Friday, August 28, 2020

షిరిడీలో ఎవరో ఒక బ్రాహ్మణుడు ఫకీరుగా ఉన్నాడని తెలిసి ,భగవద్గీతను వెంట తీసుకుని బాబా దర్శనం కోసం వెళ్లాడు


  నాసిక్ పట్టణ నివాసి అయిన గొపాల్ హోరా అనే 

కృష్ణ భక్తుడు ఏ విధముగా నైనా సరే ,ఈ జన్మలోనే శ్రీ కృష్ణ దర్శనం పొందాలనే తపనతో ,

తన గురువు వద్ద మంత్రోపదేశం పొందాడు .

భక్తి శ్రద్దలతో 26 ఏళ్లు సాధన చేశాడు .కృష్ణ దర్శనం లభించలేదు .ఎక్కడికి వెళ్లినా భగవద్గీతను వెంట తీసుకుని పోయేవాడు .

షిరిడీలో ఎవరో ఒక బ్రాహ్మణుడు ఫకీరుగా ఉన్నాడని తెలిసి ,భగవద్గీతను వెంట తీసుకుని 

బాబా దర్శనం కోసం వెళ్లాడు .సాయబాబా ను 

చూసి ఆగిపోయాడు .సాయి మహమ్మదీయుడా? 

బాబా వద్దకు భగవద్గీతను తీసుకుపోతే ,ఆ గ్రంథం 

అపవిత్రమవుతుందేమోనని అనుమానపడ్డాడు .

బాబా అతనితో " నీవు మైలు పడవచ్చును గానీ,

గీతా గ్రంథం మాత్రం అపవిత్రం కాదు .నీవు తలచినది పొరపాటు " అని అన్నారు .ఇంకా బాబా "నీవు భగవద్గీతను పఠించగలవా ?"

అని ప్రశ్నించారు అతన్ని .

" నేను 26 సంవత్సరాలనుండి పఠిస్తున్నాను .అది 

కంఠస్థమైనది కూడా ." అని హోరా చెప్పాడు .

బాబా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మధ్య నుండి 

చదవమంటే ,అతడు చదవలేకపోయాడు .

" విచారించకు ! నీకు చదవగలిగే శక్తిని యిస్తాను .

చదువు " అని అన్నాడు బాబా ." నీవు బాలకృష్ణుని దర్శనమే కావాలనుకొంటున్నావు ,

నీకు పెద్ద కృష్ణుని దర్శనమే లభిస్తుంది .చూడు ."

అన్నారు బాబా .అనుకోకుండా ఆశ్చర్యంగా ,

సాయబాబా నుండి మృదుమధుర వేణుగానం 

వినబడినది .సాయినాధునికి బదులు సాక్షాత్ 

శ్రీకృష్ణుడే దర్శనమిచ్చాడు .గొపాల్ హోరా తన్మయుడై సాయి పాదాలపై వాలిపోయాడు 

" నేను మీవద్దనే ఉండిపోతాను " అన్నాడు హోరా 

" ఇంటికి వెళ్లి తామరాకు పై నీటిబొట్టులా ఉండి 

శ్రీకృష్ణ ధ్యానంలో నిమగ్నడవు కమ్ము " అని బాబా 

అశీర్వదించి పంపించివేశారు .

No comments:

Post a Comment