ఒక రొజు బొంబాయి నందు గల బాంద్రా ప్రాంతము
నుండి ఒక మహిళ సాయబాబా దర్శనానికి షిర్డి వచ్చి ,బాబా ఎదుట కూర్చున్నది .యేడు ఏళ్లుగా
ఆమె విపరీతమైన తలనొప్పి తో బాధ పడుచున్నది .బాబా ఆమె తలనిమురుతూ "
అమ్మా ! నీకు తలనొప్పిగా ఉన్నది అవునా " అని
అడిగాడు ." ఇంతకు ముందు ఉండేది .ఇప్పుడు
మీరు తల నిమరాగానే తగ్గిపొయింది బాబా !"
అని అన్నది .బాబా ఆమెతో " అమ్మా ! నీ చిన్నతనం నుండి నాకెన్నో పదార్ధాలు తినబెడుతున్నావు కదా ! " అని అన్నారు .
ఆనాటిదాకా ఆమె బాబాను చూడలేదు .అదెట్లా
సంభవం ? అని అశ్చర్యపోయింది .బాబా అమెతో
" నీవు ఎవరిని పూజిస్తావు ? " అని అన్నారు .
"గణపతి ని "అన్నదామె ." చూసావా ! నీవు నివేదించిన పదార్ధాలన్నీ నాకే అందుతున్నాయి "
అని తన పొట్టను తడుముకున్నాడు సాయి .
భోజన ప్రియుడైన విఘ్నేశ్వరుడు తానే అని సూచించారు

No comments:
Post a Comment