Monday, December 14, 2020

మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా

*మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా*

సాయి బాబా     ...            సాయి బాబా          ...            సాయి బాబా          ...            సాయి బాబా.


*శ్రీమతి సాయిలీలమ్మగారు కలకత్తాలో యుండగా నడుమునొప్పితో బాధపడుచున్నది*.
*ట్యూమర్ ఉన్నదని, అది ముందు, ముందు క్యాన్సర్ గా మారవచ్చునని, కనుక గర్భసంచి తీసివేయవలెనని డాక్టర్లు చెప్పిరి. పెద్దాపరేషన్ చేశారు.*

*ఆ పరిస్థితిలో ఇవ్వకూడని మందు నర్సు ఇవ్వటంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు లీలమ్మగారు. బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బాబా తమ చమత్కారం చూపారు.*

*తెల్లని దుస్తులు ధరించి బాబా లీలమ్మ గారి వద్దకు వచ్చి, ఆప్యాయముగా "అదేమిటి వీళ్ళు నీకు విభూతి పెట్టలేదా? అని ప్రశ్నించారు. అపస్మారకం నుండి తేరుకున్న లీలమ్మ గారు ఆ స్థితిలో "బాబా! మీరెందుకు కష్టపడతారు అనుచు తన కుమార్తె లలితను అమ్మగారు పిలవగా ఆమె వచ్చి విభూతి పెట్టినది. అప్పుడు బాబా అంతర్థానమైనారు. అంతే ఆమె ఆరోగ్యం మెరుగుపడసాగింది.*

*ఆమెను పరీక్షించుచున్న డాక్టర్లు ఆమె ఆరోగ్యము మెరుగుపడటం చూచి విస్మయం చెందారు. లీలమ్మగారి భర్త స్నేహితునకు బాబా స్వప్నంలో కనిపించి ఆమె ఆరోగ్యము బాగవుతుందని దైర్యంగా యుండమని చెప్పామన్నారు*

*ఇరువది ఒకటవ రోజు మాతాజీని ఆస్పత్రినుండి ఇంటికి పంపినారు. ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇంటి వద్ద ఉన్న పనిమనిషి మాములు పనులు చేస్తుంది కానీ పిల్లల పని, తన పని ఎవరు చూచుకుంటారని మాతాజీ ఆలోచన చేయసాగింది.*

*ఇంటిపట్టునేయుండి శ్రద్దగా ఇవన్నీ చూచుకునేందుకు ఎవరన్నా తెలుగువచ్చిన యువకుడు దొరికితే బాగుండుననుకొని శ్రీ సాయినాధుని హృదయపూర్వకంగా వేడుకున్నది.*

*లీలమ్మ గారు అలా* *అనుకున్న తరువాత ఆమె ఇంటికి వచ్చిన మూడవ రోజు ఒక కుర్రవాడు వారి ఇంటి తలుపు తట్టారు.* *రామారావు గారు వెళ్లి తలుపు తీస్తే ఆ కుర్రవాడు తెలుగులో మాట్లాడుతూ*
*ఇంట్లో పని ఉంటె చేస్తానన్నాడు.* 
*ఆ పిల్లవాడిని అమ్మగారి దగ్గరకు తీసుకొని వచ్చి పనిచేస్తానంటున్నాడు మాట్లాడు అని చెప్పి పరిచయము చేశారు రామారావు గారు.*

*ఆ కుర్రవాడు 16 సం: వయస్సు వానిగా యున్నాడు. లీలమ్మ గారు చూచింది. కుర్రవాడు బాగానే యున్నాడు కాని బట్టలు బాగాలేవు.*

*బాబా నా మోర ఆలకించాడన్నమాట.* *కలకత్తాలో తెలుగువారు దొరకటమేమిటనుకుంటూ, నీ పేరేమిటి బాబు అని అడిగితె, నాకు పేరు లేదు. ఎపేరైనాసరే, మూర్తి అని పిలువండమ్మా*.
*నా అమ్మ నాన్నా చిన్నప్పుడే పోయారు. ఎవరు లేరు అని అన్నాడు ఆ కుర్రవాడు.*

*బీరువాలో చొక్కా గుడ్డయుంటే దానిని కూతురు చేత తెప్పించి గుడ్డ అతనికి చాలదేమో అనుకుంటూ అమ్మగారే కుట్టింది. ఆ కుర్రవాడు స్నానం చేసి వచ్చి ఆ చొక్కా వేసుకుంటే సరిపోయినట్లు అనిపించింది అమ్మగార్కి.*

