సాయిబాబా వేదాంతాన్ని ,భక్తిని ,అధ్యాత్మిక క్రమశిక్షణను ,నీతిని ,దైనందిన ప్రవర్తన ,సర్వప్రాణుల సమభావనను బోధించారు
పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు .సాయిబాబా
మాటలకు కాలదోషం పట్టదు .కాలదోషము పట్టని కమనీయ సూక్తులు .అంటారు పెద్దలు .
సాయిబాబా ఒకసారి " నీవు దాహము గలవారికి
నీరిచ్చినచో ,ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో ,వస్త్రముల లేనివారికి వస్త్రములు ఇచ్చినచో ,నీ వసారా ఇతరులు కూర్చునుటకు
ఇచ్చినచో భగవంతుడు మిక్కిలి ప్రీతిచెందును ."
అని పలికారు .
ఒకసారి మహారాష్ట్రకు చెందిన సత్పురుషుడైన
ఏకనాథమహారాజ్ కాశీకి వెళ్లారు .ఒక కమండములో గంగా జలాన్ని తీసుకుని ,
రామేశ్వరంలోని శివుణ్ణి అభిషేకిద్దామని తద్వరా
సంపూర్ణ కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుందని భావించాడు .కాశీనుండి తిరుగుప్రయాణం సాగించాడు .అది మంచి ఎండాకాలం .మార్గ
మధ్యములో ఎండలు మండిపోతున్నాయి .
ఎక్కడా ఒక పచ్చని చెట్టుగాని ,చల్లని నీడగాని
లేని ఒక ఎడారిలాంటి ప్రదేశములొ శిష్యులతో
కలసి ఏకనాధుడు ప్రయాణం సాగిస్తున్నాడు .
అటువంటి వాతావరణములో ఒక చోట కృశించిపోయిన ఒక గాడిద మూలుగు విన్నాడు .
అది దాహముతో విలవిలా కొట్టుకొంటున్నది .
ఆ గాడిద దయనీయ పరిస్తితి చూశాడు ఏకనాధుడు .ఆ పరిస్థితికి చలించిపోయాడు .
వెంటనే తాము రామేశ్వరములో శివునికి అభిషేకం చేయాలని తీసుకు వెళుతున్న ఆ గంగా
జలాన్ని ఆ గాడిద నోటిలో పోశాడు ." అదేమీ స్వామీ ! కాశీనుండి ఇంతవరకు గంగా జలము
ఎంతో కష్టపడి తెచ్చాము .మనం ఆ నీటిని
రామేశ్వరము వెళ్ళి ఆ నీటిని కలపాలి గదా !
ఇప్పుడు రామేశ్వరునికి ఏది అర్పించాలి ?"
అని శిష్యులు అడిగారు ." ఈ గాడిదయే నాకు
రామేశ్వరము ." అని అన్నాడు ఏకనాధుడు .
ఏకనాధుడు రామేశ్వరము చేరకుండానే యాత్రా
ఫలం సిద్దించినది .

No comments:
Post a Comment