సాయి సాహిత్యములో ఎందరి గాథలో వున్నాయి .వాటిలో కొందరి భక్తుల పేర్లు తరచుగా
వినిపిస్తుంటాయి .ఉదాహరణకి ,మాధవరావ్
దేశపాండే ,కాకాసాబ్ దీక్షిత్ ,హేమాడ్ పంత్ ,
దాసగణు మున్నగు వారు .కొందరి పేర్లు అయితే
ఒక్కసారే వస్తాయి .ఉదాహరణకి చోల్కర్ ను
తీసుకొనవచ్చును .చోల్కరు కథ ఒక అధ్యాయములో కనిపించినా మన మనసులో
చిరస్థాయిగా ఉండిపోతాడు .అందరికి నచ్చి ,
అందరూ మెచ్చుకొన్న సుగుణాలలో ఒకటి
కర్తవ్యపాలన .అతడు తాను నిర్వర్తించదలిచిన
కర్తవ్యమును నిర్వర్తించాడు .పరీక్షకు చదివాడు .
పరీక్షకు చదవకుండా ,సరిగా రాయకుండా గాలిలో
దీపంపెట్టి ,సాయబాబా ! నీ మహిమను చూపు !
నన్ను ఉత్తీర్ణుగా చేయి అని కోరలేదు .ఏ వ్యక్తి
అయినా తన విజయానికి తనకు తానై మొదట శ్రమించాలి .తరువాతే దైవము ,గురువుల ప్రమేయం వస్తుంది .చోల్కరు అందరినీ ,చివరకి
సాయిబాబాను ఆనందపరిచిన విషయము మొక్కు తీర్చడం .చోల్కరు చక్కర ( పంచదార )
ఉన్న ఏ పదార్ధాన్నీ సేవించేవాడు కాదు .చక్కర
లేని తేనీరు తాగసాగాడు .ఈ సంగతి బాబా గ్రహించాడు .చక్కర ఎక్కువగా వేసి ,తేనీరుని

No comments:
Post a Comment