ఒక గొప్ప అద్భుత లీలా శ్రీ B. V.నరసింహ స్వామీజీ గారు శ్రీ సాయిబాబా వారి సహస్రనామావళిని వ్రాయాలి అనుకొని పరిపూర్ణమైన పూర్తి ధ్యానంలో మునిగిపోయారు. సాయి సహస్రనామానికి సరిపోయే విధంగా ఒక నామం కూడా వ్రాయాలేకపోవడంతో అతని కాంక్ష అంతా ఫలించలేదు.*
*21.12.1936 తేదీన రాత్రి 11.00 సమయంలో అతను సాయి సహస్రనామమును వ్రాసే ప్రయత్నం చేస్తూ సాఠే వాడలో కూర్చున్నారు. ఆ సమయంలో శ్రీ దాసగణు మహారాజ్ వాడాలోకి వచ్చారు, ఈ విషయం తెలుసుకున్న స్వామీజీ తన వైపు చూసి వ్రాయడం ప్రారంభించమని చెప్పారు. అప్పుడు దాసగణు మహారాజ్ గారు అక్కడే ధ్యానం చేయడం కోసం కూర్చున్నారు.*
*ఉదయం 4:00 సమయం అయ్యే సరికి శ్రీ దాసగణు మహారాజ్ ధ్యానం నుండి బయటకు వచ్చి స్వామీజీని ఎంతవరకు వ్రాసారు అని అడిగారు. శ్రీ నరసింహ స్వామీజీ ఈ విదంగా బదులిచ్చారు - "నేను సహస్రనామవళిని పూర్తి చేసాను. మీరు నిర్దేశించి చెపుతున్నా ప్రకారం నేను వ్రాశాను." అసలు దాసగణు మహారాజ్ గారు భౌతిక స్పృహ లేని పూర్తిస్థాయి ధ్యానంలో ఉన్నారు. ఈ అద్భుతాన్నీ దాసగణు మహరాజ్ గారికి B. V. N.స్వామీజీ ఇద్దరూ శ్రీ సాయిబాబా వారే స్వయంగా సాయి సహస్రనామను శ్రీ నరసింహ స్వామీజీకిగారి ద్వారా ధృవీకరించారు.
No comments:
Post a Comment