Sunday, December 6, 2020

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిగెల్ రాయి తాలూకాలో పాంచలేశ్వర్ గ్రామమున్నది .అక్కడే గోదావరి నది ఉన్నది .ఆ నది మధ్యలో దత్తాత్రేయ ప్రభువు భోజనం చేసే గద్దె కలదు

 మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిగెల్ రాయి తాలూకాలో పాంచలేశ్వర్ గ్రామమున్నది .అక్కడే 


గోదావరి నది ఉన్నది .ఆ నది మధ్యలో దత్తాత్రేయ 

ప్రభువు భోజనం చేసే గద్దె కలదు .(8 ×4 ×2 )

గద్దె పరిమాణం .చుట్టూ భక్తులు కూర్చొని ధ్యానం 

జపము ,చేసుకోవడానికి బండలు ఏర్పాటు చేశారు  .ఆ గద్దె పై భాగములో ఎనిమిది పిల్లర్స్ 

తో అష్టభుజి ఆకారములో రూఫ్ వేసిఉంటుంది .

అక్కడ దత్తాత్రేయ విగ్రహము ఏమీ ఉండదు .

గోదావరి నీటి ప్రవాహము పెరిగితే ఈ గద్దె మునిగిపోతుంది .ప్రతిరోజూ అక్కడగల పూజారి 

పాంచలేశ్వర్ గ్రామానికి భిక్షకు వెళతాడు .

అక్కడ గ్రామస్తులు ఇచ్చిన రొట్టె ,అన్నము ,

కూరలు ,స్వీట్లు తీసుకొచ్చి 12 గంటల కల్లా నివేదన చేసి ,అక్కడ కూడిన భక్తులకు భోజనం 

పెడతారు .భక్తులు కొందరు ధ్యానం ,మరి కొందరు 

గద్దె చుట్టూ ప్రదక్షిణాలు చేసారు .ఈవిధంగా పాంచాలేశ్వర్ నందు నిత్య కార్యక్రమం జరుగుతుంది .

'కాశి స్నాన జప ,ప్రతిదివాసి 

కోల్హాపూర్ భిక్షేసి ,నిర్మల నది తుంగ 

జలప్రాసి ,నిద్రా మాహుర్ దేశి .

ప్రతిరోజూ దత్తాత్రేయ స్వామి వారణాసిలో స్నానం చేసి ,కొల్హాపురి నందు భిక్ష చేసి ,

పాంచాలేశ్వర్ నందు మధ్యాన్న భోజనం చేసి 

మహూర్ ఘడ్ నందు నిద్రిస్తారు .

( సాయిదర్శన్ పూర్వపు సంచికల నుండి సేకరణ ).

No comments:

Post a Comment