Monday, May 4, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 14వ అధ్యాయం,ప్రశ్నలు మరియు జవాబు లు

 శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

14వ అధ్యాయం,ప్రశ్నలు మరియు జవాబు లు 
ఓం శ్రీ సాయి రామ్

1. రతన్ జి ఎవరిని సత్కరించెను?
జవాబు) మౌలా సాహేబ్ అనే మహాత్ముని.

2. బాబా ఎంత దక్షిణ రతన్ జీ నుండి తీసుకొనెను?
జవాబు) 3 - 14  రూపాయలు.

3. సాఠే సంతానం ఏంతమంది?
జవాబు) ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

4. 6 రూపాయలు దక్షిణ బాబా ఎవరిని అడిగెను?
జవాబు) తర్కండ్ భార్యను.

5. భక్తులు రాగానే దక్షిణ అడిగి బడికి పంపుచుండిరి,బడి అనగా ఏమి?
జవాబు) రాధాకృష్ణ మాయి గృహము.

6. ఉద్యోగ విరమణ చేసిన మామలుతాదారు ఎవరు?
జవాబు) బి. వి. దేవ్, ఠాణ నివాసి.

7. 15 రూపాయలు దక్షిణ బాబా ఎవరిని అడిగెను?
జవాబు) ఫ్రొఫెసర్ జి. జి. నార్కే

8.  మానవులు గ్రహించిన ద అనే అక్షరం ఏమిటి?
జవాబు) దానము.

9. బాబా రతన్ జీ ని ఎంత దక్షిణ అడిగెను?
జవాబు) 5 రూపాయలు.

10. బాబా కొందరి వద్ద ఎన్ని సార్లు దక్షిణ అడిగేవారు?
జవాబు) 3,4 సార్లు.

11. రతన్ జీ దంపతుల కు కలిగిన సంతానం ఎంత మంది?
జవాబు) 12 మంది.

No comments:

Post a Comment