క్రింది శ్లోకము నందు శ్రీ దత్తాత్రేయుల వారి నామ మహిమ వర్ణింపబడినది.
🌹🍅🌷🌻🌸💐🍀🌷🌼🌺🍎🌿🌻🌹🌷
" దత్తం దత్తం , పునర్దత్తం , యోవదేద్బక్తి సంయుతః
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి నసంశయః "
🌹🌻🌷🌼🌸💐🍏🌺🍀🌷🌹🍁🌼🌹🍅
అనగా దత్తా , దత్తా , పునఃపునఃదత్తా అని ఎవరు భక్తిపూర్వకంగా ఉచ్చరించెదరో వారి సమస్త పాపములను క్షయమగును. యిందు ఏ విధమయిన సంశయము లేదు.
' దత్తాత్రేయుడు స్మర్తృగామి ' అనగా స్మరణ చేసినంత మాత్రమునే దత్తాత్రేయుడు వచ్చి రక్షించును. పిల్లలు ఏ విధముగా మాటిమాటికి అమ్మా అమ్మా అని పలుకుదురో అదే విధంగా మనము మాటిమాటికి దత్తుని నామమును శ్రద్దభక్తులతో స్మరించిన యెడల దయామయిడైన ఆ అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు , సర్వజీవులను రక్షించు మరియు శిక్షించు వాడు. మన అందరియందు , అందరి అత్యంత సమీపమందు మనలోనే మన అత్మ అయి ఉన్న ఆ దత్తప్రభువు తన్ను భజించు వారిని కరుణతో , దయతో తల్లిదండ్రులు వలె సర్వకాల సర్వవస్థలయందును వదలక రక్షించును.
యీ నిశ్చయమును హృదయము నందుంచుకోని మనము సదా సర్వకాల సర్వావస్థలయందును , సుఖదుఃఖాది సమస్త పరిస్థితులయందును , దత్తుని దత్త నామమును స్మరించుచుండవలెను.
హే ప్రభో ! దత్తాత్రేయ ! ఎల్లప్పుడును నీ నామస్మరణ చేయు భాగ్యము మాకు అనుగ్రహింపుము అని వారిని అత్యంత శ్రద్దాభక్తులతో ప్రార్థించుచుండవలెను.

No comments:
Post a Comment