Wednesday, May 20, 2020

శ్యామ్ రావు జయకర్

శ్యామ్ రావు జయకర్

శ్యామ్ రావు జయకర్ ముంబైలోని విల్లే పార్లేలో నివసించిన గొప్ప చిత్రకారుడు. అతను మొట్టమొదటిసారి షిర్డిని 1916-1917లో సందర్శించాడు. జయకర్ చాలామంది ఇతర భక్తులతో కలిసి షిర్డీ వెళుతూ ఉండేవారు. ఈయనతో పాటు వచ్చిన వారు షిర్డీని విడిచిపెట్టి వెళ్లినప్పటికి కూడా శ్యామ్ రావ్ షిర్డీలో ఉండిపోయే వారు. శ్యామా రావ్ షిర్డీలో ఉన్నప్పుడు డబ్బు బాగా  సంపాదించేవారు. అందువలన, సాయిబాబా అతని నుండి దక్షిణను అడిగేవారు అతనుకూడ బాబా వారు దక్షిణ అడిగినప్పుడు అడిగినంత దక్షిణ బాబావారికి ఇస్తూ ఉండేవారూ. శ్యామ్ రావు జయకర్ తో వచ్చిన చాలమంది భక్తులు షిర్డీని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు జయకర్ వద్ద డబ్బులు  లేవు. అందువలన శ్రీసాయిబాబా అతని నుండి దక్షిణను అడగలేదు. శ్రీ సాయిబాబా వారికి జయకర్ ఏమి చెప్పకుండా అతని పరిస్థితిని సాయిబాబా తెలుసుకున్నారు.

జయకర్ 16 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు, ఒక బ్రహ్మచారి(సన్యాసి లేదా యోగి) అతనికి శివ మంత్రాన్ని మంత్రోపదేశంగా ఇచ్చారు. (అంటే) అతన్ని  భగవత్ మార్గంలో ప్రవేశపెట్టారు. తరువాత, ఒక సన్యాసి అతనికి ఒక శక్తి మంత్రాన్ని ఇచ్చి దానికి జోడించి దాని కలిపి సాధన చేయడం నేర్చుకున్నారు. జయకర్ బాబా వద్దకు వెళ్ళినప్పుడు, అతను దీక్ష , మంత్రాన్ని తీసుకొని  ఉన్నారు. ప్రతిఒక్కరికీ అతని సలహా ఏమిటంటే, అతను ఇప్పటికే కలిగి ఉన్నందువలన అతని గురువు, అతని మంత్రం మరియు అతని సాధన *"జో కరిత్ ఆలే థెచ్ కారా"* కానీ  బాబా  భక్తులకు చాలా చక్కని నైతిక బోధన ఇచ్చారు. అలాంటి ఒక బోధ “స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండండి. ప్రజలందరినీ సరిగ్గా చూసుకోండి ”
రావు బహదూర్ M.V.ప్రధాన్ తను బాబా వారికి లైవ్ లో వేసి ఆయిల్ పెయింటింగ్ ఇవ్వాలని కోరినందున, జయకర్ మొదటిసారి శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళారు.అందువలన జయకర్ వెళ్లి బాబాను చూడవలసి వచ్చింది. అతను వెళ్లి శ్రీసాయిబాబా వారిని  బాగా చూశారు. బాబా కూడా జయకర్ వైపు చూశారు. అతను బాబా వారి ఆయిల్ పెయింటింగ్ చేయడానికి ముందు బాబావారి నుండి అనుమతి  పొందవలసి ఉంది. అందువలన షామా (అంటే) (మాధవ్ రావు దేశ్‌పాండే) వద్దకు వెళ్లి అనుమతి కోరారు. శ్యామా బాబా వారిని ఆడిగినప్పుడు శ్రీసాయిబాబా వారు "నేను, ఒక పేద ఫకీరును, నాకు ఆయిల్ పెయింటింగ్ ఎందుకు?  షామా మీరు ఈ చిత్రన్నీ పొందవచ్చు".చివరకు, మాధవ్ రావు వచ్చి, పెయింటింగ్ కోసం బాబా నుండి అనుమతి పొందానని జయకర్ కు చెప్పారు.బాబా ఆదేశించినట్లుగా, ఒక చిత్రాన్ని వేయడానికి  బదులుగా, జయకర్ మూడు చిత్రలను వేశారు. అప్పుడు, రావు బహదూర్ M.V. ప్రధాన రెండు తీసుకున్నారు.మూడవది బాబా వద్దకు తీసుకువెళ్ళారు, అతనిని తాకి H. S. దీక్షిత్ కు అప్పగించారు.ఆ చిత్రాన్ని ఇప్పటికి కూడా అతని ఇంట్లో దర్శించవచ్చు.  ఇప్పటికీ కూడా వారి వారసులు పూజిస్తారు.

జయకర్ బాబావారి మరో పెద్ద-పరిమాణలో ఉన్న చిత్రాన్ని వేసారు. అది కొన్ని సంవత్సరాలుగా ఉపయోగించబడలేదు అంటే ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు అది మసీదులో ఉంచబడింది.షిర్డీ వెళ్లి దర్శిసిస్తున్న అనేక మంది ప్రజలకు భక్తులకు దర్శించడానికి ఎంతగానో   ఉయోగపడుతోంది.

No comments:

Post a Comment