Saturday, June 8, 2024

కాశీనాథ్ గోవిందరావు ఉపాసనీ మహారాజ్ జన్మదినం..(మే15, 1870 – డిసెంబర్ 24, 1941)

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏..



     కాశీనాథ్ గోవిందరావు ఉపాసనీ మహారాజ్ జన్మదినం..(మే15, 1870 – డిసెంబర్ 24, 1941)


  1870వ సంవత్సరంలో నాసిక్ జిల్లాలోని సాతానా గ్రామంలో సంస్కృత పండితుల కుటుంబంలో జన్మించారు. 


    తండ్రి పేరు గోవింద్ శాస్త్రి మరియు అతని తల్లి రుక్మిణి...ఐదుగురు కుమారులలో ఉపాసనీ మహరాజ్ రెండవవారు..


    ఆయుర్వేద వైద్యునిగా వృత్తిని ప్రారంభించి.. ముగ్గురు భార్యలు మరణించిన తరువాత..అనేక ఇతర సమస్యల రావడంతో..అతను సాయిబాబాను కలవడానికి దారితీసింది..


    ఉపాసని మహారాజ్ జూలై 1917లో సకోరీకి మారారు.. బాబా 71 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 24, 1941న సకోరిలో సమాధి చెందారు..


    ఉపాసనీ మహారాజ్ మెహర్ బాబాకు ప్రధాన గురువు..1915లో ఉపాసని మహరాజ్ సాయిబాబాతో షిర్డీలో ఉన్నప్పుడు మెహర్ బాబా మొదటిసారిగా ఉపాసనీ మహారాజ్‌ను కలిశారు...మెహెర్ బాబా 1922 అక్టోబరు వరకు తరచుగా సాకోరిలోనే ఉండేవారు...


      1921 చివరలో ఉపాసనీ మహారాజ్ మెహర్ బాబాకు సంబంధించి తన శిష్యులకి.."నా బాధ్యతను మెహర్వాన్జీకి ఇచ్చాను..వారిని తనలాగే గురువుగా భావించండి" అని చెప్పారు..


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹...

No comments:

Post a Comment