సాయబాబా మాటలు ,చేష్టలు ,గాధలు ఒకొక్కసారి అర్థం కావు .సాయి తత్వాన్ని గ్రహించినవారే వాటికి అర్ధాలను కొంతవరకు చెప్పగలరు .సాయిబాబా ఒకసారి ఒక గాధను
తెలిపారు ."ఒక తోటమాలికి ఒక కొడుకుండేవాడు వాడు రాజుగారి తోటకు వచ్చి అక్కడే ఉండిపోయాడు .12 సంవత్సరాలు తరువాత
తన తల్లితండ్రులవద్దకు వెళ్తానని ,చెప్పగా రాజు
అతనికి ఒక భవనము ఇచ్చి ,తనకూతురినిచ్చి
వివాహం చేశాడు .చాలాకాలము అయినా సంతానం కలగలేదు .అతను తన తల్లితండ్రులవద్దకు వెళ్లిపోయాడు .రాజు అతనికి
కొంత ధనము ఇచ్చి పంపాడు .బాబా ఈ గాధను
కాకాసాబ్ దీక్షిత్ కు చెప్పాడు .దానితోపాటు దాని
అంతరార్ధము గ్రహించాడు .ఒకసారి సాయబాబా ఫోటో తీయడానికి ఒక యువత బృందం వచ్చింది
బాబా శ్యామాతో " ఫొటొ తీయనవసరం లేదని
అడ్డు గొడ పడితే చాలు " అని అన్నారు .బాబా మాటలకు కాకాసాబ్ ఇలా విశ్లేషించారు .ఆ యువకులు ఫోటో తీయాలనుకొన్నది తన మూడున్నర మూరల దేహానాన్ని ,నిజానికి అది తన అసలు రూపం కాదనీ ,తాను వేరు ,జగత్తు
వేరని ద్వైత భావమనే అడ్డుగోడ వల్ల కలిగిన
అజ్ఞానము వల్లనే ,భౌతిక దేహమే తాము అన్న
భ్రాంతి కలుగుతున్నదని ,అజ్ఞానమనే అడ్డుగోడను
పడగొడితే తన నిజ స్వరూపము అర్ధమవుతుంది
అని ,ఈ మాటలు వల్ల శ్రీ సాయిమహరాజ్ చెప్పారు .ఆ ఆదేశంలోని అంతరార్ధాన్ని గ్రహించి
భక్తులు అజ్ఞానమనే అడ్డుగోడను పడగొట్టి బాబా
సత్య రుపాన్ని దర్శించాలి .
No comments:
Post a Comment