Sunday, December 6, 2020

దత్తాత్రేయ షోడశ అవతారాలలో ప్రధమ అవతారం 1) యోగిరాజు.

 శ్రీ దత్తాత్రేయ షోడశావతారములు.🌹


కలియుగం ముందు గల దత్తాత్రేయ అవతారాలు మొత్తం 16 గా శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి దత్త పురాణంలో వర్ణించి వున్నారు. ఆ అవతార కార్యం వెనుక రహస్యాన్ని , తెలుగులో స్వామి వారి సంస్కృత శ్లోకాల నుంచి అనువాదం చేయడం జరిగింది.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.

దత్తాత్రేయ షోడశ అవతారాలలో ప్రధమ అవతారం

1) యోగిరాజు...🙏🏻

అద్వయ ఆనంద  రూపాయ యోగమాయా ధర్మాయ |

యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమోనమః ॥


ఒక కార్తీక శుద్ధ  పౌర్ణమి బుధవారం నాడు, కృతికా నక్షత్రంలో శ్రీ యోగిరాజు అవతారం దాల్చారు.

బ్రహ్మ దేవుని అనుగ్రహించడానికి పరమేశ్వరుడు మరియు విష్ణు స్వరూపుడై, యోగిరాజుగా అవతరించారు.

మానవ సృష్టి మొదలైన తరువాత జీవులు అనేక విధములు అయిన దుఃఖములు,జనన,మరణ రూప అవిచ్ఛిన్నము లైన జన్మ పరంపర నుంచి, ప్రారబ్ధ కర్మల నుంచి, సంసారాలలో వివిధ కష్టముల నుంచి,జీవులను పుణ్య ,పాపముల నుంచి తరిపజేయడానికి మార్గం ఏది?

ఇలా విచారిస్తున్న బ్రహ్మ దేవుడు సర్వ విశ్వమునకు ఆధారుడైన శ్రీ హరిని వేడుకున్నాడు.


 శ్లో::ఏవంనిష్మాయాత్మభూవో నియోగo సాడగం! నిజోపాసన్ముక్తావన్ స: 

 త్వం సాత్వికం మమకమేవ భావజ్ఞ

ధా మతి తరా ముపాస్య!

బ్రహ్మ దేముడు ప్రార్ధన మేరకు 

శ్రీహరి  తేజోమండలవర్తి అయిన,  మంగళమయ రూపమైన  జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చి తను ఎవరిపట్ల ప్రసన్నులో తెలిపి బ్రహ్మకు యోగ మార్గం  తెలిపారు.

లోక కల్యాణం కొరకు నీవు భక్తితో ప్రార్ధించావు. అందుకే నేను త్వరగా ప్రసన్నుడనైనాను.ఈ రూపం నిర్గుణ, నిరాకార అత్యంత తేజోమయ రూపం. ధ్యానం చేసే వారికి మాత్రమే అవగతం అవుతుంది.

నేను  సాత్విక గుణముకు త్వరగా  ప్రీతి చెందుతాను. నా తేజోమయ స్వరూపమును ఉపాసన చేయడం ద్వారా లోకంలో వచ్చే సుఖ, దుఃఖాలు, మృత్యువు నుంచి విముక్తులు అవుతారు అని  యోగ తత్వం తెలిపారు.

ఈ తత్వ బోధ విన్న బ్రహ్మ, 'దత్తోహం, దత్తోహం', అని నమస్కారం చేసి, జీవుల జీవిత కార్యమును,సృష్టిని సుఖమయం చేశారు.

ఈ అవతారంలో గంధ, పుష్ప , బ్రహ్మోపచారాలు అవసరం లేదు. కేవలం సచ్చిదానంద జ్యోతిర్మయ దత్తుని చింతన చేస్తే చాలు తరించవచ్చు.

బ్రహ్మ దేముడు సప్త ఋషులను సృష్టించారు. తర్వాత  అత్రి, కర్ధమముని కుమార్తె అయిన అనసూయ మాతలకు బ్రహ్మ,విష్ణు,శంకరల మూడు  రూపాలు, 3 గుణాలు జ్యోతిర్మయ దత్త రూపంలో నిక్షిప్తం చేసి, త్రయాత్మ అని,పరమాత్మ అని పిలిచారు.

అలా బ్రహ్మకు యోగం బోధించి "యోగిరాజు",గా అవతరించారు అని శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి దత్త పురాణం లో సంస్కృత శ్లోకాలలో వివరించారు.

తేజోమయ యోగిరాజు రూపం ఎలా ఉంటుంది: అంటే అత్యంత కోమలము, నయన మనోహరంగా, స్పష్ట మైన, ప్రకాశవంతం అయిన స్పటికం లాంటి స్వచ్ఛత కలిగి, ఏకముఖి, నాలుగు చేతులుతో చూడడానికి శ్రీ విష్ణువుమాదిరిగా  వుంటారు. ఈ రూపం నిరాకారమైనది మరియు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.  అందువల్ల, బ్రహ్మ ప్రార్థనల నుండి, జ్ఞానోదయం పొందిన విష్ణువు అతని తపస్సుతో సంతోషించి, మంగళమయ రూపంలో అవతరించాడు. యోగిరాజ్ పేరుతో దత్తాత్రేయుడు యొక్క మొదటి అవతారం ఇది.  శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృత శ్లోకాలలో వెల్లడించారు. ప్రకాశవంతంగా వుండే  యోగిరాజ్ రూపం చాలా మృదువైనది మరియు మనోహరమైనది మరియు అవయవాలు స్వచ్ఛమైన స్ఫటికాల వలె శుభ్రంగా ఉంటాయి. ఈ అవతారం అసలు విష్ణువు మాదిరిగానే ఏకపక్ష మరియు చతురస్రాకారంగా ఉంటుంది.  నిరాకారంగా ఉన్నప్పటికీ, దత్తాత్రేయుడు  రూపం తీసుకుని   ఉనికిలోకి వచ్చాడు.  అతను యోగా బోధించడం ద్వారా ప్రజలను సంతోషపెట్టాడు.  అందువల్ల అతనికి యోగేశ్వర్ లేదా యోగిరాజ్ అనే పేరు వచ్చింది

No comments:

Post a Comment