Sunday, August 9, 2020

మనం దేనినైనా సాయబాబా కు, తినుటకు ముందు సమర్పించిన ఎడల అది నైవేద్యంగా మారుతుంది .బాబా స్వీకరించగా మిగిలినది ప్రసాదమవుతుంది .

 మనం దేనినైనా సాయబాబా కు, తినుటకు ముందు సమర్పించిన ఎడల అది నైవేద్యంగా 

మారుతుంది .బాబా స్వీకరించగా మిగిలినది 

ప్రసాదమవుతుంది .   

                                మామూలుగా ఇతర పదార్ధాలకంటే ఎంతో పవిత్రత ,శక్తి గలిగి ఉంటాయి .ఈ సందర్బంగా సాయిబాబా కు అంకిత భక్తులైన శ్రీ స్వామీ కేశవయ్యజీ తన అనుభవాన్ని ఇలా తెలిపారు .ఒక రోజు మా ఇంట్లో మ డి లేకుండా ,ఓళిగలు తయారుచేసి 

బాబా కు సమర్పించకుండా మేమందరం తినడం జరిగింది .ఆ రాత్రి బాబా స్వప్నములో కనిపించి 

" నాకు మీరు ఓళిగలు సమర్పించకుండా ,మీరు 

అందరూ తిన్నారు ." అని జ్ఞాపకం చేశారు .

మహా అపరాధం చేశాను .మన్నించమని 

ప్రార్థన చేశాను .ఇక్కడ సాయబాబా తనకు 

ప్రత్యేకముగా ఒక విధానములో పూజ చేసి తనకు 

సమర్పించమని చెప్పలేదు .బాబా కు పూజా తంతుతో పనిలేదు .ఏదైనా పదార్థం తినే ముందు 

సమర్పణ చేసి న ,చాలును .ఇక ఆ పదార్థం 

మ డి తో చేసారా ,లేదా బయట కొని సమర్పించిరా అని బాబా అడగలేదు .తినుటకు 

ముందు సమర్పించిన చాలును .ఈ విషయము 

సాయి సచ్చరిత్ర రచయిత అయిన హేమడ్ పంత్ 

తనకు జరిగి న అనుభవాన్ని ,ఆ గ్రంథంలో తెలిపాడు .బజారులొ కొనిన శనగలు నాకు 

ఏల సమర్పించలేదు అని హేమడ్ పంత్ ను 

అడిగారు .మనం కూడా ఏదైనా పదార్థం  

సాయబాబా కు సమర్పించి తీసుకొందామా !

No comments:

Post a Comment