Sunday, December 6, 2020

షోడశ దత్త అవతారం-14....🙏🏻 శ్రీ దేవదేవ/దేవదేవేశ్వర

 శ్రీ దత్త లీలా క్షేత్ర మహత్యం...

షోడశ దత్త అవతారం-14....🙏🏻


శ్రీ దేవదేవ/దేవదేవేశ్వర...

మార్కండేయ ఋషి చెప్పిన కథ ఇది.

ముఖ్యంగా మాహుర్ క్షేత్ర  ప్రాంతంలో శతానందా అనే భక్తునకు దర్శనం ఇచ్చి,అనుగ్రహము ఇవ్వడానికి ఈ అవతారం తీసుకున్నారు.

స్వర్గంలో ఇంద్రాది దేవతలు,సత్య లోకంలో బ్రహ్మలకు  దర్శనం ఇచ్చి ఈ అవతారంలోనే అనుగ్రహించారు. శ్రీ దత్తత్రేయ స్వామి నర్మదా తీరం లోని దక్షిణ తీరంలోని అడవి నుంచి బయలుదేరి అనేక ఋషుల ఆశ్రమాలు, అనేక తీర్ధాలు, జలాశయాలు,పవిత్ర పరచుతూ చివరకు 6 పర్వతాల సమూహం,అతి ప్రాచీనం అయిన సహ్యాద్రికి వచ్చారు. ఇది దత్తాత్రేయ జన్మస్థానం అని కూడా చెప్తారు.అక్కడి అనేక ఆశ్రమాలలోని ఋషులకు దర్శనం ఇచ్చారు. దీనిని  అనసూయ శిఖరం అని,దత్తాత్రేయ స్వామి చాలా రోజులు నివసించడo వల్ల దత్త పాదుకా శిఖరం అని కూడా అంటారు. దత్తాత్రేయ స్వామి నిరంతరం  యోగ సమాధిలో తన్మయులై వుండే మహాయోగి. దత్త ఆశ్రమం మహా సుందర మైనది. చక్కటి పూలు,పండ్ల తో అలంకరింపబడినది. అనేక యోగులు, సిద్ధ మునులు,ఇక్కడే నివసిస్తారు. ఇంద్రాది దేవతలు, సిద్ధులు,గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, ఇక్కడే స్వామిని దర్శించుకుo టారు. క్రూర జంతువులు తమ వైర భావము మాని అన్ని కలిసి మెలిసి ఉంటాయి. మహావిష్ణు రూపం అయిన దత్తత్రేయ స్వామి  దేవదేవుడు రూపంలో ఇక్కడ అవతరించి, కృష్ణా మలకి వృక్షం క్రింద నీడలో శోభితులైనారు. శంఖం, చక్రం,గద ఇలాంటి ఆయుధాలు ధరించి దేవదేవుడుగా వున్నారు. ఇక్కడకు  బ్రహ్మ దేవుడు, సత్ భక్తులు దర్శనంకు వచ్చారు. గౌతమ మహర్షి కుమారులు , జనకమహారాజు పురోహితులు అయిన శతానంద మహముని స్వామిని ఇక్కడే దర్శించుకున్నారు. అప్పుడు స్వామి, బ్రహ్మ కు,సత్ భక్తులకు,శతానంద మహామునికి దేవదేవుడు రూపంలో దర్శనం ఇచ్చారు.

శ్లో ॥ భాద్రే దివా శుక్ల చతుర్దశీతిథో భృగోర్దినే భే శతతారకాఖ్యే!

ఆదయే చ యామే శుభదే మహూర్తే దృశ్యో భవత్తత్ర స దేవదేవః ॥

భాద్రపద శుక్ల చతుర్దశి రోజు ,శుక్రవారం శతభిషా నక్షత్రంలో మొదటి ఘడియ లో శుభముహూర్తంలో స్వామి దేవదేవేశ్వర రూపములో  అవతరించడం జరిగింది. సిద్ధులు అందరూ స్వామిపై పూల వర్షం కురిపించారు. జయ,జయ కారాలు మారుమోగిపోయాయి.

తలపై కిరీటం సూర్యతేజస్సుతో, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. విశాలమైన నుదురు, నల్లటి రింగుల జుట్టు,శంఖం వంటి గొంతు,తేజస్సుతో మెరుస్తున్న బుగ్గలు, పెద్ద బహువులు, అందమైన చేతులు, వంపు కనుబొమ్మలు,పద్మం లాంటి కళ్ళు, మెడలో పొడుగాటి వైజయంతి మాల, సూటి ముక్కు, చక్కటి పళ్ళ వరస, తెల్లని దంతాలు,చెవికి కుండలాలు, అందమైన గడ్డం, అజానుబహు,  గొంతుకు పగడ, రుద్రాక్ష మాల,పసుపు రంగు పట్టు వస్త్రములు కట్టి, భుజాములపై అంగ వస్త్రము వేసుకొని దత్తాత్రేయ స్వామి శ్రీ  దేవదేవ అవతారంలో దేదీప్యమానంగా వెలిగిపోయారు. చూసిన మునుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. 

 శ్లో ॥సర్వాపరాధ నాశాయ సర్వపాప హరాయ చ!

దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే॥

జై గురు దత్త

No comments:

Post a Comment