నాసిక్ పట్టణ నివాసి అయిన గొపాల్ హోరా అనే
కృష్ణ భక్తుడు ఏ విధముగా నైనా సరే ,ఈ జన్మలోనే శ్రీ కృష్ణ దర్శనం పొందాలనే తపనతో ,
తన గురువు వద్ద మంత్రోపదేశం పొందాడు .
భక్తి శ్రద్దలతో 26 ఏళ్లు సాధన చేశాడు .కృష్ణ దర్శనం లభించలేదు .ఎక్కడికి వెళ్లినా భగవద్గీతను వెంట తీసుకుని పోయేవాడు .
షిరిడీలో ఎవరో ఒక బ్రాహ్మణుడు ఫకీరుగా ఉన్నాడని తెలిసి ,భగవద్గీతను వెంట తీసుకుని
బాబా దర్శనం కోసం వెళ్లాడు .సాయబాబా ను
చూసి ఆగిపోయాడు .సాయి మహమ్మదీయుడా?
బాబా వద్దకు భగవద్గీతను తీసుకుపోతే ,ఆ గ్రంథం
అపవిత్రమవుతుందేమోనని అనుమానపడ్డాడు .
బాబా అతనితో " నీవు మైలు పడవచ్చును గానీ,
గీతా గ్రంథం మాత్రం అపవిత్రం కాదు .నీవు తలచినది పొరపాటు " అని అన్నారు .ఇంకా బాబా "నీవు భగవద్గీతను పఠించగలవా ?"
అని ప్రశ్నించారు అతన్ని .
" నేను 26 సంవత్సరాలనుండి పఠిస్తున్నాను .అది
కంఠస్థమైనది కూడా ." అని హోరా చెప్పాడు .
బాబా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మధ్య నుండి
చదవమంటే ,అతడు చదవలేకపోయాడు .
" విచారించకు ! నీకు చదవగలిగే శక్తిని యిస్తాను .
చదువు " అని అన్నాడు బాబా ." నీవు బాలకృష్ణుని దర్శనమే కావాలనుకొంటున్నావు ,
నీకు పెద్ద కృష్ణుని దర్శనమే లభిస్తుంది .చూడు ."
అన్నారు బాబా .అనుకోకుండా ఆశ్చర్యంగా ,
సాయబాబా నుండి మృదుమధుర వేణుగానం
వినబడినది .సాయినాధునికి బదులు సాక్షాత్
శ్రీకృష్ణుడే దర్శనమిచ్చాడు .గొపాల్ హోరా తన్మయుడై సాయి పాదాలపై వాలిపోయాడు
" నేను మీవద్దనే ఉండిపోతాను " అన్నాడు హోరా
" ఇంటికి వెళ్లి తామరాకు పై నీటిబొట్టులా ఉండి
శ్రీకృష్ణ ధ్యానంలో నిమగ్నడవు కమ్ము " అని బాబా
అశీర్వదించి పంపించివేశారు .

No comments:
Post a Comment