Friday, August 28, 2020

సాయబాబా తన మోమును మృదుమధుర మందహాసాలొలికిస్తూ చూపారు .అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటం కోసం ఈ షిరిడీలో ఎన్ని సంవత్సరాలయినా పడి ఉండవచ్చు .



సాయబాబా మహాసమాధి చెందకపూర్వము 

అయనను ప్రత్యక్షంగా సేవించిన ఎందరెందరో 

ఆయన అందాలను ,ఆయన చేష్టలలోని సౌందర్యాన్ని వర్ణించారు .గణేశ శ్రీకృష్ణ కపర్డే 

"సాయబాబా తన మోమును మృదుమధుర 

మందహాసాలొలికిస్తూ చూపారు .అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటం కోసం 

ఈ షిరిడీలో ఎన్ని సంవత్సరాలయినా పడి ఉండవచ్చు .నేను పారవశ్యంతో పిచ్చివాడిలా 

ఆలాగే చూస్తూ ఉండిపొయాను " అని రాశారు .

మోరేశ్వర వామన్ ప్రధాన్ " సాయి మహరాజ్ 

ముఖం ,కాళ్ళు కడుగుకొనే విధానము చూసి 

తీరాల్సిందే తప్ప మాటలలో వివరించలేను .

అదొక అందమైన దృశ్యం .ఆ చేష్టలు చాలా 

దివ్యంగా ఉండేవి .ఆయన స్నానం చేసే విధానము కూడా అంతే  " అని వర్ణించారు .

సాయబాబా మహ సమాధి చెందడంతో సాయబాబా సౌందర్య లహరులు అదృశ్యమయ్యాయి .సాయబాబా మహా సమాధి 

అనంతరం ,చావడిలో గుప్తరూపంలొ ,మశీదు లో 

బ్రహ్మ రూపంలో ,సమాధి మందిరములో సమాధి 

అవస్థలో ,సర్వత్రా పరమాత్మ స్వరూపంలో ఉంటారని సాయిసచ్చరిత్ర గ్రంథాన్ని రచించిన 

హేమాడ్ పంత్ తన గ్రంథంలో తెలిపాడు .

No comments:

Post a Comment