విశేషాలగూర్చి సాయిభక్తులందరూ తప్పక తెలుసుకోవాలిసినవి .ఈ మందిరములో
సాయబాబా శరీరభాగంలో ఒక భాగమైన దంతంలో ఒక పన్ను ,ఇక్కడ బాబా మందిర విగ్రహము ముందు గల పాదుకలు క్రింద భద్రపరిచారు .ది 12 -7 - 1961 నాడు, దగ్గరలో
గల పన్నెర్ డాము కృంగి ,దానిలోని నీరు బయటకి
ప్రవహించి పూణే నగరాన్ని ముంచివేసింది .
అక్కడగల ఎన్నో గృహాలు నీటి ఉధృతికి కూలిపోయి ఆపార నష్టం సంభవించింది .సాయి
మందిరం ఉన్న శివాజినగర్ లోతట్టు ప్రాంతమైనందున మందిరం పుర్తిగా మునిగిపోయి
మందిర గోపురం పైన 25 అడుగుల ఎత్తున నీరు
నిలచింది .నీరు తగ్గుముఖం పట్టిన తరువాత
పునరుద్ధణ కార్యక్రమాలు మొదలైనాయి .సాయి
మందిరం పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది .
ఆ మట్టిని పూర్తిగా తొలగించి ,మందిరాన్ని పూర్వ
స్ధితికి తెచ్చే కార్యక్రమం అతి వ్యయప్రయాసలతో
కూడినది .అయినా స్థానిక సాయిభక్తులు ,
మందిర కమిటీ సభ్యులు ,నాలుగు అయిదు రోజులు కష్టపడి పనిపూర్తి చేశారు .అప్పుడు
వారికి కనిపించిన దృశ్యం అద్భుతం .నిత్య
పూజలందుకొంటున్న బాబా రంగుల చిత్రపటం
చెక్కుచెదరక పూర్వపువలె జీవకళ ఉట్టిపడుతూ
కనిపించింది .ఆ పటం ఎన్నొ రోజులు నీటిలో
మునిగిఉన్నదంటే ఎవ్వరూ నమ్మరు .ఆ ప్రక్కనే
ఉన్న ఔదంబర వృక్షం కూడా కళకళలాడుతూ
కనిపించింది .ఈ అద్భుత లీలతో బాబా సంపూర్ణ
అనుగ్రహం ఈ మందిరం పై ఉన్నదని అందరూ
విశ్వసించారు .తరువాత కమిటీ సభ్యులు సంకల్ప సహకారములతో అందమైన బాబా
పాలరాయి విగ్రహాన్ని తయారు చేయించి
మందిరమునందు ప్రతిష్టించారు .వరదకు తట్టుకొన్న బాబా రంగుల పటం కూడా నేటికీ
నిత్యపూజలు అందుకొంటున్నది .


No comments:
Post a Comment