Sunday, August 16, 2020

మహల్సాపతి అనే ఖండోబా మందిర పుజారి " సాయీ " అని పిలిచాడు .ఊరు పేరూ లేని ఆ యువకునికి " సాయీ " అను పేరు స్థిరమై పోయింది

షిరిడీలో గల సాయిబాబాకు ఊరు పేరూ లేదు .
అయితే ప్రప్రధముగా చాంద్ భాయి అనే ముస్లిం 
తన కుటుంబంతో పాటు వివాహ కార్యక్రమానికి 
షిర్డీ వచ్చినపుడు ,వారితోపాటు వచ్చిన ముస్లిం 
వలె వేషధారణలో ఉన్న ఒక యువకుడికి అక్కడే 
ఉన్న మహల్సాపతి అనే ఖండోబా మందిర పుజారి " సాయీ " అని పిలిచాడు .ఊరు పేరూ 
లేని ఆ యువకునికి " సాయీ " అను పేరు స్థిరమై 
పోయింది .అయితే ఆ నామం  సాయి వయసు పెరిగిన తరువాత అయనను "సాయబాబా " అను పిలువసాగారు .బాబా షిరిడీకి వచ్చిన గోవింద్ రఘునాద్ ధబోల్కర్ అను ప్రభుత్వ ఉద్యోగికి " హేమాడ్ పంత్ " అని పిలిచాడు .
అంతే ఆయన పేరు హేమడ్ పంత్ అని పిలవసాగారు .హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర 
మరాఠి గ్రంథాన్ని రచించి భక్తుల మదిలో నిలిచిపోయాడు .ఆలాగే మాధవరావ్ దేశపాండే 
అను భక్తుడిని " శ్యామా " అని బాబా పిలువసాగాడు .బ్రిటీషు వారి పాలనలో హైదరాబాద్ లో ఉన్నత పదవిలో నున్న మంత్రి 
ప్రగడ లక్శ్మి నరసింహరావు గారు షిర్డి వెళ్ళి బాబాను దర్శించుకునేవాడు .ఆయన ఒకసారి షిర్డీ వెళ్ళి బాబాను దర్శించి " బాబా ! మూడు తరాలుగా మా వంశంలో ఆడపిల్లలు లేరు .కనుక 
మాయందు దయ ఉంచి మాకొక ఆడపిల్లను సంతానంగా మాకు ప్రసాదించు " అని ప్రార్దించాడు 
ఆదివిన్న బాబా " ఆలాగే అవుతుంది ఫో ! " అని ఆన్నారు .బాబా ఆశీర్వాద phalitamga ఒక ఆడపిల్ల జన్మిమిచ్చింది .మరల ఆయన షిర్డీ వెళ్ళి 
బాబాను దర్శించి " బాబా ! ఆ శిశువుకు ఏమి పేరు పెట్టమంటారు ? " అని అడుగగా " శృంగేరి 
శారదా దేవి " అని పేరు పెట్టు " అని బాబా సెలవిచ్చాడు .ఆలాగే ఆ బిడ్డకీ  " శారదాదేవి " 
అని పేరుపెట్టారు .ఆ పిదప మంత్రి ప్రగడ శారదాదేవి ,వివాహ అనంతరం గాలి శారదా దేవీ 
అయినది .తరువాత ఆమె అనేక సార్లు షిర్డి వెళ్ళి 
బాబాను దర్శించుకునేది .
గులాబ్ - ఇమాం భాయి చోటే ఖాన్ బాబా భక్తుడయినాడు .అతడు ఒకసారి షిర్డి వెళ్ళి బాబా 
ను దర్శించాడు .బాబా అతనితో " గులాబ్ " మీ ఇంటికి వచ్చాడు "తరువాత అతను ఇంటికి వెళ్లగా గర్బవతి అయిన 
తన భార్యా ప్రసవించిందని ,మగ శిశువు ప్రసవించిందని తెలిసింది .ఆ బిడ్డకు సాయబాబా 
చెపినట్లు " గులాబ్ " అని పేరు పెట్టాడు .

No comments:

Post a Comment