Sunday, December 6, 2020

షోడశ దత్త అవతారాలు.... 16:: శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం..🙏🏻

షోడశ దత్త అవతారాలు....

16:: శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు 


అవధూత,అది గురువు, శ్రీ దత్తాత్రేయ, దిగంబరుడు, యోగిరాజు, అత్రివరదుడు, సిద్ధరాజు ఇలాంటి అనేక అవతారాలు భూమిపై  ఎత్తి జ్ఞాన, వైరాగ్య, సేవ,స్నేహ భక్తి, అష్టాంగ యోగ, లాంటి అనేక మోక్ష మార్గాలు బోధించి,సర్వ సాధనలు తన భక్తులకు బోధించి కృతార్థులను చేశారు. అందరినీ ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. తరువాత స్వామి కార్య సిద్ధుడై జ్ఞాన మార్గంలో యోగనిద్రని స్వీకరించి విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు స్వామి భక్తులు, శిష్యులు, స్వామి దర్శనమునకు వచ్చిన వారికి  శ్రీ కృష్ణ శ్యామకమలనయనుడు అవతారంలో దర్శనం ఇచ్చారు.

శ్లో ॥ కార్తీకే శుద్దపక్షే తూ ద్వాదశ్యాం బుధవాసరే!

రేవత్యాం భాస్వాదుద్యవేలాయం జగదాశ్రయ!!

కార్తీక శుద్ధ ద్వాదశి రోజు, రేవతి నక్షత్రంలో బుధవారం సూర్యోదయానికి అవతరించారు. స్వామి దర్శనంతో అందరూ ఆనందంతో జయ జయ కారాలు చేశారు. పూలవర్షం కురిపించారు.

దత్తాత్రేయ రూపం ఇంద్రనీల మణి లాగా అత్యంత తేజస్సుతో వెలిగింది.

ఈ రూపమును ధ్యానించి వారికి కళ్యాణకరం అవుతుంది. మనోరధాలు నెరవేరుతాయి. సర్వదేవతలు ఈ రూపంలో ఉంటారు కాబట్టి వారు అందరూ సంతుష్టులు అవుతారు.

స్వామి ధర్మతత్వంతో అందరికి మార్గదర్శనం చేశారు. ఎలా చింతన చేస్తే అలా పలుకుతారు. ప్రేమ,భక్తికి లొంగుతారు. ఏ భక్తులు శరణాగతి చెందుతారో వారికి దత్తం అవుతారు. నా భక్తులకు నేనే దత్తం అవుతాను. నా భక్తులకు ,నాకు దూరం లేదు, నన్ను అనన్యంగా  ధ్యానం చేసేవారికి నేను ప్రసన్నుడను. వారి ఇహ,పర శ్రేయస్సులు నావే. భక్తితో నన్ను కొలిస్తే నేను మీతోనే ఉంటాను. మీతో ఏకమౌతాను.అన్న దత్త స్వామికి అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. 

శ్లో॥ అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే




స్వామి ని యథాశక్తి పూజించి  బ్రాహ్మణ భోజనము విధి గా చేయాలి.

No comments:

Post a Comment