సద్గురు అన్వేషణలో శ్రీ బి .వి .నరసింహస్వామి
గారు పర్యటిస్తున్నారు .ఆ పర్యటనలో భాగంగా
పండరిపురం చేరుకున్నారు .అక్కడివారు బాపుమాయిని దర్శనం చెసుకోమన్నారు .
బాపుమాయి ఒక విశిష్ట యోగిని .శరీరంపై ఒక తుండుగుడ్డను మాత్రమే ధరించేదీ .భక్తులను ఒక పైసా భిక్ష ఇమ్మని అడిగేది .తరువాత అక్కడగల
చంద్రభాగానది వద్దకి వెళ్లి " అమ్మా ! చంద్రభాగా !
ఈ డబ్బునంతా జగ్రత్తగా దాచు " అని చెప్పి భక్తులిచ్చిన డబ్బులను నదిలో విసిరేది .ఒకరోజు
శ్రీ బి .వి .నరసింహస్వామి గారు బాపుమాయిని
పండరిపురంలో చూశారు .అమె వెంట వెళ్ళసాగాడు .అమె అయనను చూసి " ఎవరు నీవు ?అని ప్రశ్నించింది ." నేనొక యాత్రికుడను "
అన్నారు స్వామీజీ ." నాకు ఇల్లు లేదు .నా నివాసం స్మశానం ." అని చెప్పి శ్మశానం వైపు దారితీసింది అమె ."నాకు శ్మశానం అంటే భయం
లేదు .అక్కడికి పోకూడదని నియమం లేదు " అని
ఆమె వెనుకనే పోసాగాడు .ఆమె స్మశానానికి చేరింది .స్వామీ వంక చూసి " నీకు ఆకలిగా ఉందా
అని అడిగింది .నిజంగానే స్వామి ఆకలితో ఉన్నాడు .ఆమెతో " అవును " అన్నాడు .ఇంతలో
ఒక పెద్ద హోటల్ లో పనిచేసే వ్యక్తి తన దుస్తులలో
భోజనపదార్దాల ప్లేటుతో వచ్చాడు .ఆ ప్లేటులో
అన్నం ,రొట్టెలు ,పప్పు ,స్వీట్లు ఉన్నాయి .
బాపుమాయి అయనను భోంచెయ్యమన్నది .
అతను ఆ భొజనం చెసేసాడు .చాలా తృప్తి గలిగింది .ఆ హొటల్ వ్యక్తి ఖాళీ ప్లేటుతో వెళ్లిపోయాడు .అప్పుడు బాపుమాయి "నీకు ఏమి
కావాలి ?" అని అడిగింది .అందుకు ఆయన "నాకు దేవుడిని చూడాలని ఉంది " అని అన్నాడు
ఆమె పకపకా నవ్వి " పిచ్చివాడా ! నీవొక మొద్దువు .ఆ పాండురంగడే నీకు భొజనం పట్టుకొచ్చాడు .నర సంచారం లేని ఈ ప్రదేశంలో
అయన గాక ఇంకెవరు భొజనం తెస్తారు ?అన్నది
బాపుమాయి .నరసింహస్వామి దిగ్ర్భాంతి చెందాడు ."సర్వానంతర్యామి అయిన సర్వేశ్వరుని దర్శించే అర్హత నీకు ఇంకా రాలేదు .
ఉత్తరదిశలో నీ గురువు నీకోసం ఎదురుచూస్తున్నారు.వెళ్ళి సేవించుకో అన్నారు.
🌻🌹ఓం శ్రీ సాయిరాం ! జై గురుదేవ దత్త

No comments:
Post a Comment