*ఇంట్లో పనంతా చూచుకుంటున్నాడు. పిల్లలిద్దరికీ అన్ని సమయానికి చూస్తున్నాడు. అంతకు ముందున్న పనిమనిషిని మాన్పించాడు. ఆ పనిచేస్తున్నాడు అమ్మకు మందులివ్వటం దగ్గర నుండి అన్ని తనే చూస్తున్నాడు.*

*పనిమనిషిని ఎందుకు వద్దన్నావని అమ్మ అడిగితె ఎందుకమ్మా నేను నీదగ్గరేవున్నాగా! నీకు ఆపరేషన్ చేసినప్పుడు చాలా రక్తం పోయిందిగా? ఇప్పుడు నీ ప్రక్కనే వున్నాగా. ఆ పనిమనిషికి ఇచ్చే 21 రూపాయలు నీ ఆరోగ్యానికి పండ్ల కొరకు వాడొచ్చుగా" అని అన్నాడు.*

*స్నానానికి అన్ని సిద్ధం చేసేవాడు. స్నానం చేసేటప్పుడు మగపిల్లలు రాకూడదు" అని అమ్మగారంటే చిన్న పిల్లవానిగా కనిపించాడు.* *ఇట్లు అనేక చమత్కారాలు చేస్తున్నా మాతాజీ గుర్తించలేకపోయింది మాయచేత.*

*పిల్లవాడి మాటలు సాయిసచ్చరిత్రతో పోలివున్నవని తెలుసున్నా కూడా బాబాని గుర్తించలేకపోయింది.*

*భోజనం చేసేటప్పుడు దగ్గరుండి తీనిపించేవాడు. ఆరు నెలలు తరువాత డాక్టర్లు చూసి అంతాబాగుంది ఇంకా ఒక్క నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు.*

*ఇంటికి వచ్చేటప్పటికి కుర్రవాడు ఇంట్లోలేడు. అమ్మగారు వాడేమైనాడోనని బాధపడింది. మూడురోజుల తరువాత వచ్చాడు.*

*ఏమైనావురా? అని ఆంటే నన్ను పోలీసులు పట్టుకెళ్లి జైల్లో పెట్టారు. నీవు మహ్మదీయుడవన్నారు. కాదు హిందువన్నారు. అప్పుడు వెంటనే నిక్కరు విప్పి చూపిస్తే వదిలేశారు అని చెప్పాడు*.

*నెల గడిచింది. మరలా డాక్టర్ల దగ్గరకు మాతాజీ సాయిలీలమ్మగారు వెళితే అంతా బాగుంది. మీరు మాములుగా పనులు చేసుకోవచ్చన్నారు.*

*ఆమె ఇంటికి వచ్చేటప్పటికి ఆ కుర్రవాడు లేదు. తిరిగి యిక రానేలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు. ఇంట్లో ఎప్పుడుండేవాడు. ఎక్కడికెళ్ళాడు? ఆమెకు ఆర్డమే కాలేదు.*

*అతను వున్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ సచ్చరిత్రలోని బాబా మాటలేనని గుర్తుకు వస్తున్నాయి. బాబా! మీరా ఇలా పని పిల్లవాడిగా ఉంది కాపాడినది అని బాధపడ్డది. గుర్తించలేకపోయినందుకు చింతించింది.*

*ఇలా ఆమెకు బాబా ఎప్పుడు నిదర్శననిస్తూనే యున్నారు.*

సాయి లీలమ్మ గారు 1923 ఆగస్టు 17న విజయవాడలో శ్రీ గోవిందరాజు నాయుడు (మునిసిపల్ ఛైర్మన్ గా మూడుసార్లు పనిచేశారు) మరియు శ్రీ రుక్మిణి భాయ్ పుణ్య దంపతులకు జన్మించారు. ఆమె ఏడు సంవత్సరాల వయస్సు నుండి ఆమె తండ్రి భగవత్ గీతా యొక్క  ప్రసస్త్యాన్ని వివరించి చెప్పేవారు. ముందుగా ఆమె శ్రీకృష్ణుడిని ఆరాధించడం మొదలుపెట్టారు.

1938లో ఆమె తన మేన మామయ్య శ్రీ వేణుగోపాల్ గారిని కలిసినప్పుడు అక్కడ వారి ఇంటిలో మొదటిసారి బాబా యొక్క అందమైన చిత్రాన్ని చూసే అవకాశం ఆమెకు లభించింది. ఆ ఫోటోలో బాబా యొక్క నోరు హనుమంతుడిని పోలినట్లు ఉందని ఆమె సరదాగా అన్నారు. ఆమె అక్కడ బాబా యొక్క లీలలును మరియు బాబా తన భక్తులను ఇబ్బందులు మరియు అడ్డంకులను ఎలా తొలగించేవారో తెలుసుకున్నారు.

