఎవరికి గురు దర్శనము అయినది?
జవాబు) మూలేశాస్త్రి.

No comments:
Post a Comment