Sunday, December 6, 2020

బాబా అమెతో " నీవు ఎవరిని పూజిస్తావు ? " అని అన్నారు . "గణపతి ని "అన్నదామె ." చూసావా ! నీవు నివేదించిన పదార్ధాలన్నీ నాకే అందుతున్నాయి "

 ఒక రొజు బొంబాయి నందు గల బాంద్రా ప్రాంతము 

నుండి ఒక మహిళ సాయబాబా దర్శనానికి షిర్డి వచ్చి ,బాబా ఎదుట కూర్చున్నది .యేడు ఏళ్లుగా 

ఆమె విపరీతమైన తలనొప్పి తో బాధ పడుచున్నది .బాబా ఆమె తలనిమురుతూ "

అమ్మా ! నీకు తలనొప్పిగా ఉన్నది అవునా " అని 

అడిగాడు ." ఇంతకు ముందు ఉండేది .ఇప్పుడు 

మీరు తల నిమరాగానే తగ్గిపొయింది బాబా !"

అని అన్నది .బాబా ఆమెతో " అమ్మా ! నీ చిన్నతనం నుండి నాకెన్నో పదార్ధాలు తినబెడుతున్నావు కదా ! " అని అన్నారు .

ఆనాటిదాకా ఆమె బాబాను చూడలేదు .అదెట్లా 

సంభవం ? అని అశ్చర్యపోయింది .బాబా అమెతో 

" నీవు ఎవరిని పూజిస్తావు ? " అని అన్నారు .

"గణపతి ని "అన్నదామె ." చూసావా ! నీవు నివేదించిన పదార్ధాలన్నీ నాకే అందుతున్నాయి "

అని తన పొట్టను తడుముకున్నాడు సాయి .

భోజన ప్రియుడైన విఘ్నేశ్వరుడు తానే అని  సూచించారు 


No comments:

Post a Comment