మరుసటి రోజే ఆమెకు మొదటి అనుభవం  కలిగింది. ఆమె పాఠశాలకు వెళ్ళడానికి ఆమె ఆతురుతలో ఉన్న సమయంలో ఒక ముఖ్యమైన పుస్తకం కనిపించలేదు.ఆమె శ్రీ సాయినాధుని తలుచుకొని హృదయపూర్వకంగా ప్రార్ధించారు. మరుక్షణమే ఆ పుస్తకం ఆమె తన ముందు ఉండటం గమనించారు. అప్పటినుండి బాబాతో ఆమెకు అనుబంధం మొదలైయింది. ఆమె జీవితంలో రానున్న ప్రతి కష్టాన్ని బాబా  ముందుగా హెచ్చరిస్తూ ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకోనేవారు.

1947లో శ్రీమతి సాయి లీలామ్మ గారు కలకత్తాలో నివసించేవారు. ఆమె తన కుమార్తె కోసం ఊలు కోటు అల్లిక నేర్చుకోవాలనుకున్నారు. కాబట్టి ఆమె తన ఇంటికి సమీపంలో ఉండే వాళ్ళ ఇంటికి  అల్లిక నేర్చుకోవడం కోసం వెళ్లారు. కొంతసేపటి తరువాత భారీ వర్షం పడింది.వెంటనే ఆమెకు తన ఇంటి మేడపై ఎండబెట్టడం కోసం ఉంచిన మైదా పిండి గుర్తుకు వచ్చింది. ఆమె ఆ సమయంలో చాలా చిన్న వయస్సులో ఉన్నందున ఆమె భర్త తిడతారని బాధపడుతూ ఆమె చాలా ఆందోళన చెందారు. "బాబా మీరే నన్ను కాపాడాలి" అని ప్రార్ధించారు. బాబా అలానే చేసారు కూడా.

ఆమె వర్షం పడటం ఆగిపోయిన తరువాత గాబరాగా ఇంటి మేడపైకి వెళ్లి చూస్తే, ఆశ్చర్యం!  మేడ మీద ఉంచిన పిండి ఎవరో గొడుగుతో  తడవకుండా రక్షణ ఇచ్చినట్లు మైదా పిండి పొడిగా ఉన్నట్లు గమనించారు. పిండి ఎండబెట్టడం కోసం ఉంచిన స్థలం తప్ప మొత్తం మేడ అంతా తడిగా ఉంది. మధ్యాహ్నం వర్షం పడుతున్నప్పుడు అలా ఎవరు రక్షించగలరు! బాబా కాకుండా!

ఆ యవ్వన గృహిణికి ఇది ఒక రోజువారీ ప్రాముఖ్యమైన లోకిక విషయం అయినప్పటికీ కూడా బాబా తమ యొక్క ప్రమేయంతో ఒక అద్భత అనుభవంగా మారింది.

***శ్రీ షిర్డి సాయిబాబా ధ్యానం గురించి సాయి అంకిత భక్తురాలైన, కీర్థి శేషు రాలైన మాతాజీ సాయిలీలమ్మ చెప్పిన విషయాలు .-అమ్మ తన ఎదుట బాబా ఫొటో కాని ,విగ్రహం కానీ లేకుండానే మానసికంగా ధ్యానించేవారు 
.ధ్యానానికి కూర్చుని నిర్మలంగా ,నిశ్చలం గా పవిత్రమయిన మనస్సుతో ముందు బాబాను సంకల్పించు కోవాలి

 *.కనుబొమ్మల మధ్య దృష్టిని కేంద్రికరించగానే బాబా పవిత్ర ఆకారం మనకు కనపడుతుంది .
తరువాత బాబాను రత్నాలు ,వజ్రాలు విలువైన మణులు పొదిగిన సింహాసనం మీద ఆసీనులైనట్లు భావించాలి .బంగారు గంగాళంలో నుండి బంగారు చెంబుతో పన్నీరు ని తీసి స్నానం చేయించాలి .బంగారు పిడిగల గంధపు కర్రతో గంధాన్ని తీయాలి .శుబ్రమైన మంచి తువాలు తీసుకొని శరీరం అంతా తుడవాలి ,తరువాత గంధం పూయాలి .బంగారు పన్ను గల రోకలితో కుంకమ దంచి నొసట బొట్టు పెట్టాలి .పన్నీరు సెంటు లాంటి సుంగధ పరిమళములు వెదజల్లాలి .సాంబ్రాణి ధూపం వేయాలి .
*నిష్ట ,సబూరి అనే రెండు రూపాయలు .తాంబూలం సమర్పించి ,ఎంతో శ్రద్ద తో మానసిక మాలవేసి 'ఓం సాయి 'నామముతో పాద పూజ చేయాలి .హారతి ఇవ్వాలి .ఇదే మానసిక పూజ .అమ్మ నిత్యం చేసే ధ్యానం .ఆమె నిరంతర సాధన .అదే ఆమె విశేష తపోబలం .***

