Sunday, August 16, 2020

షిరిడీలో బాబా సన్నిధికి ఇతర గురువులకు చెందిన శిష్యులు కూడా రావడము జరిగేది .సాయిబాబాను గురువుగా నమ్మని వ్యక్తులు ఇతర గురువులవద్దకు పొవడం కూడా సహజముగా జరిగేది

మతాన్ని అయినా ,దైవాన్నైనా మార్చడం సాయిబాబా అంగీకరించరు .షిరిడీలో బాబా సన్నిధికి ఇతర గురువులకు చెందిన శిష్యులు కూడా రావడము జరిగేది .సాయిబాబాను గురువుగా నమ్మని వ్యక్తులు ఇతర గురువులవద్దకు పొవడం కూడా సహజముగా జరిగేది .ఒకసారి బాబా వద్దకు ఇతర గురువుకి 
చెందిన పంత్ అను శిష్యుడు వచ్చాడు .బాబా 
అతనితో "ఎలాంటి సందర్భంలోను అయినా 
మనము నమ్మిన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు .
ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ ,అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు " అని అన్నారు .
ఒకసారి ఒకరిని గురువుగా నిర్ణయించుకున్న తరువాత ,వేరొక గురువు మహత్తు ,ప్రజ్ఞలను 
చూసి మనసు చలించకూడదు .జీవితాంతము ఒకే గురువుని అంటిపెట్టుకొవాలి .అంతేకానీ మన గురువు తక్కువ ,వేరొక గురువు ఎక్కువ అను 
ఆలోచన మన మనసులోంచి తీసివేయాలి .
ఒకసారి శ్యామా అను పేరుగల బాబా భక్తుడు 
నాగపూరు పరిసరప్రాంతాలు కు పోయి బాబా వద్దకు వచ్చాడు .బాబా శ్యామాతో " శ్యామా ! 
ఇక్కడెక్కడకు పోయివచ్చావు ? అని అడిగాడు .
" నాగపూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు " అని జవాబిచ్చాడు శ్యామా ." నాగపూరులో గల 
బంగారు మామిడి చెట్టును చూశావా ?" అని బాబా అడిగాడు .అందుకు శ్యామా బంగారు 
మామిడి చెట్టు అంటే ,నాగపూరు నందుకల 
సత్పురుషుడైన " తాజుద్దిన్ బాబా "అని అర్థం చేసుకున్నాడు ." ఇంకా మరే ప్రదేశాలు దర్శించావు ? అని బాబా శ్యామాను అడిగాడు .
అందుకు శ్యామా " బాబా ! ఖేడ్ గాన్ బెట్ వెళ్లాను 
అక్కడగల నారాయణ మహరాజ్ ను దర్శించాను 
బాబా ! అక్కడకి ఎంతమంది భక్తులు వచ్చారో" 
 అని చెప్పాడు ." నారాయణ మహరాజ్ గారి గూర్చి నీ ఉద్దేశమేమిటి ?" అని ప్రశ్నించాడు 
బాబా శ్యామాని .నారాయణ మహరాజ్ గారు 
చాలా ఆడంబరంగా ఉండేవారు .ఖరీదైన వస్త్రాలు ధరించేవారు .దీనికి భిన్నంగా సాయి దర్బారు ఉంటుంది .అడంబరం ,నిరాడంబరం 
మధ్య ఊగిసలాడే శ్యామా మనసు బాబా గ్రహించారు .
బాబా కొద్దిసేపు ఆగి " శ్యామా ! ఎంతైనా నీతండ్రే 
నీతండ్రే కదా ! నీ తండ్రిలాగా నిన్ను ఎవరు చూస్తారు ? ఒకటి వెంట పడడం ఎందుకు " ?అని 
అన్నారు సాయబాబా .మన గురువే మన తండ్రి .
ఇతరుల కోసం ఆరాటపడటం ఎందుకు ?.

No comments:

Post a Comment