Sunday, December 6, 2020

దత్తాత్రేయ షోడశ అవతారాలు... 13::: శివరూపుడు లేక శివదత్త

 దత్త లీలా క్షేత్ర మహత్యం....🙏🏻

దత్తాత్రేయ షోడశ అవతారాలు...

13::: శివరూపుడు లేక శివదత్త


పింగళ నాధుడు అనే బ్రాహ్మణుడు శ్రీ విష్ణువు యొక్క సుదర్శన చక్రంలో అధిష్టించిన ఉన్న మహుర్ నగరంలో ఉండేవారు. పెద్ద వేద పండితులు. సదాచార సంప్రదాయ కర్మిష్ఠి బ్రాహ్మణుడు. ఈ మహుర్ క్షేత్ర పరిసరాల్లో నడుస్తూ ఒకసారి  ఉసిరిగ చెట్టు దగ్గరకు వస్తారు. ఈ చెట్టు నల్ల ఉసిరిగ చెట్టు. పింగళనాధుడు అక్కడ తేజోమయ రూపంతో, యవ్వనంలో ఉన్న ఒక యువకుని చూస్తారు. ఆ యువకుడు సంస్కార హీనంగా నల్ల గుడ్డ నెత్తినవేసుకొని జుట్టు జడలు వేసుకొని, మెడలో రుద్రాక్ష ధరించి, బ్రహ్మ తేజస్సుతో నోటితో వేదం చదువుతూ  ఉంటాడు. కానీ పిగాళనాగునికిఎవరు ఇతను?చూడడానికి అమంగళకారుడు లాగా వున్నాడు?దిగంబరంగా వున్నాడు,అని ఎవరు నీవు?వేదం పఠిస్తున్నావు?బ్రహ్మచారివి కూడా కాదు, నీ దగ్గర కౌపినం,దండం, జింక చర్మం కూడా లేదు,నడుముకు మొలతాడు కూడా లేదు,అగ్నిహోత్రం కూడా వేయలేదు, ఎవరు నువ్వు?ఏ ఆశ్రమం నీది అని అడిగాడు. దత్తాత్రేయ స్వామి ఇలా తెలిపేరు,నాకు బ్రహ్మచర్య,గృహస్థు, వామప్రస్థ,సన్యాస ఆశ్రమాలు లేవు. నా ఆశ్రమం భిన్నంగా ఉంటుంది. నాకు అందరిపట్ల ఎలాంటి వివక్ష లేకుండా, బేధభావం లేకుండా, నిస్వార్ధంగా ప్రవర్తిస్తాను. నా ఆశ్రమం పేరు "పంచమాశ్రమి"అత్యాశ్రమి అని అంటారు. ఈ ఆశ్రమం మీకు తెలియదు.ఎక్కడ విని ఉండవు. కేవలం ఆత్మ సాక్షత్కారం అయినవారు మాత్రమే గుర్తు పట్టగలరు.

నువ్వు అంతర్ ముఖుడై ,నిరంతరం ధ్యానం చేయి. కేవలం వర్ణాశ్రమాలకు ప్రాముఖ్యం ఇవ్వక,వివేక, వైరాగ్యం లతో మనస్సు శుద్ధి చేసుకొని విషయవాసనాలు జయించు. అప్పుడు మనస్సుకు శాంతి,మరియు తృప్తి కలుగుతుంది ,అంతర్ ముఖుడై ఎప్పుడూ నీలో ఉన్న  ఆత్మ స్వరూపాన్ని గురించి చింతన చేయి అని బోధించారు.

సుందరము, శుభమూ అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది శ్రావణమాసం పూర్వార్థంలోని అష్టమి, సోమవారం, రోజు అవతరించారు. ఈ మాటలు అతనికి చెవిలో నించి హృదయం లోకి ప్రవేశించగానే ఒక కాంతి ప్రవేశించింది.

ఆహా!సతి అనసూయ గర్భంలో జన్మించిన, అవధూతలకే చూడామణి అయిన వీరు సాక్షాత్ దత్తాత్రేయ స్వామియే. మూర్తీభవించిన బ్రహ్మతేజస్సులే వీరు, ఆహా!ఈ రోజు స్వామి నన్ను అనుగ్రహించారు. స్వామి దృష్టిలో నేను పడ్డాను, ఆశీర్వదించబడ్డాను. అని స్వామి కి నమస్కారం చేసుకొని క్షమాపణ వేడుకున్నాడు.

 శ్లో ॥ శుక్లాష్టమ్యాం శ్రావణస్య విశేషార్దీ దిదువాసరే I

 శివరూపధరణం దృష్టవా దత్తాత్రేయ మహమునిం II

 శ్రావణ శుద్ధ అష్టమి రోజు, సోమవారం, శ్రీదత్తాత్రేయుడు శివుని రూపాన్ని తీసుకొని పింగల్నాగుడుకు దర్శనం ఇచ్చారు. దత్తాత్రేయుడికి నమస్కరించి, కృతార్థుడైన  పింగల నాగ తన ఆశ్రమానికి వెళ్ళాడు.

శ్లో ॥  సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే |

దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే॥

No comments:

Post a Comment