*1954 లో షిర్డీలో శ్రీ ప్రత్తినారాయణరావు గారిచే తెలుగు అనువాదం చేసిన సచ్చరిత్ర ఆవిష్కరణ సమయములో మొదటి కాపీ వీరికి ఇవ్వబడినది. వారు ఎవరిని పలకరించినా బాబా అనే సంబోధిస్తారు.*

సాయి లీలమ్మ ...శ్రీ.అవతార్ మెహర్ బాబా, శ్రీ.అబ్దుల్ బాబా, శ్రీ. శివనేషన్ స్వామీజీ, శ్రీమతి కుసుమ కుమారి, శ్రీ పూర్ణానంద స్వామి, శ్రీ.వెంకయ్య స్వామి, శ్రీ.మార్కెట్ స్వామి, చీరాల అవధూత, శ్రీ.గోపాల్ బాబా, శ్రీ , సబరి మాతా, నాంపల్లి బాబా .. దర్శనం ఆశీస్సులు పొందారు. . 1946 లో ఆమె శ్రీ బి.వి.నరసింహ స్వామీజీని సందర్శించారు. 

1948 లో, ఆమె షిర్డీకి వెళ్లి, షిర్డీలో శ్యామా కుమారుడు ఉద్దవ్ దేశ్‌పాండేను కలుసుకుంది మరియు అతని నుండి ఒక రూపాయి నాణెం అందుకునే అదృష్టం కలిగింది.

సాయి లీలమ్మ 1968 లో రిషికేశ్‌లోని మహర్షి శివానంద ఆశ్రమంలో 3 రోజులు గడిపారు. 

సాయి లీలమ్మ తండ్రి 1968 సంవత్సరంలో బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్‌లో దాదాపు రెండేళ్లపాటు ఉన్నప్పుడు, ఆమె చాలా మంది సాధువులను కలుసుకున్నారు. 

1970 లో ఆమె కేశవయ్యను సందర్శించింది. 

 1980 సంవత్సరంలో, తిరువన్నమలైలోని రమణాశ్రమంలో కొన్ని రోజులు నివసించారు. 

23 అక్టోబర్ 2005 న సాయి లీలమ్మ షిర్డీకి వెళ్ళినప్పుడు, సాయి బాబా సంస్థాన్ మేనేజ్మెంట్ టీం ఆమెతో పాటు వచ్చింది. వారు “తల్లి, మీరు 1948 నుండి సంస్థకు వస్తున్నారు. మీరు జీవిత సభ్యత్వం తీసుకున్నారు. మీలాంటి వ్యక్తులు  'ధర్మం' మరియు సత్యాన్ని కొనసాగించడానికి ఎంతో సహాయపడతారు ".అన్నారు.

ఆమె ప్రజల  సమస్యలను సాయికి చెప్పడం మరియు వారి సమస్యలను పరిష్కరించేది. ఈ విధంగా, ఆమె చాలా మంది ప్రజల సమస్యలను మరియు అనారోగ్యాలను నయం చేసింది. భక్తులు బాధపడుతున్న అనేక వ్యాధులు ఆమె ద్వారా నయమయ్యాయి. వారి దీర్ఘకాలిక వ్యాధులను తీసుకోవడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు.

*సాయి లీలమ్మ *ధ్యానం,* అన్నదానం, *సత్సంగం ,మరియు *నామ జపా లకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆమెను సందర్శించడానికి వచ్చిన ప్రతి భక్తుడి నుదిటిపై ఆమె ఉధీని ఉంచేవారు. 

సాయి లీలమ్మ తన భక్తులకు అనేక సందేశాలు ఇచ్చేది. సాయి భక్తుల ప్రయోజనం కోసం అటువంటి అద్భుతమైన సందేశం.......

*విశ్వాసం ఉన్నచోట, ప్రేమ ఉంది,;;, 
*ప్రేమ ఉన్నచోట శాంతి ఉంది,; , 
*శాంతి ఉన్నచోట దేవుడు ఉన్నాడు, 
*సాయి ఎక్కడ ఉన్నారో అక్కడ, అన్ని ఉన్నాయి

2014 ఆగస్టు 25, సోమవారం ఉదయం 11:05 గంటలకు   91 సంవత్సరాల వయసులో సికింద్రాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్ నివాసం కమ్ మందిరంలో సిధ్ధి  పొందారు.

*గురువుల నుండి*సద్గురులీల నుండి *అంతర్జాలం నుండి సేకరణ*
అల్లు జయశ్రీ.

No comments:

Post a Comment