Sunday, December 6, 2020

షోడశ దత్త అవతారాలు... 15::: దిగంబరుడు

 దత్త లీలా క్షేత్ర మహత్యం...🙏🏻

షోడశ దత్త అవతారాలు...

15::: దిగంబరుడు


సోమవంశ రాజు అయిన యదురాజు కు దర్శనం ఇవ్వడానికి స్వామి ఈ అవతారం తీసుకున్నారు. ఒకసారి యదురాజు కావేరి నది దగ్గర పర్వతాల మధ్య, అడవిలో తిరుగుతున్నాడు. యదురాజు దత్తాత్రేయ భక్తులు, ఉపాసకులు. యదురాజుకు అకస్మాత్తుగా దిగంబరుడు అయిన దత్తాత్రేయ స్వామి దర్శనం ఇచ్చారు. యదురాజు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, వినమ్రంగా, మహారాజ!సర్వలోకంలో జనులు సంపత్తి, ఆయుష్యు,  కీర్తి, వైభవం, ధనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ప్రకాశవంతమైన యువకులు. వీటి కోసం ప్రయత్నం చేయకపోయినా మీరు ఇంత తృప్తిగా ఎలా ఉండగలుగుతున్నారు?కామము, వికారాలు,ద్వేషం ఇలాంటివి మీకు అంటడం లేదు ఎందుకు? మీరు సంతోషంగా కనిపిస్తున్నారు.దయచేసి నాకు వివరించవలసినది,  అని అడిగాడు. అప్పుడు దిగంబరుడు అయిన అవధూత ఆత్మ సంతృప్తి కోసం విశ్వంలో తిరిగేటప్పుడు ప్రకృతి లోని 24 మంది గురువులను కనుగొన్నాను. వాటి నుంచి 24 రకాల భోధలు తీసుకున్నాను. అదే నా ఆనందమునకు కారణం. అవి భూమి,వాయువు,ఆకాశము, అగ్ని,సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, ఏనుగు,చీమ,చేప, వేశ్య, శరకారుడు, బాలుడు,చంద్రుడు, తేనె టిగ,లేడీ, గ్రద్ద,కన్య,సర్పము,సాలె పురుగు, భ్రమర కీటకం,జలము. ఇలా 24 గురువుల నుంచి నేర్చుకున్నాను. అని బోధించారు. కృతజ్ఞతగా యదురాజు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు.దత్తాత్రేయ స్వామి దయతో బోధించన ఆత్మజ్ఞానంతో యదు మహరాజు, కృతార్థుడై రాజ్యాన్ని పాలించాడు. ప్రహ్లాదుడుకి జ్ఞానం,  కార్తవీర్యార్జునకి సేవ, స్మరణ వల్ల, వేదధర్ముడుకి నామజపం, దీపకునికి లీలా శ్రవణం,విష్ణుధర్ముడు కి పాదార్చన, పరశురాముడుకి స్నేహ భక్తిచే తరింపజేశారు.

అవతారం:ఆషాఢ మాసం,పూర్ణిమ, బుధవారం, సూర్యోదయంలో, అశ్వని నక్షత్రంలో అవతరించారు.

అర్చన:

వస్త్ర, మాలలుతో పూజ చేయడం. శ్లో ॥ దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే 

దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షిణే ॥

జై గురు దత్త.

No comments:

Post a Comment