షిరిడీకి చేరిన సాయిబాబాను పిచ్చి ఫకీర్ అన్నారు ప్రజలు .సాయబాబా యందు అజ్ఞానాన్ని
నశింపచేసి ,జ్ఞానాన్ని బోధించగల సమర్ధత ,
మచ్చలేని జీవితం ,పవిత్రత ,కోరికలు లేని పరమ శాంతి ,సాధన పరత్వం ,హిత ,మిత ,సత్య
భాషిత్వం ,కామక్రోధాదులు లేక ,జ్ఞాన వైరాగ్యాలతో ఉండటం ,.......ఇలా ఎన్నొ సుగుణాలు అయనను దైవాన్ని చేసాయి .
గురువు ,సద్గురువు ,సమర్ధసద్గురువుగా
కీర్తించబడ్డాడు .శ్రీ కృష్ణ జాగేశ్వర భీష్మ ,
"సమర్ధగురు సాయినాథ పురవీ మనోవాసనా "
(సమర్ధుడైన సద్గురు సాయినాథ భగవానుడు
మన మనోవాంఛను నెరవేర్చును ) అని కాకడ
హరతిలో, ప్రభాత అష్టకంలో సమర్థ సద్గురువుగా
సాయిబాబాను స్తోత్రం చేశాడు ." నమామీశ్వరం
సద్గురు సాయినాథం ( సద్గురురూపంలో నున్న
ఈశ్వరుఁడు (పరబ్రహ్మ ) అయిన సాయినాధునికి
నమస్కరించెదను )అని మధ్యాన హరతి ,ధూప్
హరతిలో ,సాయినాథ మహిమా స్తొత్రంలో ,
ఉపాసనీ మహరాజ్ ,సాయిబాబాను సద్గురువుగా
కీర్తించాడు .అంతేగాక దాదాకేల్కర్ ,సాయి శరణానంద ,హేమాడ్ పంత్ ,హరి సీతారామ్ ధీక్షిత్ ,లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కరు ,బాపూసాబ్ జోగ్
బాలకృష్ణ విశ్వనాద్ దేవ్ మున్నగు భక్తులు
సాయిబాబాను సమర్థ సద్గురువుగా కీర్తించారు

No comments:
Post a Comment