Thursday, May 28, 2020

సాయి సాహిత్యములో ఎందరి గాథలో వున్నాయి .వాటిలో కొందరి భక్తుల పేర్లు తరచుగా వినిపిస్తుంటాయి

సాయి సాహిత్యములో ఎందరి గాథలో వున్నాయి .వాటిలో కొందరి భక్తుల పేర్లు తరచుగా 
వినిపిస్తుంటాయి .ఉదాహరణకి ,మాధవరావ్ 
దేశపాండే ,కాకాసాబ్ దీక్షిత్ ,హేమాడ్ పంత్ ,
దాసగణు మున్నగు వారు .కొందరి పేర్లు అయితే 
ఒక్కసారే వస్తాయి .ఉదాహరణకి చోల్కర్ ను 
తీసుకొనవచ్చును .చోల్కరు కథ ఒక అధ్యాయములో కనిపించినా మన మనసులో 
చిరస్థాయిగా ఉండిపోతాడు .అందరికి నచ్చి ,
అందరూ మెచ్చుకొన్న సుగుణాలలో ఒకటి 
కర్తవ్యపాలన .అతడు తాను నిర్వర్తించదలిచిన 
కర్తవ్యమును నిర్వర్తించాడు .పరీక్షకు చదివాడు .
పరీక్షకు చదవకుండా ,సరిగా రాయకుండా గాలిలో 
దీపంపెట్టి ,సాయబాబా ! నీ మహిమను చూపు !
నన్ను ఉత్తీర్ణుగా చేయి అని కోరలేదు .ఏ వ్యక్తి 
అయినా తన విజయానికి తనకు తానై మొదట శ్రమించాలి .తరువాతే దైవము ,గురువుల ప్రమేయం వస్తుంది .చోల్కరు అందరినీ ,చివరకి 
సాయిబాబాను ఆనందపరిచిన విషయము మొక్కు తీర్చడం .చోల్కరు చక్కర ( పంచదార )
ఉన్న ఏ పదార్ధాన్నీ సేవించేవాడు కాదు .చక్కర 
లేని తేనీరు తాగసాగాడు .ఈ సంగతి బాబా గ్రహించాడు .చక్కర ఎక్కువగా వేసి ,తేనీరుని 
చోల్కర్కు ఇవ్వమని ఒక భక్తునికి పురమాయించాడు సాయబాబా .

No comments:

Post a Comment