Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 16,17,18 వ అద్యాయములు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

16,17,18 వ అద్యాయములు


1. బాబా ఎన్ని ఇండ్ల లో భిక్ష అడిగేవారు?

జవాబు) 4,5 ఇళ్లు.


2. సాధువులు, యొగులు చాలా తక్కువ మంది ఉన్నారు, వారిలో బాబా ఎన్నన వారు?

జవాబు) ప్రధమ గణ్యులు.


3. బాబా మొదటగా 5 రూపాయలు తెమ్మని ఎవరి వద్ద కు పంపెను?

జవాబు) నందు రామ్ మార్వాడీ.


4. ధనికుడు మసీదు కు వెళ్ల గానే బాబా ను చూసి ఏమి చేసెను? 

జవాబు) పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను.


5. బాబా ఏ స్వరూపులు?

జవాబు) పూర్ణ సచ్చిదానంద స్వరూపులు.


18వ అద్యాయము


6. నిచ్చెన దిగి వచ్చిన వానికి బాబా ఏమి ఇచ్చెను?

జవాబు) రెండు రూపాయలు.


7. హేమాది పంత్ దీక్షిత్ వాడా నుండి బుటీ వాడా దాటుచుండగా ఒక పాట వినిపించెను? దానిని రచించిన వారు ఏవరు?

జవాబు) ఏక్ నాథ్ మహారాజ.


8. హారతి పూర్తి కాగానే భక్తులు ఎమని జయ జయ ద్వానాలు చేసేను?

జవాబు) శ్రీ సచ్చిదానంద సమర్ద సాయి నాధ్ మహరాజ్ కి జై.


9. బాబా కుడి వైపున ఎవరు ఉన్నారు?

జవాబు) శ్యామ.


10. శ్యామా ఇంటి ముందు కిటికీ లో ఏమి ఉన్నది?

జవాబు) ఏకనాధ భాగవతము.


11. బాబా శ్యామ ను ఎంత దక్షిణ అడిగెను?

జవాబు) 15 రూపాయలు.


12. సాఠే ఏ గ్రంథము పారాయణం చేసెను? జవాబు) గురు చరిత్ర.


13. హేమాది పంత్ ఎన్ని సంవత్సరాల నుండి పారాయణం చేసెను?

జవాబు) 40 సంవత్సరాల నుండి.


14. సాఠే ఏ సంవత్సరంములో షిరిడి కి వచ్చెను?

జవాబు) 1917.


18వ అధ్యాయం


15. సాఠే గురించి ఈ అధ్యాయములో కాక ముందర ఏ అధ్యాయములో వచ్చినది?

జవాబు) 14 వ అధ్యాయములో


16. రాధాబాయి ఎవరికి తల్లిగారు?

జవాబు) ఖాశాబా దేశ్ ముఖ్ గారి తల్లి.

No comments:

Post a Comment