ఆర్థర్ అసబోర్న్ అరుణాచలం రమణ మహర్షి భక్తుడు .ఒకసారి షిర్డీవెళ్ళి బాబా సమాధిని
దర్శించాడు .బాబా 1918 సం .లో మహాసమాది
చెందినప్పటికీ ,అనేక అద్భుతాలు చేసి చూపారని
అనుభవపూర్వకంగా ఒక సంఘటన రాశారు .
మిస్ దంట న అనే వృద్దురాలు ఏకాకి .తన ఉద్రేకమువలన తాను నివసిస్తున్న ప్రదేశము
విడచి వెళ్లవలిసిన పరిస్ధితి ఏర్పడినది .
తనను ఆదుకొనేవారు లేరు .ఆమె విషాదంతో
ఇంట్లొ ఉండగా ,అకస్మాత్తుగా ఇతరులు ప్రవేశించడానికి వీలులేని తన గదిలో తెల్లని బట్టలు ధరించిన ఒక ముస్లిం ఫకీర్ ప్రత్యక్షమై
" కంగారు పడకు ! విచారపడకు ! నీవు కలకత్తా
వెళ్ళినతరువాత పరిస్థితి అంతా చక్కబడుతుంది
అని పలికి తనకు దక్షిణ సమర్పించుకోమన్నారు .
ఆమె తనవద్ద డబ్బు లేదంటే " ఆ బీరువా లొగల
అరలో 35 రూపాయలు వున్నాయి చూడు ! "
అని ఆన్నారు .ఆమె అల్మారాలో చూ డగా ఆందులో ఆయన చెప్పినట్లు డబ్బులు వున్నాయి
దక్షిణ ఇద్దామని వెనుకకి తిరుగగా ఆ ఫకీర్ మాయమయ్యాడు .ఆ ఫకీర్ చెప్పినట్లుగా కలకత్తాలో ఉన్న ఆమె బంధువు ఆమెను చేరదీసాడు .ఈ విషయాన్ని మిస్ దంటన ,
ఆస్ బోర్న్ కు చెప్పినది .వెంటనే ఆయన తన
గృహానికి వెళ్ళి సాయిబాబా పటాన్ని తెచ్చి
చూపించగా " ఈయనే ఆ ఫకీర్ .తలకు అచ్చంగా
ఆ తెల్లగుడ్డ ఉన్నది ." అన్నది .ఆశ్చర్యంగా .
ఆ ఫకీర్ సాయిబాబా అయి వుంటాడని తన ఇంటికి వెళ్ళి ఫొటొ తెచ్చి చూపించాడు ఆస్ బోర్న్
ఎందుకంటె సాయబాబా మహ మహిమాన్వితుడు .అది ఆయనకు తెలుసు .

No comments:
Post a Comment